logo

హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు

హైకోర్టు న్యాయమూర్తులుగా శనివారం మరో ఇద్దరు బాధ్యతలు స్వీకరించారు. శనివారం హైకోర్టు కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.మురళీధర్‌ జస్టిస్‌ గౌరీ శంకర్‌ శత్పథి, జస్టిస్‌ చిత్తరంజన్‌ దాసులతో

Published : 14 Aug 2022 04:53 IST

కటక్‌, న్యూస్‌టుడే: హైకోర్టు న్యాయమూర్తులుగా శనివారం మరో ఇద్దరు బాధ్యతలు స్వీకరించారు. శనివారం హైకోర్టు కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.మురళీధర్‌ జస్టిస్‌ గౌరీ శంకర్‌ శత్పథి, జస్టిస్‌ చిత్తరంజన్‌ దాసులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి దేవరంజన్‌ కుమార్‌ సింగ్‌ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులు చదివి వినిపించారు. దీంతో హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 25కు చేరింది. కార్యక్రమంలో డీజీపీ సంజయ్‌ కుమార్‌ బన్సల్‌, కలెక్టర్‌ భవానీశంకర్‌ ఛయనీ, జంట నగరాల పోలీస్‌ కమిషనర్‌ సౌమేంద్ర ప్రియదర్శి, హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని