ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం
ఉత్తర బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఆదివారం ఉదయానికిది వాయుగుండంగా మారే అవకాశం ఉందని గోపాలపూర్ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్ దాస్ మధ్యాహ్నం
నేడు వాయుగుండంగా మారే అవకాశం
రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ
గోపాలపూర్, న్యూస్టుడే: ఉత్తర బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఆదివారం ఉదయానికిది వాయుగుండంగా మారే అవకాశం ఉందని గోపాలపూర్ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్ దాస్ మధ్యాహ్నం ‘న్యూస్టుడే’కు చెప్పారు. పీడనం ప్రభావంతో రానున్న 48 గంటల వరకు తీర ప్రాంతాల్లో గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్రంలో అలల ఉద్ధృతి తీవ్రంగా ఉన్నందున మత్స్యకారుల చేపల వేట 15వ తేదీ వరకు నిషేధించినట్లు తెలిపారు. పీడనం వల్ల శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన జిల్లాలు
7 జిల్లాలకు రెడ్ హెచ్చరికలు
పూరీ, కటక్, జగత్సింగ్పూర్ జాజ్పూర్, కేంద్రపడ, ఢెంకనాల్, భద్రక్ జిల్లాల్లో ఆదివారం 20 సెంటీమీటర్ల వర్షం కురిసే సూచనలున్నందున రెడ్ హెచ్చరికలు చేసినట్లు దాస్ చెప్పారు. ఖుర్ధా, గంజాం, నయాగఢ్, గజపతి, బాలేశ్వర్, మయూర్భంజ్, కేంఝర్, అనుగుల్, సంబల్పూర్, సోన్పూర్, బరగఢ్, బౌద్ధ్, కొంధమాల్, కలహండి, రాయగడ జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ హెచ్చరికలు చేశారు. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని ఎల్లో హెచ్చరికలు చేశామని దాస్ తెలిపారు.
జనజీవనం అస్తవ్యస్తం
భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రంలో ప్రధాన నగరాలు, పట్టణాల్లో మార్కెట్లు వెలవెలబోయాయి. తీర ప్రాంతాల్లో సముద్రం అలల ఉద్ధృతి తీవ్రంగా కనిపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధి కొనసాగుతుంది..శంక ద్వయాన్ని ఆశీర్వదించండి
[ 25-04-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, బిజదను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజల్ని కోరారు. -
భాజపాకు 40 మంది స్టార్ ప్రచారకులు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపా స్టార్ ప్రచారకుల జాబితా మంగళవారం రాత్రి విడుదల చేశారు. -
ఇంకెన్నాళ్లీ దుస్థితి?
[ 25-04-2024]
అధ్వానంరాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయన్న నివేదికలు దిగజారిన ‘నాక్’ గ్రేడేషన్లు దుస్థితిని తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి నిలదీశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో భర్తీకాని టీచింగ్ సిబ్బంది, అసౌకర్యాలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ల గురించి ఏం సమాధానం చెబుతారన్నారు. -
ఓ తండ్రి...ఇద్దరు కొడుకులు
[ 25-04-2024]
గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నామినేషన్ల సందడి
[ 25-04-2024]
బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్ పత్రాన్ని సబ్ కలెక్టర్ అనూప్ పండాకు అందజేశారు. -
భాజపాలో సీమారాణి చేరిక
[ 25-04-2024]
బిజదకు రాజీనామా చేసిన హిందళ్ సిటింగ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్ బుధవారం భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర నాయకులు ఆమెను స్వాగతించారు. -
నేడు అమిత్షా రాక
[ 25-04-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం సోన్పూర్లో ఏర్పాటయ్యే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
నా ఓటు.. నా బాధ్యత
[ 25-04-2024]
నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం