రాష్ట్రానికి వరద ముప్పు?
రాష్ట్రానికి వరద ముప్పు పొంచి ఉందన్న అంచనాతో యంత్రాంగం ముందస్తు చర్యలు ప్రారంభించింది. భువనేశ్వర్లోని జలవనరుల శాఖ కార్యాలయంలో 247 కంట్రోల్ రూం శనివారం ప్రారంభించారు. ఆ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనుగార్గ్, చీఫ్
సిబ్బంది సెలవులు రద్దు: కంట్రోల్ రూం ఏర్పాటు
మహానదిపై జలవనరులశాఖ నిఘా
34 గేట్ల ద్వారా హిరాకుడ్ నీరు విడుదల
విడుదలవుతున్న హిరాకుడ్ నీరు
భువనేశ్వర్, న్యూస్టుడే: రాష్ట్రానికి వరద ముప్పు పొంచి ఉందన్న అంచనాతో యంత్రాంగం ముందస్తు చర్యలు ప్రారంభించింది. భువనేశ్వర్లోని జలవనరుల శాఖ కార్యాలయంలో 247 కంట్రోల్ రూం శనివారం ప్రారంభించారు. ఆ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనుగార్గ్, చీఫ్ ఇంజినీరు బిజయ్ కుమార్ మిశ్ర, ఇతర ఉన్నతాధికారులు పరిస్థితి సమీక్షిస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అత్యవసర శాఖల సిబ్బంది సెలవులను రద్దు చేశారు.
భారీ వర్షాలతో అతలాకుతలం
బంగాశాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శనివారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. ఉత్తర కోస్తాలో అతిభారీగా ఉన్నందున నదుల్లో ప్రవాహాలు పెరిగాయి. అఖువాపద వద్ద (కేంఝర్ జిల్లా) వైతరణి శనివారం మధ్యాహ్నం ప్రమాద స్థాయి దాటింది. ఇక్కడ నది ప్రమాదస్థాయి 17.83 మీటర్లు కాగా 18.23 మీటర్లకు పెరిగినట్లు జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీరు మిశ్ర విలేకరులకు చెప్పారు. బాలేశ్వర్ జిల్లా మధాని వద్ద జలకా ప్రమాదస్థాయి 5.5 మీటర్లు అని, మధ్యాహ్నం ప్రవాహం 5.98కి పెరిగినట్లు తెలిపారు. సువర్ణరేఖ, బ్రహ్మణి, బుఢాబొలంగ, రుషికుల్యా, వంశధార, నాగావళి, తేల్, ఉదంతి, కఠజోడి, దయ, భార్గవి, కుశభద్ర, మహానదిలో ప్రవాహాలు పెరిగినా ప్రమాదస్థాయి దిగువ ప్రవహిస్తున్నాయని చెప్పారు. హిరాకుడ్ వరదనీరు 34 గేట్ల ద్వారా విడుదలవుతోంది. ఈ ప్రవాహం మహానదికి చేరుతోందని, సోమవారం ఉదయంలోగా కటక్లోని ముండలి వద్ద నది ప్రవాహం 8 లక్షల క్యూసెక్కులుగా ఉంటుందన్న అంచనా ఉంది. ఈ నేపథ్యంలో మహానదికి స్వల్పంగా వరద ముప్పు ఉండొచ్చన్న అంచనాతో పరివాహక ప్రాంతాలకు అధికారులను తరలించినట్లు జలవనరులశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనుగార్గ్ తెలిపారు.
పశ్చిమ ఒడిశాలో భయాందోళన
పశ్చిమ ఒడిశాలోని సంబల్పూర్, సోన్పూర్, బౌద్ధ్ జిల్లాలు మహానది వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి. శనివారం 2 గంటలకు సంబల్పూర్ (బుర్లా) హిరాకుడ్ జలాశయంలోకి ఇన్ఫ్లో 4.85 లక్షల క్యూసెక్కులకు పెరిగినట్లు డ్యాం చీఫ్ ఇంజినీరు ఆనందచంద్ర సాహు విలేకరులకు చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 28 స్విస్ గేట్ల ద్వారా సెకనుకు 3,48,760 క్యూసెక్కుల నీరు మహానదికి విడుదల చేస్తున్నామన్నారు. జలాశయం సామర్థ్యం 630 అడుగులు కాగా నీటిమట్టం 617.05 అడుగులుగా ఉన్నట్లు చెప్పారు. ఛత్తీస్గఢ్ ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నందున అక్కడి కల్మా జలాశయం ద్వారా విడుదల చేస్తున్న వరద నీరు హిరాకుడ్లోకి ప్రవేశిస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని, అవసరమైతే మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉందని పేర్కొన్నారు. నదికి నీరు విడుదల చేయడంతో సంబల్పూర్ లోతట్టు ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. ఆ జిల్లా కలెక్టరు అనన్యదాస్ మధ్యాహ్నం పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ లోతట్టు గ్రామాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. మైకుల ద్వారా గ్రామాల్లో ప్రచారం చేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు.
కోస్తా, పశ్చిమ ప్రాంతాలకు ముప్పు?
ఉత్తర కోస్తా, పశ్చిమ ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు అప్రమత్తం చేసినందున సత్వర చర్యలు తీసుకోవాలని విపత్తుల నివారణ శాఖ కలెక్టర్లకు ఆదేశించింది. ప్రత్యేక రిలీఫ్ కమిషనర్ ప్రదీప్ కుమార్ జెనా ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తూ కలెక్టర్లతో మాట్లాడుతున్నారు. మహానదికి వరదలొస్తే ఉపనదులూ పొంగిపొర్లుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అత్యవసర చర్యలు తీసుకున్నామని జెనా విలేకరులకు చెప్పారు.
పరవళ్లు తొక్కుతున్న వైతరణి నది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడేళ్ల శిశువుపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్
[ 29-03-2024]
గజపతి జిల్లా మోహన ఠాణా పరిధిలో మూడేళ్ల శిశువుపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకోంది. -
గొంతు కోసి యువకుడి దారుణ హత్య
[ 29-03-2024]
గజపతి జిల్లాలోని గుసాని సమితి గురండి ఠాణా పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. -
కాషాయం కండువాలు ధరించిన అగ్రనేతలు
[ 29-03-2024]
దిల్లీ భాజపా కార్యాలయం వేదికగా గురువారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో ఇద్దరు ప్రముఖ నేతలు, మరో ప్రముఖ రచయిత్రి కాషాయం కండువాలు ధరించారు. -
తోడేలు దాడిలో ఇద్దరికి గాయాలు
[ 29-03-2024]
మల్కాన్గిరి సమితి ఎమ్.వి.93 గ్రామంలో ఇద్దరిపై తోడేలు దాడి చేయడంతో, పోరాడి హతమార్చారు. ఈ క్రమంలో వీరికి తీవ్ర గాయాలయ్యాయి -
డబుల్ ఇంజిన్ పాలన తథ్యం: అపరాజిత
[ 29-03-2024]
రాష్ట్రంలో భాజపా డబుల్ ఇంజిన్ పాలన తథ్యమని, ప్రజల్లో మార్పు కనిపిస్తోందని భువనేశ్వర్ సిటింగ్ ఎంపీ అపరాజిత షడంగి చెప్పారు. -
బిజదలో అసమ్మతి సెగ
[ 29-03-2024]
ఎన్నికల ముందు అధికార పక్షం బిజదలో అసమ్మతి సెగ తగలడంతో పార్టీకి తలనొప్పిగా మారుతోంది. రాయగడ శాసనసభ నియోజకవర్గ టికెట్ అనుసూయ మాఝికి కేటాయించడంపై రెండు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటుండడం పార్టీ శ్రేణులకు మింగుడుపడడం లేదు -
గోపాల్పూర్ ఓడరేవు కొనుగోలు చేసిన అదానీ
[ 29-03-2024]
తూర్పు తీరంలో సరకు రవాణాలో అగ్రగామిగా ఉన్న గోపాల్పూర్ ఓడరేవును ప్రముఖ పారిశ్రామిక గ్రూపు అదానీ కొనుగోలు చేసింది -
ప్రతిష్ఠాత్మక నియోజకవర్గం పోరు రసవత్తరం
[ 29-03-2024]
బిజద అభ్యర్థి బిక్రం పండాకు గోపాల్పూర్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నియోజకవర్గం ఓటర్లందరికీ చిరపరిచితులు. భంజవిహార్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన తొలినాళ్లలో విద్యార్థి నేత -
ఎన్నికల బరిలో అతివలకు అవకాశం
[ 29-03-2024]
ఎన్నికల్లో మహిళా అభ్యర్థులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని బిజద ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగా ఎన్నికల బరిలో పోటీపడేందుకు మహిళలకు అవకాశం కల్పించారు. -
‘రిడ్లీ’ల రాకకు ఎదురుచూపు
[ 29-03-2024]
విదేశీ అతిథులు ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ల రాక వల్ల గంజాం జిల్లా ఖ్యాతిగాంచింది. రాష్ట్రంలోని రిడ్లీల పునరుత్పత్తికి మూడు కేంద్రాలుండగా, వీటిలో గంజాం జిల్లాలోని రుషికుల్యా ముఖద్వారం ఒకటి. -
శ్రీక్షేత్రంలో మీనాక్షి శేషాద్రి
[ 29-03-2024]
ప్రముఖ బాలీవుడ్ (ముంబయి) నటి, నర్తకి మీనాక్షి శేషాద్రి గురువారం పూరీ వచ్చారు. శ్రీక్షేత్రంలో జగన్నాథుడి సన్నిధిలో పూజలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి