అంతటా మువ్వన్నెల రెపరెపలు.. ఇంటింటా జెండాలు
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. బ్రహ్మపురలోని ప్రభుత్వ, పైవేటు విద్యాసంస్థలు, ఇతరత్రా సంస్థల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ఒడిశా నేవల్
ఎన్సీసీ ఆధ్వర్యంలో పతాకాలతో ర్యాలీకి జెండా ఊపుతున్న వీసీ ఆచార్య మహంతి
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. బ్రహ్మపురలోని ప్రభుత్వ, పైవేటు విద్యాసంస్థలు, ఇతరత్రా సంస్థల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ఒడిశా నేవల్ యూనిట్ ఎన్సీసీ ఆధ్వర్యంలో ఉదయం స్థానిక గాంధీనగర్లోని గ్రూప్ హెడ్క్వార్టర్స్ కార్యాలయం వద్ద పతాకాలతో ర్యాలీ ప్రారంభించారు. కళ్లికోట వర్సిటీ ఉపకులపతి (వీసీ) ఆచార్య ప్రఫుల్లకుమార్ మహంతి ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీకి జెండా ఊపారు. భాజపా ఆధ్వర్యంలో స్థానిక అస్కా రోడ్డులో పెద్దబజారు ఠాణా ఆవరణలోని షహీదు సుశాంత గౌడ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ పతాకాలతో నగరంలో ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు. భాజపా నాయకులు భృగు బక్షిపాత్ర్, కన్హుచరణ పతి తదితరులు పాల్గొన్నారు. స్థానిక అంధపసర రోడ్డులోని ఓ భవంతిని మువ్వన్నెల పతాకాలతో అలంకరించారు. భవనంపై చుట్టూ సుమారు వంద అడుగుల జాతీయ పతాకాన్ని అలంకరించారు. నగరంలోని పలు బహుళ అంతస్థులు, ఇళ్ల మేడలపై ప్రజలు జాతీయ పతాకాలు ఎగురవేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ బహుముఖి సంఘం ఆధ్వర్యంలో స్థానిక కోర్టుపేట కూడలిలో 2018 నుంచి ప్రతిరోజు ఉదయం జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ, సాయంత్రం దాన్ని అనవతం చేస్తున్నారు. ఉదయం సంఘం అధ్యక్షుడు రామ్కుమార్ పాత్ర్ తదితరులు జెండా వందనం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధి కొనసాగుతుంది..శంక ద్వయాన్ని ఆశీర్వదించండి
[ 25-04-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, బిజదను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజల్ని కోరారు. -
భాజపాకు 40 మంది స్టార్ ప్రచారకులు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపా స్టార్ ప్రచారకుల జాబితా మంగళవారం రాత్రి విడుదల చేశారు. -
ఇంకెన్నాళ్లీ దుస్థితి?
[ 25-04-2024]
అధ్వానంరాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయన్న నివేదికలు దిగజారిన ‘నాక్’ గ్రేడేషన్లు దుస్థితిని తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి నిలదీశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో భర్తీకాని టీచింగ్ సిబ్బంది, అసౌకర్యాలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ల గురించి ఏం సమాధానం చెబుతారన్నారు. -
ఓ తండ్రి...ఇద్దరు కొడుకులు
[ 25-04-2024]
గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నామినేషన్ల సందడి
[ 25-04-2024]
బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్ పత్రాన్ని సబ్ కలెక్టర్ అనూప్ పండాకు అందజేశారు. -
భాజపాలో సీమారాణి చేరిక
[ 25-04-2024]
బిజదకు రాజీనామా చేసిన హిందళ్ సిటింగ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్ బుధవారం భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర నాయకులు ఆమెను స్వాగతించారు. -
నేడు అమిత్షా రాక
[ 25-04-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం సోన్పూర్లో ఏర్పాటయ్యే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
నా ఓటు.. నా బాధ్యత
[ 25-04-2024]
నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్