జల దిగ్బంధం
మహానది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో సంబల్పూర్ జిల్లా లోతట్టు ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. రహదారులు, పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. 1500 కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాలకు పశ్చిమ ఒడిశాలోని సోన్పూర్, బౌద్ధ్, బరగఢ్, దేవ్గఢ్ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు
నదులకు పోటెత్తిన వరద
చెరువులను తలపిస్తున్న లోతట్టు ప్రాంతాలు
పశ్చిమ ప్రాంతాలు ప్రభావితం
మహానది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో సంబల్పూర్ జిల్లా లోతట్టు ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. రహదారులు, పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. 1500 కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాలకు పశ్చిమ ఒడిశాలోని సోన్పూర్, బౌద్ధ్, బరగఢ్, దేవ్గఢ్ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. రాకపోకలు స్తంభించాయి. కుండపోత వర్షాలు ఇలాగే కొనసాగితే.. హిరాకుడ్ గేట్లు తెరిచినా.. బొలంగీర్, కలహండి, నుపవాపడ జిల్లాలపై ప్రభావం పడుతుంది.
ఆనందపూర్ వద్ద వైతరణి నది పరవళ్లు. పరిస్థితి తిలకిస్తున్న జలవనరులశాఖ ఇంజినీర్లు
ముండలి వద్ద పెరుగుతున్న ప్రవాహం
కటక్ జిల్లా ముండలి బ్యారేజీ వద్ద శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు 5.68 క్యూసెక్కుల మేర నీరు ప్రవహిస్తోంది. సోమవారం ఉదయానికి 8 లక్షల క్యూసెక్కులుగా ఉండొచ్చని జలవనరుల నిపుణులు అంచనా వేస్తున్నారు. కటక్ జిల్లాలోని ముండలి, రాజ్ఘాట్, బర్మూల్, ఖరాయిమాల్ బ్యారేజీల్లో నీటి మట్టం పెరిగి, కటక్, జగత్సింగ్పూర్, కేంద్రపడ, పూరీ, ఖుర్ధా జిల్లాల్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశాలు ఉన్నాయి.
యంత్రాంగం అప్రమత్తం
ఒడిశా స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ అథారిటీ(ఓఎస్డీఎంఏ), అగ్నిమాపక, ఓడ్రాఫ్, జల వనరుల శాఖలను.. అధికారులు అప్రమత్తం చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో జలవనరుల సిబ్బంది పరిస్థితి సమీక్షిస్తున్నారు. గట్లకు గండి పడితే తక్షణ మరమ్మతులు చేసేందుకు ఇసుక బస్తాలు, ఇతర సామగ్రి సిద్ధం చేశారు. సహాయ, పునరావాస కార్యక్రమాలకు ఓడ్రాఫ్, అగ్నిమాపక సిబ్బంది సన్నద్ధమయ్యారు. ఆహారం, మంచినీరు, ఔషధాలు తదితరాలు సిద్ధం చేశారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.
హిరాకుడ్ నుంచి దిగువకు పరవళ్లు తొక్కుతున్న నీరు
భువనేశ్వర్, న్యూస్టుడే: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు, జలాశయాలకు వరద పోటెత్తింది. రహదారులు, పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. మహానదిలో అంతకంతకూ నీటి స్థాయి పెరుగుతుండడంతో వరద ముప్పు వెంటాడుతోంది.
ప్రమాద స్థాయికి చేరువలో
కేంఝర్ జిల్లాలోని ఆనందపూర్ వద్ద వైతరణి నది నీటి మట్టం ప్రమాదస్థాయి దాటి 18.28 మీటర్ల మేర ప్రవహిస్తోంది. బాలేశ్వర్ జిల్లాలోని మధాని వద్ద జలకా నది సైతం 5.96 మీటర్ల స్థాయిలో ప్రవహిస్తోంది. సువర్ణరేఖ, బుడాబొలంగ, దేవి, కుశభద్ర, తేల్, ఉదంతి, వంశధార, నాగావళి, రుషికుల్య, హరభంగీ, బొడొనదుల్లో వరద పోటెత్తినట్లు జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీరు బిజయ్ కుమార్ మిశ్ర విలేకరులకు వెల్లడించారు.
మహానది ఉగ్రరూపం
ఛత్తీస్గఢ్ ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు పడుతుండడంతో కల్మా ఇతర జలాశయాల నుంచి సంబల్పూర్ హిరాకుడ్ జలాశయానికి వరద నీరు ప్రవేశిస్తోంది. ఈ జలాశయం సామర్థ్యం 630 అడుగులు కాగా, మధ్యాహ్నం 12.30 గంటలకు నీటి మట్టం 616.60 అడుగులకు చేరుకుంది. సెకనుకి 5,79,680 క్యూసెక్కుల నీరు ప్రవేశిస్తుండడంతో 34 స్విస్ గేట్ల ద్వారా సెకనకు 5,61,054 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు డ్యాం చీఫ్ ఇంజినీరు ఆనంద చంద్రసాహు విలేకరులకు చెప్పారు. అవసరమైతే మరిన్ని గేట్లు తెరుస్తామన్నారు. హిరాకుడ్ నుంచి నీరు విడుదల అవుతుండడంతో మహానది ఉగ్రరూపం దాల్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారసులొచ్చారు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొంతమంది ప్రముఖ నాయకులు పోటీ నుంచి తప్పుకున్నారు. వారి భార్యలు, వారసులను బరిలోకి దించారు. బిజద, భాజపా, కాంగ్రెస్ పార్టీల నాయకత్వాలు వారికి అవకాశం కల్పించాయి. తండ్రులు, తల్లులు వారి తరుఫున ప్రచారం చేస్తున్నారు. -
కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘హెర్’ టీం
[ 19-04-2024]
మహిళల్ని వేధించే వారి భరతం పట్టడానికి జంటనగరాల (భువనేశ్వర్, కటక్) కమిషనరేట్ యంత్రాంగం ‘హై ఎఫిషియన్సీ రెస్పాన్స్ (హెరా) టీం ఏర్పాటు చేసింది. -
సత్వర విద్యుత్తు సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు
[ 19-04-2024]
వేసవిలో ప్రజలకు మరింత మెరుగైన విద్యుత్తు సేవలు అందించేందుకు, సరఫరాలో అంతరాయం ఏర్పడితే సత్వర సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు సిద్ధం చేశామని విద్యుత్తు సరఫరా సంస్థ ‘టాటా పవర్ సదరన్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్’ (టీపీఎస్ఓడీఎల్) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది -
జగన్నాథునికి రూ.2.51 కోట్ల విరాళం
[ 19-04-2024]
రిలయన్స్ గ్రూపు సంస్థల అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ బుధవారం పూరీ శ్రీక్షేత్రానికి వచ్చారు. జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
సచిదాస్ కన్నుమూత
[ 19-04-2024]
జత్రా పార్టీ (నాటకాలు) దర్శకునిగా, నటునిగా ఖ్యాతి గాంచిన సచిదాస్ (91) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అస్వస్థతతో కటక్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. -
ఎవరి ప్రయోజనాల కోసం రెండుచోట్ల పోటీ?
[ 19-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మళ్లీ రెండుచోట్ల పోటీకి సిద్ధమయ్యారు. దీనివల్ల ప్రజలకు ఒరిగేదేమిటని? ఈ పోటీ ఎవరి ప్రయోజనాల కోసమని? సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో ఉప ఎన్నిక, వ్యయప్రయాసలు మినహా సాధించేదేమిటని విమర్శలు వినిపిస్తున్నాయి. -
నేటి నుంచి మజ్జిగౌరీ చైత్రోత్సవాలు
[ 19-04-2024]
రాయగడ ఉత్కళాంధ్రుల ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవ సంబరాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
‘శ్రేష్ఠ భారత్’ ఏర్పాటుకు అంతా సహకరించాలి
[ 19-04-2024]
‘శ్రేష్ఠ భారత్’ లక్ష్యంగా దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలు, అన్ని రంగాల సమగ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ 2024 సంకల్ప పత్రం జారీ చేశారని, ప్రజలంతా సహకరించి, మరోసారి మోదీని ప్రధాని చేసేందుకు ముందుకు రావాలని బ్రహ్మపుర లోక్సభ భాజపా అభ్యర్థి ప్రదీప్ కుమార్ పాణిగ్రహి కోరారు -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 19-04-2024]
గంజాం జిల్లా గొళంత్రా ఠాణా పరిధిలోని కొణిసి-తుళు మార్గంలో బుధవారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు యువకులు ఎమ్కేసీజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి