గ్రామస్థులు పొమ్మన్నారు... అధికారులు ఆదుకున్నారు
దేశం కరోనా వంటి మహమ్మారిపై యుద్ధం చేసి జయించింది. మరోవైపు కొందరి అనవసర భయాలు మానవత్వాన్ని చంపేస్తున్నాయి. ఇందుకు ఉదాహరణే సోన్పూర్ జిల్లా ఊలుండా సమితి మహిద గ్రామంలో శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఘటన. వ్యాధి అనుమానంతో
బాధితురాలు చంచల సాహు
కటక్, న్యూస్టుడే: దేశం కరోనా వంటి మహమ్మారిపై యుద్ధం చేసి జయించింది. మరోవైపు కొందరి అనవసర భయాలు మానవత్వాన్ని చంపేస్తున్నాయి. ఇందుకు ఉదాహరణే సోన్పూర్ జిల్లా ఊలుండా సమితి మహిద గ్రామంలో శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఘటన. వ్యాధి అనుమానంతో మూడేళ్లుగా ఒక వృద్ధురాలిని గ్రామానికి దూరంగా ఒంటరిగా వదిలేసిన అమానవీయ ఘటన అందరినీ కలచివేసింది. ఈ ఘటన పూర్వపరాల్లోకి వెళితే... గ్రామంలో చంచల సాహు (60) అనే వితంతువు కుమారుడు బిబూతి సాహు (27)తో కలసి ఉంటోంది. కొన్నేళ్ల క్రితం ఆమె కాలుకు గాయమైంది. అది తగ్గకపోవడంతో కొంతమంది గ్రామస్థులు కుష్ఠువ్యాధి సోకినట్లు అనుమానించారు. వ్యాధిగ్రస్థురాలు గ్రామంలో ఉండడానికి వీల్లేదని పేర్కొంటూ వేరే ప్రాంతానికి వెళ్లిపోవాలని చెప్పారు. చంచల బంధువులు కూడా అదే మాట అన్నారు. దీంతో తనతోపాటు తన కుమారుడ్ని కూడా వెలివేస్తారనే భయంతో ఆయనను గ్రామంలోనే వదిలి ఆమె గ్రామానికి సమీపంలో ఉన్న మహానది గట్టుపై పాలీథిన్తో గుడారం వేసుకొని మూడేళ్లుగా ఉంటోంది. రాత్రి సమయంలో చీకటిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపేది. కొడుకు ఆమెకు భోజనం తెచ్చి పెట్టి వెళ్లిపోయేవాడు. ఇటీవల వర్షాలతో నదికి వరదలు రావడంతో నీటి మట్టం పెరిగింది. చంచల ఉంటున్న గుడారంలోకి పాములు, విష కీటకాలు ప్రవేశించాయి. దీంతో రాత్రంతా భయంతో నిద్రలేకుండా గడిపేది. ఈ నేపథ్యంలో వరద పరిస్థితి తెలుసుకునేందుకు వచ్చిన స్థానిక జిల్లా అధికారులు ఆమెను చూసి ఆదుకునేందుకు ముందుకొచ్చారు. బుధవారం రాత్రి అంబులెన్స్ రప్పించి ఆమెను జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స ప్రారంభించారు. ఆమెకి కుష్ఠువ్యాధి లేదని వైద్యులు తెలిపారు. అధికారులు గురువారం గ్రామానికి వెళ్లి చంచల సాహుకి వ్యాధి లేదని, గాయం త్వరలో తగ్గుతుందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధి కొనసాగుతుంది..శంక ద్వయాన్ని ఆశీర్వదించండి
[ 25-04-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, బిజదను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజల్ని కోరారు. -
భాజపాకు 40 మంది స్టార్ ప్రచారకులు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపా స్టార్ ప్రచారకుల జాబితా మంగళవారం రాత్రి విడుదల చేశారు. -
ఇంకెన్నాళ్లీ దుస్థితి?
[ 25-04-2024]
అధ్వానంరాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయన్న నివేదికలు దిగజారిన ‘నాక్’ గ్రేడేషన్లు దుస్థితిని తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి నిలదీశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో భర్తీకాని టీచింగ్ సిబ్బంది, అసౌకర్యాలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ల గురించి ఏం సమాధానం చెబుతారన్నారు. -
ఓ తండ్రి...ఇద్దరు కొడుకులు
[ 25-04-2024]
గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నామినేషన్ల సందడి
[ 25-04-2024]
బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్ పత్రాన్ని సబ్ కలెక్టర్ అనూప్ పండాకు అందజేశారు. -
భాజపాలో సీమారాణి చేరిక
[ 25-04-2024]
బిజదకు రాజీనామా చేసిన హిందళ్ సిటింగ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్ బుధవారం భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర నాయకులు ఆమెను స్వాగతించారు. -
నేడు అమిత్షా రాక
[ 25-04-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం సోన్పూర్లో ఏర్పాటయ్యే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
నా ఓటు.. నా బాధ్యత
[ 25-04-2024]
నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)