logo

చెట్టును ఢీకొన్న ద్విచక్రవాహనం: కానిస్టేబుల్‌ మృతి

ద్విచక్రవాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో కానిస్టేబుల్‌ మృతి చెందిన ఘటన చర్చనీయాంశమైంది. నందాపూర్‌ ఎస్‌డీపీవో సంజయ్‌మహపాత్ర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జోలాపుట్‌ అవుట్‌పోస్టులో

Published : 19 Aug 2022 03:25 IST

మాచ్‌ఖండ్‌, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో కానిస్టేబుల్‌ మృతి చెందిన ఘటన చర్చనీయాంశమైంది. నందాపూర్‌ ఎస్‌డీపీవో సంజయ్‌మహపాత్ర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జోలాపుట్‌ అవుట్‌పోస్టులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ధనపతిఅంగెల్‌ బుధవారం రాత్రి విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై  కొరాపుట్‌ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇంటికి ఇంకా రాకపోవడంతో కుటుంబసభ్యులే జోలాపుట్ సోగూరు మార్గమధ్యలోని బిల్లాపుట్‌ వద్ద పడి ఉన్న ధనపతిని గుర్తించారు. విషయం తెలుసుకున్న నందపూర్‌ ఎస్‌డీపీవో సంజయ్‌ మహపాత్ర్‌ ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. గంజాయి వ్యాపారులు ఏమైనా చేసుంటారన్న అనుమానంతో డాగ్‌ స్వ్కాడ్‌, సాంకేతిక బృందంలో పరిశీలించారు. అలాంటి ఆనవాళ్లు ఏమీ కనిపించకపోవడంతో అతివేగం వలనే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని