Diabetes: పచ్చి పనసకాయ పొడితో మధుమేహం నియంత్రణ
పచ్చి పనసకాయతో తయారు చేసిన పొడి రోజూ కొంత మొత్తంలో తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందని అధ్యయనంలో తేలింది.
రోగుల్లో గ్లూకోజు స్థాయిలు తగ్గుతున్నట్లు గుర్తింపు
జాక్ఫ్రూట్ 365ను విడుదల చేస్తున్న డాక్టర్ లత శషి, జేమ్స్ జోసఫ్, మహారాణా
ఈనాడు, హైదరాబాద్: పచ్చి పనసకాయతో తయారు చేసిన పొడి రోజూ కొంత మొత్తంలో తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందని అధ్యయనంలో తేలింది. రోజూ వాడుతున్న మందులతోపాటు ఈ పొడి డయాబెటిక్ను తగ్గించడంలో కీలకంగా పనిచేస్తున్నట్లు అధ్యయంలో గుర్తించామని జాక్ఫ్రూట్365.కమ్ వ్యవస్థాపకుడు జేమ్స్ జోసెఫ్ తెలిపారు. ఈ వివరాలను శుక్రవారం ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ లతా శశి, ఎండోక్రినాలజిస్టు డాక్టర్ వినోద్ అభిచందానీతో కలిసి హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్లినికల్ ట్రయల్స్కు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రిసెర్చ్, ఎథిక్స్ కమిటీ నుంచి అనుమతి తీసుకున్నామని వివరించారు. శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో 40 మంది టైప్-2 మధుమేహ బాధితులపై 12 వారాలపాటు ఈ అధ్యయనం చేశామన్నారు.
అధ్యయనంలో భాగంగా వీరిని రెండు గ్రూపులుగా విడదీసి ఒకరికి పచ్చి పనస కాయతో చేసిన పొడి (రోజుకు 30 గ్రాములు), మిగతా వారికి బియ్యం లేదా గోధుమపిండి (ప్లాసిబో ఫ్లోర్) అంతే మొత్తంలో అందించామన్నారు. తర్వాత వారిని పరీక్షించగా ఆశ్చర్యకర ఫలితాలు వెల్లడైనట్లు తెలిపారు. పనసకాయ పొడి తీసుకున్న వారిలో గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ (హెచ్బీఏ1సీ), ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ (ఎఫ్బీజీ), పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్ (పీపీజీ)లో గణనీయ మార్పు కన్పించందన్నారు.
ఈ స్థాయిలన్ని మునుపటికంటే తగ్గినట్లు గుర్తించామన్నారు. అదే ప్లాసిబో ఫ్లోర్ వినియోగించిన వారిలో ఎలాంటి తేడా లేదన్నారు. మధుమేహానికి సాధారణ మందులు వాడుతూనే అదనంగా ఈ పొడి తీసుకోవడం ఎంతో మేలు చేస్తుందని జేమ్స్ జోసెఫ్ వివరించారు. ఈ పొడి ఇప్పుడు మార్కెట్లో వివిధ పేర్లతో అందుబాటులో ఉందన్నారు. ఈ పొడితోపాటు మధుమేహానికి ఇచ్చే మందులు యథావిధిగా వాడాల్సి ఉంటుందని, కొందరిలో మాత్రం రోజుకు 2 మాత్రలకు బదులు ఒకటితో సరిపెట్టవచ్చునని డయాబెటాలజిస్ట్, ఎండోక్రినాలజిస్టు డాక్టర్ వినోద్ అభిచందానీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటరుతో మాట...నేతల కొత్త బాట
[ 23-04-2024]
ఈ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు కీలకం. ఒకవైపు మోదీ కోసం భాజపా ఉద్యమిస్తుంటే... ఆరోసారి ముఖ్యమంత్రిగా నవీన్ను చూడాలని బిజద ప్రయత్నిస్తోంది. -
రాజకీయ ప్రత్యర్థులు ఎదురుపడిన వేళ...
[ 23-04-2024]
బ్రహ్మపురలోని గంజాం న్యాయవాదుల సంఘం (జీబీఏ) సమావేశ మందిరం ఆవరణలో సోమవారం రాజకీయ ప్రత్యర్థులు ఎదురుపడ్డారు. -
ఆరుగురితో బిజద 7వ జాబితా
[ 23-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోమవారం 6 అసెంబ్లీ స్థానాలకు 7వ జాబితా ప్రకటించారు. క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి తుషార్కాంతి బెహరాకు, విద్యాశాఖ మంత్రి సుధాం మారాండి భార్య రంజితాకు, ఢెంకనాల్ ఎంపీ ముహేష్సాహుకు టికెట్లు కేటాయించారు. -
కేంద్రపడ బిజదలో భగ్గుమన్న అసంతృప్తి
[ 23-04-2024]
పార్టీకి విధేయులుగా ఉన్నవారిని పక్కన పెట్టి ఫిరాయింపు నేతలకు ఎన్నికల బరిలో దించడంతో కేంద్రపడ జిల్లా బిజదలో అసంతృప్తి భగ్గుమంది. -
సనాతన్ మహాకుడోకు పిలిచి టికెట్ ఇచ్చిన సీఎం
[ 23-04-2024]
గనులకు నిలయమైన కేంఝర్ జిల్లాలో అంతా కుబేరునిగా చెప్పుకునే సనాతన్ మహాకుడోకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక చంపువా అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా చేశారు. -
బిజదలో చేరికలు.. సన్నాహక సమావేశాలు
[ 23-04-2024]
ఎన్నికల తేదీలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి దూకుళ్లు అధికమవుతున్నాయి. -
నవరంగపూర్లో త్రిముఖం..ఎవరిదో విజయం
[ 23-04-2024]
గత పదేళ్ల కిందటి వరకు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నవరంగపూర్ లోక్సభ స్థానంలో క్రమేణా బిజద బలం పుంజుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలతోపాటు భాజపా కూడా గట్టి పోటీ ఇస్తుండడంతో త్రిముఖ పోటీ ఆసక్తికరంగా మారింది. -
గమాంగ్ దంపతుల మద్దతు ఎవరికో?
[ 23-04-2024]
రాయగడ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, ఆయన భార్య హేమా గమాంగ్ పేరు తెలియని వారుండరు. గిరిధర్ గమాంగ్కు సుమారు 50 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది. -
కార్మిక బంధువు నవీన్: పాండ్యన్
[ 23-04-2024]
అసంఘటిత రంగాల్లో పనులు చేస్తున్న కార్మికులకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బంధువయ్యారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్ చెప్పారు. -
పాదయాత్రలు.. ఇంటింటా ప్రచారాలు
[ 23-04-2024]
బ్రహ్మపుర అసెంబ్లీ నియోకవర్గంలో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. భాజపా అభ్యర్థి కె.అనిల్కుమార్ సోమవారం 11వ వార్డులోని వివిధ వీధుల్లో పాదయాత్రగా ఇంటింటా ఓటర్లను కలిసి ఓటు వేయాలని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!