త్రిపుర భైరవి అవతారంలో కటక్ చండి
కటక్ నగర ప్రజల ఆరాధ్య దేవత కటక్ చండి. ఆదివారం త్రిపుర భైరవి అవతారంలో దర్శనమిచ్చారు. మరోవైపు కటక్ దివాన్ బజార్లో ఉన్న అన్నపూర్ణాదేవి ఆలయంలో సోమవారం నుంచి శరన్నవరాత్రుల పూజలు నిర్వహిస్తామని ఆలయ ట్రస్ట్ బోర్డు కార్యదర్శి ఐ.సుబ్రహ్మణ్యం
కటక్, న్యూస్టుడే: కటక్ నగర ప్రజల ఆరాధ్య దేవత కటక్ చండి. ఆదివారం త్రిపుర భైరవి అవతారంలో దర్శనమిచ్చారు. మరోవైపు కటక్ దివాన్ బజార్లో ఉన్న అన్నపూర్ణాదేవి ఆలయంలో సోమవారం నుంచి శరన్నవరాత్రుల పూజలు నిర్వహిస్తామని ఆలయ ట్రస్ట్ బోర్డు కార్యదర్శి ఐ.సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆదివారం ఆయన ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ 26 నుంచి అక్టోబరు 5 వరకు శరన్నవరాత్రుల పూజలు కొనసాగుతాయని, అన్నపూర్ణా దేవి విగ్రహానికి ప్రతిరోజు వివిధ అవతారాల్లో అలంకరించి పూజలు చేస్తామని తెలిపారు.
ధవళముఖిగా శ్యామలేశ్వరీ దేవి
బరగఢ్, న్యూస్టుడే: మహాలయ అమావాస్య సందర్భంగా ఆదివారం బరగఢ్ జిల్లాలోని శ్యామలేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్యామలేశ్వరి దేవిని తెల్లటి వస్త్రాలు, ఆభరణాలు, పూలతో ధవళముఖి రూపంలో అలంకరించారు.
శక్తిపీఠాల్లో పూజలు
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: గంజాం జిల్లాలోని శక్తిపీఠాల్లో షోడశోపచార పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. జిల్లాలోని తరాతరిణి, శ్రీసిద్ధభైరవి (మంత్రీడి), మొహురి కాళువ, నారాయణి, సింఘాసిని, బ్రహ్మపుర మా బుడి శాంతాణి (పెద్దమ్మవారు) తదితర మందిరాల్లో ప్రతిరోజు విశేష అర్చనలు, హోమాలు నిర్వహిస్తున్నారు. తరాతరిణి శక్తిపీఠంలోని అమ్మవారిని చిత్రంలో చూడొచ్చు. సోమవారం నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం కానుండగా, శక్తి పీఠాలన్నీ భక్తులతో కళకళలాడుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బిజద... రాజీనామాల బెడద
[ 24-04-2024]
గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత ఎన్నికల్లో బిజదలో అసంతృప్తి కనిపిస్తోంది. పిరాయింపుదారులకు అధినాయకత్వం టికెట్లు కేటాయించిందన్న అసహనం, అసంతృప్తి రాష్ట్రమంతటా ఉంది. సీనియర్ నాయకులు పార్టీకి రాజీనామాలు చేశారు. -
అనుభవజ్ఞులతో కొత్త అభ్యర్థుల ఢీ
[ 24-04-2024]
నవరంగపూర్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో అనుభవజ్ఞులతో కొత్త అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలో అన్ని పార్టీలు నూతన అభ్యర్థులను బరిలో నిలపడంతో పోటీ ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. -
ముమ్మరంగా నామినేషన్ల దాఖలు
[ 24-04-2024]
కల తేదీలు దగ్గర పడుతున్న వేళ వివిధ పార్టీల నేతలు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. అనుచరులు, నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీలు నిర్వహిస్తూ వెళ్లి తమ ఇష్టదైవాలకు ప్రార్థనలు చేసి తర్వాత నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
అందాల పిట్టలండీ.. సంఖ్య పెరిగేనండీ
[ 24-04-2024]
కేంద్రపడ జిల్లా బితరకనిక జాతీయ ఉద్యానవనంలో మడ అడవి పక్షుల (మేన్గ్రోవ్ పిట్ట) సంఖ్య పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే వీటి సంతతి 39 పెరగడం గమనార్హం. -
గోపాల్పూర్లో ముఖాముఖి పోరు
[ 24-04-2024]
ప్రతిష్ఠాత్మక గోపాల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజద, భాజపా అభ్యర్థుల మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా కనిపిస్తోంది. -
భాజపా గూటికి మరో ఇద్దరు అగ్రనేతలు
[ 24-04-2024]
మాజీ మంత్రి బింబాధర్ కువార్, బిజద మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి నివేదితా నాయక్ భాజపా గూటికి చేరారు. -
మిత్రమండలి కొత్త కార్యవర్గం ఎంపిక
[ 24-04-2024]
బ్రహ్మపురలోని సుమారు 80 ఏళ్ల పురాతన ‘ఆంధ్ర విజ్ఞాన మిత్ర మండలి’ కొత్త కార్యవర్గం ఎంపిక సోమవారం రాత్రి జరిగింది. -
ముగిసిన తరాతరిణి చైత్ర మంగళవారాల యాత్ర
[ 24-04-2024]
గంజాం జిల్లాలోని సుప్రసిద్ధ తరాతరిణి శక్తిపీఠంలో చైత్ర మంగళవారాల యాత్ర ముగిసింది. అయిదో మంగళవారం సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కనిపించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్