logo

ధర్మేంద్ర సాహుతో నాకు వివాదాలు లేవు: మంత్రి సమీర్‌

పూరీ జిల్లా గోప్‌ సమితి జిల్లా పరిషత్‌ 11వ జోన్‌ సభ్యుడు ధర్మేంద్రసాహుతో తనకు ఎలాంటి వివాదాలు, విభేదాలు లేవని మంత్రి సమీర్‌ రంజన్‌ దాస్‌ వివరించారు. ధర్మేంద్ర సాహు మృతికి మంత్రే కారణమని భాజపా

Published : 27 Sep 2022 03:22 IST

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: పూరీ జిల్లా గోప్‌ సమితి జిల్లా పరిషత్‌ 11వ జోన్‌ సభ్యుడు ధర్మేంద్రసాహుతో తనకు ఎలాంటి వివాదాలు, విభేదాలు లేవని మంత్రి సమీర్‌ రంజన్‌ దాస్‌ వివరించారు. ధర్మేంద్ర సాహు మృతికి మంత్రే కారణమని భాజపా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా తనపై ఆరోపణలు చేయడం లేదన్నారు. అనవసరంగా భాజపా ఆరోపిస్తోందన్నారు. మరోవైపు శవపరీక్ష నివేదిక వెలువడింది. దీనిపై క్యాపిటల్‌ ఆసుపత్రి సంచాలకుడు లక్ష్మీధర సాహు విలేకరులతో మాట్లాడుతూ ఉరేసుకోవడం వల్ల ఊపిరి నిలిచిపోయి ధర్మేంద్రసాహు మృతి చెందినట్లు తెలిపారు. శరీరంపై గాయాలు లేవన్నారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని