logo

పాముకాటుతో మహిళ మృతి

గంజాం జిల్లా అస్కా ఠాణా పరిధిలోని మంటాపడ గ్రామంలో ఆదివారం సాయంత్రం పొలం నుంచి తిరిగి వస్తున్న లక్ష్మీ ప్రధాన్‌ (45) అనే మహిళను పాము కాటేసింది. ఆమెను అస్కా ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ

Published : 27 Sep 2022 03:22 IST

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా అస్కా ఠాణా పరిధిలోని మంటాపడ గ్రామంలో ఆదివారం సాయంత్రం పొలం నుంచి తిరిగి వస్తున్న లక్ష్మీ ప్రధాన్‌ (45) అనే మహిళను పాము కాటేసింది. ఆమెను అస్కా ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పరీక్షకు తరలించామని ఠాణా ఐఐసీ ప్రశాంత కుమార్‌ సాహు రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

కట్టెలకు వెళ్లి అనంతలోకాలకు...!

నవరంగపూర్‌, న్యూస్‌టుడే:  కట్టెలు సేకరించేందుకు వెళ్లి చెట్టుపై నుంచి కిందపడి బాలిక మృతి చెందిన ఘటన జోరిగావ్‌ సమితి పాలియా పంచాయతీ బడ్ని గ్రామంలో జరిగింది. అబికా జానీ తల్లితో కలసి అడవికి వెళ్లింది. సోమవారం ఉదయం 20 అడుగుల చెట్టు ఎక్కి కొమ్మలు కొడుతుండగా కాళ్లుజారి కిందపడడంతో తీవ్రగాయాలయ్యాయి. అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో ఆటోలో జోరిగావ్‌ ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం డాబుగావ్‌ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని