logo

29 వరకు రాష్ట్రంలో వర్షాలు: ఐఎండీ

 పశ్చిమకేంద్ర బంగాళాఖాతం ఉపరితలంలో 4.5 కిలోమీటర్ల వరకు తుపాను ఆవర్తనం (సైక్లోనిక్‌ సర్క్యులేషన్‌) ఏర్పడిందని, మరోవైపు రాష్ట్రంపై కాలవైశాఖి (థండర్‌ స్టార్మ్‌) ప్రభావం కూడా ఉన్నందున 29వ తేదీ వరకు వర్షాలకు

Published : 27 Sep 2022 03:22 IST

మంగళవారం వర్షాలకు అవకాశం ఉన్న జిల్లాల వివరాలు మ్యాప్‌లో (పసుపు రంగులో)

గోపాలపూర్‌, న్యూస్‌టుడే:  పశ్చిమకేంద్ర బంగాళాఖాతం ఉపరితలంలో 4.5 కిలోమీటర్ల వరకు తుపాను ఆవర్తనం (సైక్లోనిక్‌ సర్క్యులేషన్‌) ఏర్పడిందని, మరోవైపు రాష్ట్రంపై కాలవైశాఖి (థండర్‌ స్టార్మ్‌) ప్రభావం కూడా ఉన్నందున 29వ తేదీ వరకు వర్షాలకు అవకాశం ఉందని గోపాలపూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌దాస్‌ సోమవారం ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. ఆవర్తనం కాలవైశాఖి ప్రభావంతో గడిచిన 24 గంటల్లో చాలాచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిశాయని, గజపతి జిల్లా నువాగడలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. మంగళవారం బాలేశ్వర్‌, భద్రక్‌, జాజ్‌పూర్‌, కేంద్రపడ, కటక్‌, జగత్సింగ్‌పూర్‌, పూరీ, ఖుర్దా, నయాగడ్‌, గంజాం, గజపతి, మల్కాన్‌గిరి, కొరాపుట్‌, రాయగడ, కొంధమాల్‌, కలహండి, సుందర్‌గఢ్‌, కేంఝర్‌, మయూర్‌భంజ్‌ జిల్లాల్లో వర్షాలకు అవకాశం ఉందని, దీంతో ఆ జిల్లాలకు ‘ఎల్లో’ హెచ్చరికలు చేసినట్లు దాస్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని