మహేంద్రగిరి సోయగం.. రమణీయ దృశ్యాల సమాహారం
గజపతి జిల్లాలోని ముఖ్య పర్యాటక కేంద్రం మహేంద్రగిరి. సముద్రమట్టానికి 15 వందల మీటర్ల ఎత్తులో ఉన్న మహేంద్రగిరికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ శివరాత్రికి భక్తులు, యాత్రికులు వేల సంఖ్యలో వస్తారు.
పర్వతంపై నీలి మేఘాల అందాలు
పర్లాఖెముండి, కాశీనగర్, న్యూస్టుడే: గజపతి జిల్లాలోని ముఖ్య పర్యాటక కేంద్రం మహేంద్రగిరి. సముద్రమట్టానికి 15 వందల మీటర్ల ఎత్తులో ఉన్న మహేంద్రగిరికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ శివరాత్రికి భక్తులు, యాత్రికులు వేల సంఖ్యలో వస్తారు. క్షత్రియులను ఓడించిన అనంతరం పరశురాముడు ఇక్కడి పర్వత శిఖరాల్లో తపస్సు చేసుకుంటూ ఉండేవాడని, ఆ సమయంలో పాండవులు ఇక్కడికి వచ్చి పరుశురాముని వద్ద విలువిద్య నేర్చుకున్నారని చరిత్ర చెబుతోంది. ఆ సమయంలో కుంతి మందిరం, ధర్మరాజు, అర్జుని గుహ, భీముని మందిరం నిర్మించుకున్నారు.
భీముని గుడి దర్శనం ప్రత్యేకం
ప్రకృతి అందాలు, పక్షులు కిలకిలారావాలు, ఉదయించే సూర్యుడిని చూస్తుంటే అందిన దూరంలో భానుడు ఉన్నాడా అన్న అనుభూతి కలగక మానదు. పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించిన గుడి ముఖ ద్వారం గుండా లోపలకు ప్రవేశించే యాత్రికులు ఒక చిన్న సందులోంచి బయటకు వచ్చేలా నిర్మించిన తీరు ఆశ్చర్య పోయేలా చేస్తుంది. ఇలా చేయడం వలన సర్వరోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం.
భీముని మందిరం
బస చేసేందుకు ఏర్పాట్లు శూన్యం
మహేంద్రగిరి ప్రత్యేకతల సమాహారం, ఔషధీయ మొక్కలకు నిలయం. ఇంతటి ప్రత్యేకత ఉన్న ఈ గిరిని సందర్శించే యాత్రికులు, భక్తులకు వసతి సౌకర్యాలు శూన్యం. శివరాత్రికి కొండపైకి వచ్చే భక్తులు గుడారాలు వేసుకొని బస చేయాల్సిందే. ఆహారం సైతం వెంట తెచ్చుకోవాలి. నీటి సౌకర్యం అంతంత మాత్రమే. విద్యుత్తు సౌకర్యం కూడా లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు ఇక్కడ సౌకర్యాలు కల్పిస్తే మహేంద్ర గిరికి మరింత ప్రాచుర్యం లభిస్తుందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.
కొండపై వరకు చక్కని రోడ్లు..
మహేంద్రగిరి కొండ దిగువ నుంచి పైవరకు 6 కిలోమీటర్ల మేర తారు రోడ్డు నిర్మించడంతో భక్తులు, యాత్రికులు సులభంగా చేరుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారసులొచ్చారు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొంతమంది ప్రముఖ నాయకులు పోటీ నుంచి తప్పుకున్నారు. వారి భార్యలు, వారసులను బరిలోకి దించారు. బిజద, భాజపా, కాంగ్రెస్ పార్టీల నాయకత్వాలు వారికి అవకాశం కల్పించాయి. తండ్రులు, తల్లులు వారి తరుఫున ప్రచారం చేస్తున్నారు. -
కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘హెర్’ టీం
[ 19-04-2024]
మహిళల్ని వేధించే వారి భరతం పట్టడానికి జంటనగరాల (భువనేశ్వర్, కటక్) కమిషనరేట్ యంత్రాంగం ‘హై ఎఫిషియన్సీ రెస్పాన్స్ (హెరా) టీం ఏర్పాటు చేసింది. -
సత్వర విద్యుత్తు సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు
[ 19-04-2024]
వేసవిలో ప్రజలకు మరింత మెరుగైన విద్యుత్తు సేవలు అందించేందుకు, సరఫరాలో అంతరాయం ఏర్పడితే సత్వర సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు సిద్ధం చేశామని విద్యుత్తు సరఫరా సంస్థ ‘టాటా పవర్ సదరన్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్’ (టీపీఎస్ఓడీఎల్) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది -
జగన్నాథునికి రూ.2.51 కోట్ల విరాళం
[ 19-04-2024]
రిలయన్స్ గ్రూపు సంస్థల అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ బుధవారం పూరీ శ్రీక్షేత్రానికి వచ్చారు. జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
సచిదాస్ కన్నుమూత
[ 19-04-2024]
జత్రా పార్టీ (నాటకాలు) దర్శకునిగా, నటునిగా ఖ్యాతి గాంచిన సచిదాస్ (91) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అస్వస్థతతో కటక్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. -
ఎవరి ప్రయోజనాల కోసం రెండుచోట్ల పోటీ?
[ 19-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మళ్లీ రెండుచోట్ల పోటీకి సిద్ధమయ్యారు. దీనివల్ల ప్రజలకు ఒరిగేదేమిటని? ఈ పోటీ ఎవరి ప్రయోజనాల కోసమని? సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో ఉప ఎన్నిక, వ్యయప్రయాసలు మినహా సాధించేదేమిటని విమర్శలు వినిపిస్తున్నాయి. -
నేటి నుంచి మజ్జిగౌరీ చైత్రోత్సవాలు
[ 19-04-2024]
రాయగడ ఉత్కళాంధ్రుల ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవ సంబరాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
‘శ్రేష్ఠ భారత్’ ఏర్పాటుకు అంతా సహకరించాలి
[ 19-04-2024]
‘శ్రేష్ఠ భారత్’ లక్ష్యంగా దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలు, అన్ని రంగాల సమగ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ 2024 సంకల్ప పత్రం జారీ చేశారని, ప్రజలంతా సహకరించి, మరోసారి మోదీని ప్రధాని చేసేందుకు ముందుకు రావాలని బ్రహ్మపుర లోక్సభ భాజపా అభ్యర్థి ప్రదీప్ కుమార్ పాణిగ్రహి కోరారు -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 19-04-2024]
గంజాం జిల్లా గొళంత్రా ఠాణా పరిధిలోని కొణిసి-తుళు మార్గంలో బుధవారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు యువకులు ఎమ్కేసీజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు