వైభవంగా దేవీ శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం
గంజాం జిల్లాలో పండగ సందడి మొదలైంది. జిల్లావ్యాప్తంగా సోమవారం దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని అన్ని శక్తిపీఠాల్లో విశేష అర్చనలు నిర్వహిస్తున్నారు. నగరంలోని అమ్మవార్ల మందిరాల్లో శాస్త్రోక్తంగా పూజలు,
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: గంజాం జిల్లాలో పండగ సందడి మొదలైంది. జిల్లావ్యాప్తంగా సోమవారం దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని అన్ని శక్తిపీఠాల్లో విశేష అర్చనలు నిర్వహిస్తున్నారు. నగరంలోని అమ్మవార్ల మందిరాల్లో శాస్త్రోక్తంగా పూజలు, హోమాలు ప్రారంభించారు. స్థానిక తెలుగు బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నీలకంఠనగర్ హౌసింగు బోర్డులో గాయత్రీ మాత మందిరంలో నవరాత్ర మహోత్సవాలు ఉదయం వైభవంగా మొదలయ్యాయి. మందిరం ఆవరణలోని వేద భవనంలో మహామేరు శ్రీచక్ర యంత్రరాజం, గాయత్రీమాత, వినాయక ఉత్సవ మూర్తులకు భక్తులు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం ఇదే ఆవరణలో మహిళలు సామూహిక కుంకుమార్చనలు, ఖస్పావీధిలో జఠాధరేశ్వరస్వామి మందిర ఆవరణలోని సంతోషిమాత మందిరంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా జఠాధరేశ్వరస్వామి కల్యాణ మండపంలో ఉదయం 110 మంది మహిళలు, యువతులు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. స్థానిక మార్తాపేటలోని రామలింగ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఉదయం శాస్త్రోక్తంగా శరన్నవరాత్రోత్సవాలు మొదలయ్యాయి. తల్లిని దివ్యంగా అలంకరించి విశేష పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నగరంలోని ఇతర మందిరాల్లోనూ సామూహిక కుంకుమార్చనలు తదితరాలు నిర్వహించారు.
జఠాధరేశ్వరస్వామి కల్యాణ మండపం ఆవరణలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తున్న మహిళలు, యువతులు
గాయత్రీ మందిరం ఆవరణలోని వేద భవనంలో శ్రీచక్రానికి అభిషేకాలు చేస్తున్న భక్తులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారసులొచ్చారు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొంతమంది ప్రముఖ నాయకులు పోటీ నుంచి తప్పుకున్నారు. వారి భార్యలు, వారసులను బరిలోకి దించారు. బిజద, భాజపా, కాంగ్రెస్ పార్టీల నాయకత్వాలు వారికి అవకాశం కల్పించాయి. తండ్రులు, తల్లులు వారి తరుఫున ప్రచారం చేస్తున్నారు. -
కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘హెర్’ టీం
[ 19-04-2024]
మహిళల్ని వేధించే వారి భరతం పట్టడానికి జంటనగరాల (భువనేశ్వర్, కటక్) కమిషనరేట్ యంత్రాంగం ‘హై ఎఫిషియన్సీ రెస్పాన్స్ (హెరా) టీం ఏర్పాటు చేసింది. -
సత్వర విద్యుత్తు సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు
[ 19-04-2024]
వేసవిలో ప్రజలకు మరింత మెరుగైన విద్యుత్తు సేవలు అందించేందుకు, సరఫరాలో అంతరాయం ఏర్పడితే సత్వర సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు సిద్ధం చేశామని విద్యుత్తు సరఫరా సంస్థ ‘టాటా పవర్ సదరన్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్’ (టీపీఎస్ఓడీఎల్) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది -
జగన్నాథునికి రూ.2.51 కోట్ల విరాళం
[ 19-04-2024]
రిలయన్స్ గ్రూపు సంస్థల అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ బుధవారం పూరీ శ్రీక్షేత్రానికి వచ్చారు. జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
సచిదాస్ కన్నుమూత
[ 19-04-2024]
జత్రా పార్టీ (నాటకాలు) దర్శకునిగా, నటునిగా ఖ్యాతి గాంచిన సచిదాస్ (91) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అస్వస్థతతో కటక్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. -
ఎవరి ప్రయోజనాల కోసం రెండుచోట్ల పోటీ?
[ 19-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మళ్లీ రెండుచోట్ల పోటీకి సిద్ధమయ్యారు. దీనివల్ల ప్రజలకు ఒరిగేదేమిటని? ఈ పోటీ ఎవరి ప్రయోజనాల కోసమని? సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో ఉప ఎన్నిక, వ్యయప్రయాసలు మినహా సాధించేదేమిటని విమర్శలు వినిపిస్తున్నాయి. -
నేటి నుంచి మజ్జిగౌరీ చైత్రోత్సవాలు
[ 19-04-2024]
రాయగడ ఉత్కళాంధ్రుల ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవ సంబరాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
‘శ్రేష్ఠ భారత్’ ఏర్పాటుకు అంతా సహకరించాలి
[ 19-04-2024]
‘శ్రేష్ఠ భారత్’ లక్ష్యంగా దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలు, అన్ని రంగాల సమగ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ 2024 సంకల్ప పత్రం జారీ చేశారని, ప్రజలంతా సహకరించి, మరోసారి మోదీని ప్రధాని చేసేందుకు ముందుకు రావాలని బ్రహ్మపుర లోక్సభ భాజపా అభ్యర్థి ప్రదీప్ కుమార్ పాణిగ్రహి కోరారు -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 19-04-2024]
గంజాం జిల్లా గొళంత్రా ఠాణా పరిధిలోని కొణిసి-తుళు మార్గంలో బుధవారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు యువకులు ఎమ్కేసీజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు
తాజా వార్తలు (Latest News)
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత