బీమా మొత్తం ఇవ్వకుంటే సామూహిక ఆత్మహత్యలే
బొలంగీర్ జిల్లాలో నష్టపోయిన రైతులకు వ్యవసాయ బీమా మొత్తాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పలు ప్రాంతాల్లో రైలురోకో నిర్వహించారు. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బొలంగీర్ రైల్వే స్టేషన్,
బొలంగీర్ జిల్లాలో రైతుల ఆందోళన
హరిశంకర్ రైల్వే స్టేషన్లో పట్టాలపై బైఠాయించిన రైతులు
కటక్, న్యూస్టుడే: బొలంగీర్ జిల్లాలో నష్టపోయిన రైతులకు వ్యవసాయ బీమా మొత్తాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పలు ప్రాంతాల్లో రైలురోకో నిర్వహించారు. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బొలంగీర్ రైల్వే స్టేషన్, హరిశంకర్, టిట్లాగఢ్ రైల్వేస్టేషన్ వద్ద వందలాదిమంది రైతులు రైలు పట్టాలపై ధర్నా చేపట్టారు. వారిని అడ్డుకోవడంలో పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రైతులు రైలు పట్టాలపై కూర్చున్నారు. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఆందోళనకారులు అందించిన వివరాల ప్రకారం... గత ఏడాది జిల్లాలో కరవు ఏర్పడి వందలాదిమంది రైతులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. బీమా మొత్తాలు చెల్లించాలని, రైతులకు ఆదుకోవాలని చాలాసార్లు రైతులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టారు. బీమా సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పంటనష్టంపై జిల్లా యంత్రాంగం తప్పుడు వివరాలు అందించిందని ఆరోపిస్తూ బీమా సంస్థ మొత్తాలు విడుదల చేయడం లేదు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బీమా మొత్తాలు ఇవ్వకపోతే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు ఆందోళనకారులతో చర్చించి పరిస్థితిని చక్కదిద్దారు. బొలంగీర్ జిల్లా రైతుల సంఘం ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు జరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నితీష్ గమ్యం ఎటువైపు?
[ 20-04-2024]
సంబల్పూర్ సిటింగ్ ఎంపీ నితీష్ గమ్యం ఎటువైపు? ఈసారి ఎన్నికల్లో ఆయన భార్య అరుంధతీ దేవి తరఫున ప్రచారం చేస్తారా? భాజపాకు అనుకూలంగా ఉంటారా? అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. -
కనుల పండువగా చైత్రోత్సవాలు
[ 20-04-2024]
శక్తి స్వరూపిణి, శాంతి స్వరూపిణి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. -
మౌలిక సౌకర్యాలకు దూరం.. ఎన్నికల బహిష్కరణ నిర్ణయం
[ 20-04-2024]
కొంధమాల్ జిల్లా బలిగుడ సమితిలో రుతుంగియా పంచాయతీలోని గగలిమహ, పనిపదర్, పాంగాబడి గ్రామాలకు రహదారులు, తాగునీరు, అంగన్వాడీ వంటి మౌలిక సౌకర్యాలు లేవు. -
మహిళా ఓటర్లే అత్యధికం
[ 20-04-2024]
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికలు జరగనున్న నాలుగు లోక్సభ స్థానాల్లో పురుషులకంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) నికుంజ బిహారీ ధొళో అన్నారు. -
బ్రహ్మపురలో నామినేషన్ల పర్వం
[ 20-04-2024]
బ్రహ్మపుర సబ్కలెక్టరు కార్యాలయం, పరిసరాలు రెండోరోజు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులు, వారి మద్దతుదారులతో కిటకిటలాడింది. -
భాజపా మోదీ మంత్రం.. బిజద అభివృద్ధి అస్త్రం
[ 20-04-2024]
ప్రధాన పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేస్తున్నాయి. మండుటెండలను కూడా లెక్క చేయకుండా ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. రోడ్షోలు, పాదయాత్రలు, సభలు నిర్వహిస్తున్నారు. -
మహానదిలో పడవ మునక: ఇద్దరి దుర్మరణం
[ 20-04-2024]
ఝార్సుగుడ జిల్లా లఖన్పూర్ సమితి ఛత్తీస్గఢ్ సరిహద్దు శారదా వద్ద శుక్రవారం సాయంత్రం మహానదిలో పడవ మునిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. -
నిప్పుల కొలిమిలా రాష్ట్రం
[ 20-04-2024]
రాష్ట్రం నిప్పులకొలిమిలా మారింది. భానుని ప్రతాపంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటాయి. -
చాకుతో దాడి: యువకుడి హతం
[ 20-04-2024]
గంజాం జిల్లా నిమ్మఖండి ఠాణా పరిధిలోని బొరిగావ్ గ్రామంలోని అమ్మవారి మందిరం సమీపాన చెరువు ఒడ్డున గురువారం సాయంత్రం సునీల్ దాస్ (27) అనే యువకుడు, మరో యువకుడి మధ్య పాతకక్షల నేపథ్యంలో వాగ్వాదం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు