తమవారే డీలర్లు... ఫిర్యాదులు బుట్టదాఖలు
ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లో అవినీతికి ఆస్కారం లేదని, పారదర్శకతకు పెద్దపీట వేశామని పదేపదే చెప్పుకుంటున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిస్థితిని పట్టించుకోవడం లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేటు రేషన్ డీలర్లపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు
ప్రభుత్వ పెద్దల తీరుపై ఆరోపణలు
భువనేశ్వర్, న్యూస్టుడే
పీడీఎస్ రేషన్ దుకాణం
ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లో అవినీతికి ఆస్కారం లేదని, పారదర్శకతకు పెద్దపీట వేశామని పదేపదే చెప్పుకుంటున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిస్థితిని పట్టించుకోవడం లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేటు రేషన్ డీలర్లపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై విపక్షాలు నిలదీస్తున్నా పాలకులు సమర్థించుకుంటున్నారు.
7068 మందిపై ఆరోపణలు
ఆహారహామీ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు (బీపీఎల్) రూపాయికే కిలో బియ్యంతోపాటు గోధుమలు అందిస్తున్న విషయం తెలిసిందే. కొన్నిచోట్ల కిరోసిన్ కూడా ఇస్తోంది. రాష్ట్రంలో 7068 మంది ప్రైవేటు రేషన్ డీలర్లున్నారు. ఇటీవల పౌరసరఫరాలశాఖ మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీ) సహకార సమితులకు 6,562 రేషన్ దుకాణాల లైసెన్సులు కేటాయించింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు డీలర్లు సక్రమంగా లబ్ధిదారులకు ఆహార ధాన్యాలు పంపిణీ చేయడం లేదని, తూకంలో తేడాలు ఉన్నాయని పలుచోట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నా వారిపై ఎలాంటి చర్యలు లేవు. ఏడేళ్లుగా వారినే కొనసాగిస్తూ లైసెన్సులు పునరుద్ధరిస్తున్నారు.
బిజద కార్యకర్తలకు పెద్దపీట
ప్రైవేటు డీలర్లంతా బిజద కార్యకర్తలే. అధికార పార్టీ అండదండలు ఉన్నందున అవినీతి ఆరోపణలున్నా అధికారులు దర్యాప్తు చేసి మిన్నకుండిపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పౌరసరఫరాల నిబంధనల ప్రకారం రేషన్ దుకాణాలు, డీలర్ల లైసెన్సులు తరచూ ఒకరికే ఇవ్వకూడదు. ఆరోపణలొస్తే దర్యాప్తు చేసి అవి నిజమని తేలితే చర్యలు తీసుకోవాలి. ఈ నిబంధనను పౌరసరఫరాల శాఖ పూర్తిగా విస్మరించింది. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారికి, బిజద కార్యకర్తలకు డీలర్లుగా నియమించి ఏడేళ్లుగా వారి లైసెన్సులు పునరుద్ధరిస్తోంది. లబ్ధిదారుల పట్ల డీలర్లు దురుసుగా వ్యవహరిస్తూ, తూకాల్లో మోసం చేస్తున్నా అడిగేవారే కరవయ్యారు. చాలాచోట్ల అడ్డగోలుగా బియ్యం, గోధుమలు నల్లబజారుకు తరలిస్తున్నారని విపక్షనేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై శాసనసభలో చర్చ జరిగినా పాలకులు పట్టించుకోలేదు.
చందాలిస్తున్నారు
విపక్ష (భాజపా) నేత జయనారాయణ మిశ్ర సోమవారం సంబల్పూర్లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేటు రేషన్ డీలర్లంతా బిజద కార్యకర్తలని, వారు పార్టీకి చందాలిస్తున్నారని ఆరోపించారు. ఆరోపణలు వినిపిస్తున్నా పాలకులు విచారణ చేపట్టి ఎలాంటి చర్యలు తీసుకోకుండా మళ్లీ మళ్లీ వారికే లైసెన్స్లు ఇస్తున్నారన్నారు.
25 లక్షల కుటుంబాలకు అదనంగా
దీనిపై బిజద అధికార ప్రతినిధి శశిభూషణ్ బెహర సోమవారం భువనేశ్వర్లో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నవీన్పట్నాయక్ పేదలు ఇబ్బందులకు గురి కాకూడదన్న ఆలోచనతో కేంద్ర జాబితాలో లేని 25 లక్షల కుటుంబాలకు అదనంగా బీపీఎల్ కార్డులు కేటాయించి ఆహార ధాన్యాలు సమకూరుస్తున్నారన్నారు. దీనికయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తోందని, విపక్షాలు ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నాయన్నారు. పౌరసరఫరాల శాఖ ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరుపై గట్టినిఘా ఉంచిందని తెలిపారు.
సభలో నిలదీశాం
కాంగ్రెస్ సభాపక్షం నేత నర్సింగమిశ్ర సోమవారం బొలంగీర్లో విలేకరులతో మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖలో అవినీతి, డీలర్లపై పాలకులు అభిమానం చూపించడాన్ని నిలదీసినా పట్టించుకోకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. లబ్ధిదారుల ఫిర్యాదులను బుట్టదాఖలు చేసి అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న అవినీతి డీలర్లపై చర్యలు తీసుకోకపోవడం సబబు కాదన్నారు. ప్రజాగ్రహం చవిచూసే రోజులు దగ్గర పడ్డాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడేళ్ల శిశువుపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్
[ 29-03-2024]
గజపతి జిల్లా మోహన ఠాణా పరిధిలో మూడేళ్ల శిశువుపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకోంది. -
గొంతు కోసి యువకుడి దారుణ హత్య
[ 29-03-2024]
గజపతి జిల్లాలోని గుసాని సమితి గురండి ఠాణా పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. -
కాషాయం కండువాలు ధరించిన అగ్రనేతలు
[ 29-03-2024]
దిల్లీ భాజపా కార్యాలయం వేదికగా గురువారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో ఇద్దరు ప్రముఖ నేతలు, మరో ప్రముఖ రచయిత్రి కాషాయం కండువాలు ధరించారు. -
తోడేలు దాడిలో ఇద్దరికి గాయాలు
[ 29-03-2024]
మల్కాన్గిరి సమితి ఎమ్.వి.93 గ్రామంలో ఇద్దరిపై తోడేలు దాడి చేయడంతో, పోరాడి హతమార్చారు. ఈ క్రమంలో వీరికి తీవ్ర గాయాలయ్యాయి -
డబుల్ ఇంజిన్ పాలన తథ్యం: అపరాజిత
[ 29-03-2024]
రాష్ట్రంలో భాజపా డబుల్ ఇంజిన్ పాలన తథ్యమని, ప్రజల్లో మార్పు కనిపిస్తోందని భువనేశ్వర్ సిటింగ్ ఎంపీ అపరాజిత షడంగి చెప్పారు. -
బిజదలో అసమ్మతి సెగ
[ 29-03-2024]
ఎన్నికల ముందు అధికార పక్షం బిజదలో అసమ్మతి సెగ తగలడంతో పార్టీకి తలనొప్పిగా మారుతోంది. రాయగడ శాసనసభ నియోజకవర్గ టికెట్ అనుసూయ మాఝికి కేటాయించడంపై రెండు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటుండడం పార్టీ శ్రేణులకు మింగుడుపడడం లేదు -
గోపాల్పూర్ ఓడరేవు కొనుగోలు చేసిన అదానీ
[ 29-03-2024]
తూర్పు తీరంలో సరకు రవాణాలో అగ్రగామిగా ఉన్న గోపాల్పూర్ ఓడరేవును ప్రముఖ పారిశ్రామిక గ్రూపు అదానీ కొనుగోలు చేసింది -
ప్రతిష్ఠాత్మక నియోజకవర్గం పోరు రసవత్తరం
[ 29-03-2024]
బిజద అభ్యర్థి బిక్రం పండాకు గోపాల్పూర్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నియోజకవర్గం ఓటర్లందరికీ చిరపరిచితులు. భంజవిహార్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన తొలినాళ్లలో విద్యార్థి నేత -
ఎన్నికల బరిలో అతివలకు అవకాశం
[ 29-03-2024]
ఎన్నికల్లో మహిళా అభ్యర్థులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని బిజద ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగా ఎన్నికల బరిలో పోటీపడేందుకు మహిళలకు అవకాశం కల్పించారు. -
‘రిడ్లీ’ల రాకకు ఎదురుచూపు
[ 29-03-2024]
విదేశీ అతిథులు ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ల రాక వల్ల గంజాం జిల్లా ఖ్యాతిగాంచింది. రాష్ట్రంలోని రిడ్లీల పునరుత్పత్తికి మూడు కేంద్రాలుండగా, వీటిలో గంజాం జిల్లాలోని రుషికుల్యా ముఖద్వారం ఒకటి. -
శ్రీక్షేత్రంలో మీనాక్షి శేషాద్రి
[ 29-03-2024]
ప్రముఖ బాలీవుడ్ (ముంబయి) నటి, నర్తకి మీనాక్షి శేషాద్రి గురువారం పూరీ వచ్చారు. శ్రీక్షేత్రంలో జగన్నాథుడి సన్నిధిలో పూజలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM