పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం ఒడిశా
ఐటీ, రసాయనాలు, చేనేత, జౌళి, విద్యుత్తు, ఆహారోత్పత్తులు, లాజిస్టిక్ పార్కులు, ఉక్కు, అల్యూమినియం, మాంగనీసు, క్రోమైట్, గ్రానైట్ పరిశ్రమల ఏర్పాటుకు ఒడిశా అనుకూలమైనదిగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పెట్టుబడిదారులకు వివరించారు.
పెట్టుబడిదారులకు వివరించిన నవీన్
గ్లోబల్ ఫౌండేషన అధ్యక్షుడు జితేంద్ర చడ్డాకు టీషర్టు బహూకరిస్తూ...
భువనేశ్వర్, న్యూస్టుడే: ఐటీ, రసాయనాలు, చేనేత, జౌళి, విద్యుత్తు, ఆహారోత్పత్తులు, లాజిస్టిక్ పార్కులు, ఉక్కు, అల్యూమినియం, మాంగనీసు, క్రోమైట్, గ్రానైట్ పరిశ్రమల ఏర్పాటుకు ఒడిశా అనుకూలమైనదిగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పెట్టుబడిదారులకు వివరించారు. బుధవారం బెంగళూరులోని తాజ్ హోటల్లో ఆయన ప్రముఖ పారిశ్రామిక గ్రూపుల అధిపతులతో చర్చించారు. ఇక్కడ రాష్ట్ర పరిశ్రమల శాఖ రెండు విడతల్లో పెట్టుబడిదారుల సదస్సులు చేపట్టింది. తొలుత సీఎం ఆయా గ్రూపుల అధిపతులతో నేరుగా మాట్లాడారు. రాత్రి అందరూ ప్రముఖులతో ఏర్పాటైన సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన విప్రో గ్రూపు సంస్థల సీఈవో శరవణ్ సుబ్రహ్మణ్యం, గ్లోబల్ ఫౌండేషన్ అధిపతి జితేంద్ర చడ్డా, కాన్సెట్రిక్స్ దక్ష్ సర్వీసెస్ అధ్యక్షుడు గిరీష్ మీనన్, ఐబీఎం సంస్థ మేనేజింగ్ పార్టనర్ అమిత్ శర్మ, పేజ్ ఇండస్ట్రీ సీఈవో వీఎస్ గణేశ్ తదితరులతో చర్చించారు. వారికి ఐటీ-2022 విధానం, ప్రభుత్వ ప్రోత్సాహకాల గురించి తెలియజేశారు. రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు, సౌకర్యాలు ఉన్నాయని, శాంతిభద్రతల సమస్యలు లేవని వివరించారు. నవంబరు 30 నుంచి డిసెంబరు 4 వరకు భువనేశ్వర్లో నిర్వహించే మేకిన్ ఒడిశా సదస్సులో పాల్గొనాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ, విద్యుత్తు శాఖల మంత్రి ప్రతాప్ దేవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ మహాపాత్ర్, పరిశ్రమశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి హేమంత శర్మ, 5-టీ కార్యదర్శి వి.కార్తికేయ పాండ్యన్, కర్ణాటక వాణిజ్య పరిశ్రమల సమాఖ్య ప్రతినిధి కె.ఉల్లాస్కామత్ తదితరులు పాల్గొన్నారు.
విప్రో గ్రూపు సంస్థల సీఈవో శరవణ్ సుబ్రమణ్యంనకు టీషర్టు బహూకరిస్తున్న నవీన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడేళ్ల శిశువుపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్
[ 29-03-2024]
గజపతి జిల్లా మోహన ఠాణా పరిధిలో మూడేళ్ల శిశువుపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకోంది. -
గొంతు కోసి యువకుడి దారుణ హత్య
[ 29-03-2024]
గజపతి జిల్లాలోని గుసాని సమితి గురండి ఠాణా పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. -
కాషాయం కండువాలు ధరించిన అగ్రనేతలు
[ 29-03-2024]
దిల్లీ భాజపా కార్యాలయం వేదికగా గురువారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో ఇద్దరు ప్రముఖ నేతలు, మరో ప్రముఖ రచయిత్రి కాషాయం కండువాలు ధరించారు. -
తోడేలు దాడిలో ఇద్దరికి గాయాలు
[ 29-03-2024]
మల్కాన్గిరి సమితి ఎమ్.వి.93 గ్రామంలో ఇద్దరిపై తోడేలు దాడి చేయడంతో, పోరాడి హతమార్చారు. ఈ క్రమంలో వీరికి తీవ్ర గాయాలయ్యాయి -
డబుల్ ఇంజిన్ పాలన తథ్యం: అపరాజిత
[ 29-03-2024]
రాష్ట్రంలో భాజపా డబుల్ ఇంజిన్ పాలన తథ్యమని, ప్రజల్లో మార్పు కనిపిస్తోందని భువనేశ్వర్ సిటింగ్ ఎంపీ అపరాజిత షడంగి చెప్పారు. -
బిజదలో అసమ్మతి సెగ
[ 29-03-2024]
ఎన్నికల ముందు అధికార పక్షం బిజదలో అసమ్మతి సెగ తగలడంతో పార్టీకి తలనొప్పిగా మారుతోంది. రాయగడ శాసనసభ నియోజకవర్గ టికెట్ అనుసూయ మాఝికి కేటాయించడంపై రెండు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటుండడం పార్టీ శ్రేణులకు మింగుడుపడడం లేదు -
గోపాల్పూర్ ఓడరేవు కొనుగోలు చేసిన అదానీ
[ 29-03-2024]
తూర్పు తీరంలో సరకు రవాణాలో అగ్రగామిగా ఉన్న గోపాల్పూర్ ఓడరేవును ప్రముఖ పారిశ్రామిక గ్రూపు అదానీ కొనుగోలు చేసింది -
ప్రతిష్ఠాత్మక నియోజకవర్గం పోరు రసవత్తరం
[ 29-03-2024]
బిజద అభ్యర్థి బిక్రం పండాకు గోపాల్పూర్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నియోజకవర్గం ఓటర్లందరికీ చిరపరిచితులు. భంజవిహార్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన తొలినాళ్లలో విద్యార్థి నేత -
ఎన్నికల బరిలో అతివలకు అవకాశం
[ 29-03-2024]
ఎన్నికల్లో మహిళా అభ్యర్థులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని బిజద ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగా ఎన్నికల బరిలో పోటీపడేందుకు మహిళలకు అవకాశం కల్పించారు. -
‘రిడ్లీ’ల రాకకు ఎదురుచూపు
[ 29-03-2024]
విదేశీ అతిథులు ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ల రాక వల్ల గంజాం జిల్లా ఖ్యాతిగాంచింది. రాష్ట్రంలోని రిడ్లీల పునరుత్పత్తికి మూడు కేంద్రాలుండగా, వీటిలో గంజాం జిల్లాలోని రుషికుల్యా ముఖద్వారం ఒకటి. -
శ్రీక్షేత్రంలో మీనాక్షి శేషాద్రి
[ 29-03-2024]
ప్రముఖ బాలీవుడ్ (ముంబయి) నటి, నర్తకి మీనాక్షి శేషాద్రి గురువారం పూరీ వచ్చారు. శ్రీక్షేత్రంలో జగన్నాథుడి సన్నిధిలో పూజలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
-
ఆప్కు మరో షాక్.. సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు