మంత్రి ఇంటిపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి
పూరీ జిల్లా జిల్లా పరిషత్తు 11వ నెంబర్ జోన్ సభ్యుడు ధర్మేంద్ర సాహు అనుమానాస్పద మృతి ఘటనలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ భాజపా, కాంగ్రెస్లు మంత్రికి వ్యతిరేకంగా ఆందోళనలు
మంత్రి నివాసం ఎదుట కోడిగుడ్లతో ఛాత్ర కాంగ్రెస్ కార్యకర్తలు
భువనేశ్వర్ అర్బన్, న్యూస్టుడే: పూరీ జిల్లా జిల్లా పరిషత్తు 11వ నెంబర్ జోన్ సభ్యుడు ధర్మేంద్ర సాహు అనుమానాస్పద మృతి ఘటనలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ భాజపా, కాంగ్రెస్లు మంత్రికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. మంగళవారం భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో పూరీ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహించారు. మంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. మరోవైపు బుధవారం భువనేశ్వర్లో మంత్రి నివాసం ఎదుట ఛాత్ర కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. వందలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ భవన్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తూ మంత్రి నివాసం వద్దకు చేరుకున్నారు. అక్కడ ధర్నా నిర్వహించి మంత్రి ఇంటిపై కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట చోటు తీసుకుంది. పోలీసులు పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులు అందించిన వివరాల ప్రకారం... ధర్మేంద్ర సాహు మరణించక ముందు తన స్నేహితుడితో ఫోన్లో మాట్లాడిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయిదుగురు వ్యక్తులు తనను వేధిస్తున్నారని, తను ఆత్మహత్య చేసుకుంటానని ఆయన స్నేహితునికి చెప్పినట్లు ఆ సంభాషణలు స్పష్టం చేస్తున్నాయి. ఆ అయిదుగురు వ్యక్తుల పేర్లలో మంత్రి సమీర్ రంజాన్ దాస్ పేరు కూడా ఉంది. మంత్రితోపాటు మిగిలిన నలుగురిని అరెస్టు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఏడు రోజుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండే ఎండలో ప్రచారం... పదవి కోసం సాహసం
[ 18-04-2024]
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. ఎన్నికల ప్రచారం చేసే నేతలు, కార్యకర్తలు అప్రమత్తం కావాలని వాతావరణ అధ్యయన శాఖ (ఐఎండీ) యంత్రాంగం హెచ్చరిస్తోంది. వీటిని ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. -
ఒకేరోజు నేత్రోత్సవం, రథయాత్ర
[ 18-04-2024]
విశ్వప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథయాత్ర నిర్వహణ ఈసారి యంత్రాంగానికి పరీక్ష కానుంది. జులై 7న పురుషోత్తముని నేత్రోత్సవం (నవయవ్వన దర్శనం), అదేరోజు రథయాత్ర నిర్వహించాల్సి ఉంది. -
లక్ష్మీపూర్లో త్రిముఖ పోరు
[ 18-04-2024]
కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ నియోజకవర్గంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాక ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. -
రెండుచోట్ల నవీన్ పోటీ
[ 18-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బొలంగీర్ జిల్లా కంటాబంజి, గంజాం జిల్లాలోని హింజిలి నుంచి ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తారు. బుధవారం తొమ్మిది శాసనసభ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ఆయన ప్రకటించారు. -
జగన్నాథుడా... నీల మాధవుడా!
[ 18-04-2024]
రాయగడ జిల్లా బిసంకటక్ శాసనసభ నియోజకవర్గ స్థానంలో ఆసక్తికరపోరు నెలకొంది. ఇక్కడి నుంచి ఇద్దరు జగన్నాథులు (జగన్నాథ సరక, జగన్నాథ నుండ్రుక), ఓ నీల మాధవుడు (నీలమాధవ్ హికాక) బరిలో ఉన్నారు. -
ప్రతికూలతలు అధిగమించి.. సివిల్స్లో ర్యాంకు సాధించి..
[ 18-04-2024]
‘యూపీఎస్సీ-2023’ పరీక్షల్లో జాతీయస్థాయిలో రెండో ర్యాంకు సాధించిన రాష్ట్ర యువకుడు అనిమేష్ ప్రధాన్ను రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ప్రధాని మోదీ, గవర్నరు రఘుబర్దాస్, సీఎం నవీన్లు ‘ఎక్స్’ సామాజిక మాధ్యమం ద్వారా అభినందించారు. -
ప్రజల గుండెచప్పుడు బిజుబాబు: నవీన్
[ 18-04-2024]
బిజుబాబు భౌతికంగా లేకపోయినా, రాష్ట్ర ప్రజల గుండె చప్పుడుగా అందరి హృదయాల్లో ఉన్నారని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. -
బిజద గూటికి చేరిన వెంటనే రాణికి టికెట్
[ 18-04-2024]
సంబల్పూర్ సిటింగ్ భాజపా ఎంపీ నితీష్ గంగదేవ్ భార్య అరుంధతీ దేవి, ఆమె పెద్దకుమారుడు నమన్ గంగదేవ్ మంగళవారం రాత్రి నవీన్ నివాస్లో సీఎం నవీన్ సమక్షంలో బిజదలో చేరారు. -
ప్రధాన పార్టీలకు అసంతృప్తుల బెడద
[ 18-04-2024]
కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్, పొట్టంగి, కొరాపుట్ నియోజకవర్గాల్లో టికెట్ దక్కని అసంతృప్త వర్గాలతో ప్రధాన పార్టీలకు తలనొప్పి వ్యవహారంగా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
-
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
-
రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం