logo

సీయూఓ నుంచి బంగ్లాదేశ్‌ విద్యార్థికి పీహెచ్‌డీ పట్టా

సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఒడిశా (సీయూఓ) నుంచి బంగ్లాదేశ్‌ విద్యార్థి దివ్యజ్యోతి దత్త పీహెచ్‌డీ పొందారు. వేరే దేశానికి చెందిన విద్యార్థి వర్సిటీలో పట్టా పొందడం ఇదే తొలిసారి. దీంతో జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌లో పీహెచ్‌డీ

Published : 29 Sep 2022 01:54 IST

మొదటి అంతర్జాతీయ విద్యార్థిగా ఘనత

దివ్యజ్యోతి దత్తా

కొరాపుట్‌, న్యూస్‌టుడే: సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఒడిశా (సీయూఓ) నుంచి బంగ్లాదేశ్‌ విద్యార్థి దివ్యజ్యోతి దత్త పీహెచ్‌డీ పొందారు. వేరే దేశానికి చెందిన విద్యార్థి వర్సిటీలో పట్టా పొందడం ఇదే తొలిసారి. దీంతో జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌లో పీహెచ్‌డీ చేసిన అంతర్జాతీయ విద్యార్థిగా ఘనత దక్కించుకున్నారు. గైడ్‌గా వ్యవహరించిన అసిస్టెంట్‌ ఆచార్యులు సౌరవ్‌ గుప్తా మాట్లాడుతూ.. ఇలాంటి వారు మరింత మంది రావాలని ఆకాంక్షించారు. దివజ్యోతికి అభినందనలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని