పెట్టుబడిదారులకు పూర్తి సౌకర్యాలు
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి తమ ప్రభుత్వం పూర్తి సౌకర్యాలు కల్పిస్తుందని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్మాణాలకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. బెంగళూరులో బుధవారం
నిర్మాణాలకు ముందుకు రావాలని నవీన్ పిలుపు
వేదికపై సీఎం, మంత్రి ప్రతాప్, ఇతర అధికారులు
భువనేశ్వర్, న్యూస్టుడే: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి తమ ప్రభుత్వం పూర్తి సౌకర్యాలు కల్పిస్తుందని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్మాణాలకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. బెంగళూరులో బుధవారం రాత్రి ఏర్పాటైన పెట్టుబడిదారుల సదస్సులో ఆయన మాట్లాడారు. భువనేశ్వర్లో ఏర్పాటైన ఇన్ఫోసిటీలో ఐటీ సంస్థలు సాఫ్ట్వేర్ ఉత్పత్తులు చేస్తున్నాయని, నూతన విధానం అమలుతో నిర్మాణ సంస్థలకు రాయితీలు ఉన్నాయన్నారు. భారీ పరిశ్రమలకు స్థలాలు, మంచినీరు, విద్యుత్తుకు కొరత లేదన్నారు. ఉత్పత్తుల ఎగుమతులకు గోపాలపూర్, ధమ్రా, పరదీప్ ఓడరేవులు అనుకూలంగా ఉన్నాయని, రహదారులు, ఎయిర్ కనెక్టివిటీ సౌకర్యాలు ఉన్నాయని సీఎం వివరించారు. నిర్మాణ సంస్థలకు గనులను లీజుకు ఇస్తామన్నారు. 20 ప్రముఖ కంపెనీల యాజమాన్యాలతో నవీన్ ముఖాముఖి చర్చించారు. ఐబీఎం సంస్థ అధిపతి అమిత్ శర్మ అక్టోబరులో భువనేశ్వర్లో ఐటీ శాఖ ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్మాణ రంగంలో ఉన్న అవకాశాలు, ప్రోత్సాహకాలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరిగింది. పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ, విద్యుత్తు శాఖల మంత్రి ప్రతాప్ దేవ్, ఆ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి హేమంత శర్మ, 5-టీ కార్యదర్శి వి.కార్తికేయపాండ్యన్ మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండే ఎండలో ప్రచారం... పదవి కోసం సాహసం
[ 18-04-2024]
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. ఎన్నికల ప్రచారం చేసే నేతలు, కార్యకర్తలు అప్రమత్తం కావాలని వాతావరణ అధ్యయన శాఖ (ఐఎండీ) యంత్రాంగం హెచ్చరిస్తోంది. వీటిని ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. -
ఒకేరోజు నేత్రోత్సవం, రథయాత్ర
[ 18-04-2024]
విశ్వప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథయాత్ర నిర్వహణ ఈసారి యంత్రాంగానికి పరీక్ష కానుంది. జులై 7న పురుషోత్తముని నేత్రోత్సవం (నవయవ్వన దర్శనం), అదేరోజు రథయాత్ర నిర్వహించాల్సి ఉంది. -
లక్ష్మీపూర్లో త్రిముఖ పోరు
[ 18-04-2024]
కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ నియోజకవర్గంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాక ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. -
రెండుచోట్ల నవీన్ పోటీ
[ 18-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బొలంగీర్ జిల్లా కంటాబంజి, గంజాం జిల్లాలోని హింజిలి నుంచి ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తారు. బుధవారం తొమ్మిది శాసనసభ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ఆయన ప్రకటించారు. -
జగన్నాథుడా... నీల మాధవుడా!
[ 18-04-2024]
రాయగడ జిల్లా బిసంకటక్ శాసనసభ నియోజకవర్గ స్థానంలో ఆసక్తికరపోరు నెలకొంది. ఇక్కడి నుంచి ఇద్దరు జగన్నాథులు (జగన్నాథ సరక, జగన్నాథ నుండ్రుక), ఓ నీల మాధవుడు (నీలమాధవ్ హికాక) బరిలో ఉన్నారు. -
ప్రతికూలతలు అధిగమించి.. సివిల్స్లో ర్యాంకు సాధించి..
[ 18-04-2024]
‘యూపీఎస్సీ-2023’ పరీక్షల్లో జాతీయస్థాయిలో రెండో ర్యాంకు సాధించిన రాష్ట్ర యువకుడు అనిమేష్ ప్రధాన్ను రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ప్రధాని మోదీ, గవర్నరు రఘుబర్దాస్, సీఎం నవీన్లు ‘ఎక్స్’ సామాజిక మాధ్యమం ద్వారా అభినందించారు. -
ప్రజల గుండెచప్పుడు బిజుబాబు: నవీన్
[ 18-04-2024]
బిజుబాబు భౌతికంగా లేకపోయినా, రాష్ట్ర ప్రజల గుండె చప్పుడుగా అందరి హృదయాల్లో ఉన్నారని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. -
బిజద గూటికి చేరిన వెంటనే రాణికి టికెట్
[ 18-04-2024]
సంబల్పూర్ సిటింగ్ భాజపా ఎంపీ నితీష్ గంగదేవ్ భార్య అరుంధతీ దేవి, ఆమె పెద్దకుమారుడు నమన్ గంగదేవ్ మంగళవారం రాత్రి నవీన్ నివాస్లో సీఎం నవీన్ సమక్షంలో బిజదలో చేరారు. -
ప్రధాన పార్టీలకు అసంతృప్తుల బెడద
[ 18-04-2024]
కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్, పొట్టంగి, కొరాపుట్ నియోజకవర్గాల్లో టికెట్ దక్కని అసంతృప్త వర్గాలతో ప్రధాన పార్టీలకు తలనొప్పి వ్యవహారంగా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం