హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల గడువు పెంపు
వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్లు ప్లేట్ల కోసం రవాణా శాఖ విధించిన గడువును మరో నెల రోజులు పొడిగించారు. వాహనాల చివరి నెంబర్లు 1, 2, 3, 4 ఉన్న వాహనదారులు సెప్టెంబరు 30లోగా నెంబర్ ప్లేట్లు మార్చుకోవాలని,
వాహనదారులకు ఊరట
కటక్ న్యూస్టుడే: వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్లు ప్లేట్ల కోసం రవాణా శాఖ విధించిన గడువును మరో నెల రోజులు పొడిగించారు. వాహనాల చివరి నెంబర్లు 1, 2, 3, 4 ఉన్న వాహనదారులు సెప్టెంబరు 30లోగా నెంబర్ ప్లేట్లు మార్చుకోవాలని, లేకుంటే అక్టోబరు 1 నుంచి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని ఇటీవల రవాణా శాఖ ప్రకటించింది. ఈ సౌకర్యం కల్పించేందుకు ఆ శాఖ వద్ద సౌకర్యాలు లేవు. దీంతో నెంబర్ ప్లేట్ల కోసం దరఖాస్తులు చేసిన వారికి నెలరోజుల అనంతరం జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవధి పెంచాలని కోరుతూ హైకోర్టులో వాహనాల యజమానులు కొందరు పిల్ దాఖలు చేశారు. దరఖాస్తు చేసినవారందరికీ నెంబరు ప్లేట్లు సమకూర్చే పరిస్థితి ఆ శాఖకు లేదని వ్యాజ్యం పేర్కొన్నారు. దీంతో సెప్టెంబరు 28న హైకోర్టు విచారణ జరిపి నెంబర్ ప్లేట్లు సమకూర్చేందుకు ఏర్పాటు చేసిన సౌకర్యాల వివరాలు కోర్టుకు తెలియజేయాలని కోరింది. ఈ కేసుపై శుక్రవారం మళ్లీ విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది హాజరై వివరాలు కోర్టులో సమర్పిస్తూ గడువును అక్టోబరు 31 వరకు పెంచుతామని న్యాయమూర్తికి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించి వారి వాహనాలకు కొత్తవాటిని సమకూర్చాలని న్యాయస్థానం సూచించింది. గడువు పొడిగించినట్లు ప్రకటన విడుదల చేస్తామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో అక్టోబరు 26వ తేదీనాటిని విచారణను వాయిదా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బిజద... రాజీనామాల బెడద
[ 24-04-2024]
గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత ఎన్నికల్లో బిజదలో అసంతృప్తి కనిపిస్తోంది. పిరాయింపుదారులకు అధినాయకత్వం టికెట్లు కేటాయించిందన్న అసహనం, అసంతృప్తి రాష్ట్రమంతటా ఉంది. సీనియర్ నాయకులు పార్టీకి రాజీనామాలు చేశారు. -
అనుభవజ్ఞులతో కొత్త అభ్యర్థుల ఢీ
[ 24-04-2024]
నవరంగపూర్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో అనుభవజ్ఞులతో కొత్త అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలో అన్ని పార్టీలు నూతన అభ్యర్థులను బరిలో నిలపడంతో పోటీ ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. -
ముమ్మరంగా నామినేషన్ల దాఖలు
[ 24-04-2024]
కల తేదీలు దగ్గర పడుతున్న వేళ వివిధ పార్టీల నేతలు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. అనుచరులు, నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీలు నిర్వహిస్తూ వెళ్లి తమ ఇష్టదైవాలకు ప్రార్థనలు చేసి తర్వాత నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
అందాల పిట్టలండీ.. సంఖ్య పెరిగేనండీ
[ 24-04-2024]
కేంద్రపడ జిల్లా బితరకనిక జాతీయ ఉద్యానవనంలో మడ అడవి పక్షుల (మేన్గ్రోవ్ పిట్ట) సంఖ్య పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే వీటి సంతతి 39 పెరగడం గమనార్హం. -
గోపాల్పూర్లో ముఖాముఖి పోరు
[ 24-04-2024]
ప్రతిష్ఠాత్మక గోపాల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజద, భాజపా అభ్యర్థుల మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా కనిపిస్తోంది. -
భాజపా గూటికి మరో ఇద్దరు అగ్రనేతలు
[ 24-04-2024]
మాజీ మంత్రి బింబాధర్ కువార్, బిజద మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి నివేదితా నాయక్ భాజపా గూటికి చేరారు. -
మిత్రమండలి కొత్త కార్యవర్గం ఎంపిక
[ 24-04-2024]
బ్రహ్మపురలోని సుమారు 80 ఏళ్ల పురాతన ‘ఆంధ్ర విజ్ఞాన మిత్ర మండలి’ కొత్త కార్యవర్గం ఎంపిక సోమవారం రాత్రి జరిగింది. -
ముగిసిన తరాతరిణి చైత్ర మంగళవారాల యాత్ర
[ 24-04-2024]
గంజాం జిల్లాలోని సుప్రసిద్ధ తరాతరిణి శక్తిపీఠంలో చైత్ర మంగళవారాల యాత్ర ముగిసింది. అయిదో మంగళవారం సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కనిపించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం