నవంబరు 3న ధాంనగర్ ఉప ఎన్నిక
ధాంనగర్ (భద్రక్ జిల్లా) అసెంబ్లీ ఉప ఎన్నిక భేరీ మోగింది. సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ఈమేరకు షెడ్యూల్ ప్రకటించింది. ధాంనగర్ భాజపా ఎమ్మెల్యే బిష్ణుశెఠి మృతితో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.
ఈ నెల 7 నుంచి 14 వరకు నామినేషన్లు
భద్రక్ జిల్లా మ్యాప్
భువనేశ్వర్, న్యూస్టుడే: ధాంనగర్ (భద్రక్ జిల్లా) అసెంబ్లీ ఉప ఎన్నిక భేరీ మోగింది. సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ఈమేరకు షెడ్యూల్ ప్రకటించింది. ధాంనగర్ భాజపా ఎమ్మెల్యే బిష్ణుశెఠి మృతితో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. దసరా వేడుకలు ముగిసినంతనే ప్రధాన రాజకీయ పార్టీలు బిజద, భాజపా, కాంగ్రెస్లు రంగంలోకి దిగుతాయి. కోలాహలం ఊపందుకోనుంది. అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
దివంగత ఎమ్మెల్యే బిష్ణుశెఠి (పాత చిత్రం)
భాజపా అధ్యక్షుని మంతనాలు
భాజపా ఖాతాలో ఉన్న ధాంనగర్ స్థానం నిలబెట్టుకోవాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. గత నెల 30న భాజపా కేంద్ర శాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా ధాంనగర్ సందర్శించి శెఠి కుటుంబ సభ్యులను పరామర్శించిన సంగతి విదితమే. ఇక్కడ ఏర్పాటైన సంతాప సభలో పాల్గొన్న నడ్డా తదుపరి అభ్యర్థి ఎవరన్న విషయం భద్రక్ జిల్లా నేతలతో చర్చించారు.
నివేదిక అడిగిన నవీన్
గత సాధారణ ఎన్నికల తర్వాత 5 చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. అన్ని స్థానాలను బిజద కైవసం చేసుకుంది. ధాంనగర్ స్థానాన్నీ గెలిచి ప్రతిష్ట పెంచుకోవాలన్న ధ్యేయంతో ఆ పార్టీ ఉంది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక భద్రక్ జిల్లా నేతలతో ఈ విషయమై ఇదివరకే మాట్లాడారు. అర్హుల వివరాలపై నివేదిక అడిగినట్లు తెలిసింది.
కాంగ్రెస్కు సవాల్
ఇంటిపోరు, భేదాభిప్రాయాలతో సతమతమవుతూ వరుస పరాజయాలు చవిచూస్తున్న కాంగ్రెస్ ప్రతిష్టకు ధాంనగర్ ఉప ఎన్నిక సవాల్ కానుంది. మంచి అభ్యర్థిని నిలబెట్టి ఈ స్థానం తమ ఖాతాలో వేసుకుంటామని, త్వరలో అభ్యర్థి ఎంపిక జరుగుతుందని ఆ పార్టీ నేతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 25-04-2024]
ఒడిశాలో కోరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. -
అభివృద్ధి కొనసాగుతుంది..శంక ద్వయాన్ని ఆశీర్వదించండి
[ 25-04-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, బిజదను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజల్ని కోరారు. -
భాజపాకు 40 మంది స్టార్ ప్రచారకులు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపా స్టార్ ప్రచారకుల జాబితా మంగళవారం రాత్రి విడుదల చేశారు. -
ఇంకెన్నాళ్లీ దుస్థితి?
[ 25-04-2024]
అధ్వానంరాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయన్న నివేదికలు దిగజారిన ‘నాక్’ గ్రేడేషన్లు దుస్థితిని తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి నిలదీశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో భర్తీకాని టీచింగ్ సిబ్బంది, అసౌకర్యాలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ల గురించి ఏం సమాధానం చెబుతారన్నారు. -
ఓ తండ్రి...ఇద్దరు కొడుకులు
[ 25-04-2024]
గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నామినేషన్ల సందడి
[ 25-04-2024]
బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్ పత్రాన్ని సబ్ కలెక్టర్ అనూప్ పండాకు అందజేశారు. -
భాజపాలో సీమారాణి చేరిక
[ 25-04-2024]
బిజదకు రాజీనామా చేసిన హిందళ్ సిటింగ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్ బుధవారం భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర నాయకులు ఆమెను స్వాగతించారు. -
నేడు అమిత్షా రాక
[ 25-04-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం సోన్పూర్లో ఏర్పాటయ్యే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
నా ఓటు.. నా బాధ్యత
[ 25-04-2024]
నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్