ఏకామ్ర క్షేత్రానికి కొత్త సొబగులు
భువనేశ్వర్లోని సుప్రసిద్ధ ఏకామ్ర (లింగరాజ్) శైవ క్షేత్రానికి నూతన సొబగులు, సౌకర్యాలు సమకూరనున్నాయి. కేంద్ర ప్రాచీన స్మారక కట్టడాల సంస్థ (ఎన్ఎంఏ) ఈ పనులకు అనుమతులిచ్చింది.
నూతన నిర్మాణాలు, సౌకర్యాలకు ఎన్ఎంఏ ఆమోదం
త్వరలో పనులు ప్రారంభమన్న మంత్రి పండా
అభివృద్ధి పనుల మాస్టర్ ప్లాన్
భువనేశ్వర్, న్యూస్టుడే: భువనేశ్వర్లోని సుప్రసిద్ధ ఏకామ్ర (లింగరాజ్) శైవ క్షేత్రానికి నూతన సొబగులు, సౌకర్యాలు సమకూరనున్నాయి. కేంద్ర ప్రాచీన స్మారక కట్టడాల సంస్థ (ఎన్ఎంఏ) ఈ పనులకు అనుమతులిచ్చింది.
అలనాటి రాజుల వైభవం
రాష్ట్రంలో శైవ పీఠాల్లోకెల్లా ముఖ్యమైనది లింగరాజ్. 10వ శతాబ్దంలో నాటి కళింగ పాలకుడు బజాతి కేసరిదేవ్ ఈ ముక్కంటి క్షేత్ర నిర్మాణం చేయించారు. ఆయన తర్వాత పాలించిన లలాటేందు కేసరిదేవ్ హయాంలో పనులు పూర్తయ్యాయి. 55 మీటర్ల ఎత్తులో నిర్మాణమైన ఈ ఆలయం కళింగ శిల్పకళావైభానికి ప్రతీకకగా నిలుస్తోంది. దీనికి చేరువలో రాజారాణి, ముక్తేశ్వర, బిందు సాగరం (పుష్కరిణి) అనంత వాసుదేవ, ఇతర సాంస్కృతిక పీఠాలు అప్పట్లో ఏర్పాటయ్యాయి.
కాలప్రవాహంలో ఇరుకుగా
కాలక్రమంలో భువనేశ్వర్ రాష్ట్ర రాజధానిగా ఏర్పాటైన తర్వాత అనేక నిర్మాణాలు జరిగాయి. జన సంఖ్య, స్థలాల ఆక్రమణలూ పెరిగాయి. లింగరాజ్ ఆలయ స్థలాల్లోనూ అడ్డదిడ్డంగా కట్టడాలు వెలిశాయి. దీంతో రోడ్లు ఇరుకుగా మారాయి. అసంఖ్యాక భక్తులు ముక్కంటి దర్శనానికి వస్తున్నారు. వారికి సరైన సౌకర్యాలు లేవు. పవిత్రమైన బిందుసాగరం కలుషితమైంది. దీనిని పరిశీలించిన ప్రభుత్వం పూరీ శ్రీక్షేత్ర కారిడార్ తరహాలో విస్తరణ, రహదారుల వెడల్పు, భక్తుల సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది.
పాండ్యన్ సందర్శన తర్వాత
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాల మేరకు 5-టీ కార్యదర్శి వి.కార్తికేయ పాండ్యన్ ఇటీవల ఏక్రామ క్షేత్రాన్ని సందర్శించి పరిశీలించిన తర్వాత ఆధునికీకరణ పనుల మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. ఆక్రమణలు తొలగించారు. కొత్త నిర్మాణాలకు అనుమతించాలని ప్రభుత్వం ఎన్ఎంఏకు లేఖ రాసింది. ముక్కంటి ఆలయ సంరక్షణ బాధ్యత పురావస్తుశాఖ (ఏఎస్ఐ) పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రాచీన కట్టడం జోలికి వెళ్లకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని ఎన్ఏంఏ ప్రభుత్వానికి తెలియజేసింది.
బిందు సాగరం
ఈ.వెయ్యికోట్ల వ్యయం
ఏకామ్ర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అశోక్చంద్ర పండా సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలోని ప్రముఖ క్షేత్రాలు, ప్రాచీన సందర్శనీయ స్థలాల ఆధునికీకరణ పనులకు ప్రాధాన్యమిచ్చిన సీఎం లింగరాజ్ ఆలయ ఆధునికీకరణ నిర్మాణాలకు రూ.వెయ్యికోట్లు కేటాయించినట్లు చెప్పారు. త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నితీష్ గమ్యం ఎటువైపు?
[ 20-04-2024]
సంబల్పూర్ సిటింగ్ ఎంపీ నితీష్ గమ్యం ఎటువైపు? ఈసారి ఎన్నికల్లో ఆయన భార్య అరుంధతీ దేవి తరఫున ప్రచారం చేస్తారా? భాజపాకు అనుకూలంగా ఉంటారా? అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. -
కనుల పండువగా చైత్రోత్సవాలు
[ 20-04-2024]
శక్తి స్వరూపిణి, శాంతి స్వరూపిణి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. -
మౌలిక సౌకర్యాలకు దూరం.. ఎన్నికల బహిష్కరణ నిర్ణయం
[ 20-04-2024]
కొంధమాల్ జిల్లా బలిగుడ సమితిలో రుతుంగియా పంచాయతీలోని గగలిమహ, పనిపదర్, పాంగాబడి గ్రామాలకు రహదారులు, తాగునీరు, అంగన్వాడీ వంటి మౌలిక సౌకర్యాలు లేవు. -
మహిళా ఓటర్లే అత్యధికం
[ 20-04-2024]
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికలు జరగనున్న నాలుగు లోక్సభ స్థానాల్లో పురుషులకంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) నికుంజ బిహారీ ధొళో అన్నారు. -
బ్రహ్మపురలో నామినేషన్ల పర్వం
[ 20-04-2024]
బ్రహ్మపుర సబ్కలెక్టరు కార్యాలయం, పరిసరాలు రెండోరోజు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులు, వారి మద్దతుదారులతో కిటకిటలాడింది. -
భాజపా మోదీ మంత్రం.. బిజద అభివృద్ధి అస్త్రం
[ 20-04-2024]
ప్రధాన పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేస్తున్నాయి. మండుటెండలను కూడా లెక్క చేయకుండా ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. రోడ్షోలు, పాదయాత్రలు, సభలు నిర్వహిస్తున్నారు. -
మహానదిలో పడవ మునక: ఇద్దరి దుర్మరణం
[ 20-04-2024]
ఝార్సుగుడ జిల్లా లఖన్పూర్ సమితి ఛత్తీస్గఢ్ సరిహద్దు శారదా వద్ద శుక్రవారం సాయంత్రం మహానదిలో పడవ మునిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. -
నిప్పుల కొలిమిలా రాష్ట్రం
[ 20-04-2024]
రాష్ట్రం నిప్పులకొలిమిలా మారింది. భానుని ప్రతాపంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటాయి. -
చాకుతో దాడి: యువకుడి హతం
[ 20-04-2024]
గంజాం జిల్లా నిమ్మఖండి ఠాణా పరిధిలోని బొరిగావ్ గ్రామంలోని అమ్మవారి మందిరం సమీపాన చెరువు ఒడ్డున గురువారం సాయంత్రం సునీల్ దాస్ (27) అనే యువకుడు, మరో యువకుడి మధ్య పాతకక్షల నేపథ్యంలో వాగ్వాదం జరిగింది.