బహిర్భూమి రహిత గ్రామాల కేటగిరీలో ఒడిశాకు చోటు
స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ 2.0 కింద మన రాష్ట్రానికి తొమ్మిది అవార్డులు దక్కాయి. బహిర్భూమి రహిత గ్రామాల కేటగిరిలో ఒడిశా నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. కేంద్ర జల్శక్తి ఆధ్వర్యంలోని పారిశుద్ధ్యం, తాగునీటి విభాగం ఆదివారం ప్రకటించిన గ్రామీణ స్వచ్ఛ సర్వే ఫలితాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
నాలుగోస్థానం దక్కించుకున్న రాష్ట్రం
స్వచ్ఛభారత్ మిషన్ కింద తొమ్మిది అవార్డులు
రాయగడ సమితి మారుమూల గ్రామంలో నిర్మించిన మరుగుదొడ్లు
రాయగడ పట్టణం, న్యూస్టుడే: స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ 2.0 కింద మన రాష్ట్రానికి తొమ్మిది అవార్డులు దక్కాయి. బహిర్భూమి రహిత గ్రామాల కేటగిరిలో ఒడిశా నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. కేంద్ర జల్శక్తి ఆధ్వర్యంలోని పారిశుద్ధ్యం, తాగునీటి విభాగం ఆదివారం ప్రకటించిన గ్రామీణ స్వచ్ఛ సర్వే ఫలితాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. వాటి ప్రకారం... ‘‘సుజలం’’ కింద నీటి సంరక్షణ చర్యలకు రెండు అవార్డులను దక్కించుకున్న రాష్ట్రం, స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ సర్వే కింద రెండు అవార్డులు, బహిర్భూమి రహిత అంశంపై అవగాహన కల్పనకు మరో ఐదు అవార్డులను సొంతం చేసుకుంది.
23.9 శాతం గ్రామాలు..
స్వచ్ఛభారత్ మిషన్ కింద రాష్ట్రంలో 23.9 శాతం గ్రామాలు బహిర్భూమి రహితంగా మారాయి. రాష్ట్రంలో మొత్తం 46,785 గ్రామాలకు గానూ 11,203 గ్రామాల్లో ఓడీఎఫ్ ప్లస్ కేటగిరీని గుర్తించారు. జిల్లాల వారీగా చూస్తే జాజ్పూర్ ఈ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు సర్వే గణాంకాలు వెల్లడించాయి. సర్వేలో గ్రామాలతో పాటు పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, ఘన, ద్రవ, వ్యర్థాల నిర్వహణ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. రాష్ట్రం తరఫున పంచాయతీరాజ్, తాగునీటి శాఖ కార్యదర్శి ఎస్.కె.లోహనీ ఇతర అధికారులు అవార్డులను స్వీకరించారు.
కాగితాలకే పరిమితం
అవార్డులు దక్కడం పట్ల ప్రతిపక్ష వర్గాలు విమర్శలు గుప్తిస్తున్నాయి. మరుగుదొడ్లు నిర్మించినంత మాత్రన బహిర్భూమి రహిత గ్రామాలుగా ప్రకటించలేమని వాటి వినియోగం పట్ల ప్రజలను చైతన్య పరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో చాలా గ్రామాల్లో వినియోగించని, నిర్వహణ కొరవడిన, వేరే కార్యకలాపాలకు వినియోగిస్తున్న మరుగుదొడ్లు దర్శనమిస్తుండడం ఇందుకు నిదర్శనమని ఆరోపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారసులొచ్చారు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొంతమంది ప్రముఖ నాయకులు పోటీ నుంచి తప్పుకున్నారు. వారి భార్యలు, వారసులను బరిలోకి దించారు. బిజద, భాజపా, కాంగ్రెస్ పార్టీల నాయకత్వాలు వారికి అవకాశం కల్పించాయి. తండ్రులు, తల్లులు వారి తరుఫున ప్రచారం చేస్తున్నారు. -
కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘హెర్’ టీం
[ 19-04-2024]
మహిళల్ని వేధించే వారి భరతం పట్టడానికి జంటనగరాల (భువనేశ్వర్, కటక్) కమిషనరేట్ యంత్రాంగం ‘హై ఎఫిషియన్సీ రెస్పాన్స్ (హెరా) టీం ఏర్పాటు చేసింది. -
సత్వర విద్యుత్తు సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు
[ 19-04-2024]
వేసవిలో ప్రజలకు మరింత మెరుగైన విద్యుత్తు సేవలు అందించేందుకు, సరఫరాలో అంతరాయం ఏర్పడితే సత్వర సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు సిద్ధం చేశామని విద్యుత్తు సరఫరా సంస్థ ‘టాటా పవర్ సదరన్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్’ (టీపీఎస్ఓడీఎల్) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది -
జగన్నాథునికి రూ.2.51 కోట్ల విరాళం
[ 19-04-2024]
రిలయన్స్ గ్రూపు సంస్థల అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ బుధవారం పూరీ శ్రీక్షేత్రానికి వచ్చారు. జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
సచిదాస్ కన్నుమూత
[ 19-04-2024]
జత్రా పార్టీ (నాటకాలు) దర్శకునిగా, నటునిగా ఖ్యాతి గాంచిన సచిదాస్ (91) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అస్వస్థతతో కటక్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. -
ఎవరి ప్రయోజనాల కోసం రెండుచోట్ల పోటీ?
[ 19-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మళ్లీ రెండుచోట్ల పోటీకి సిద్ధమయ్యారు. దీనివల్ల ప్రజలకు ఒరిగేదేమిటని? ఈ పోటీ ఎవరి ప్రయోజనాల కోసమని? సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో ఉప ఎన్నిక, వ్యయప్రయాసలు మినహా సాధించేదేమిటని విమర్శలు వినిపిస్తున్నాయి. -
నేటి నుంచి మజ్జిగౌరీ చైత్రోత్సవాలు
[ 19-04-2024]
రాయగడ ఉత్కళాంధ్రుల ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవ సంబరాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
‘శ్రేష్ఠ భారత్’ ఏర్పాటుకు అంతా సహకరించాలి
[ 19-04-2024]
‘శ్రేష్ఠ భారత్’ లక్ష్యంగా దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలు, అన్ని రంగాల సమగ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ 2024 సంకల్ప పత్రం జారీ చేశారని, ప్రజలంతా సహకరించి, మరోసారి మోదీని ప్రధాని చేసేందుకు ముందుకు రావాలని బ్రహ్మపుర లోక్సభ భాజపా అభ్యర్థి ప్రదీప్ కుమార్ పాణిగ్రహి కోరారు -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 19-04-2024]
గంజాం జిల్లా గొళంత్రా ఠాణా పరిధిలోని కొణిసి-తుళు మార్గంలో బుధవారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు యువకులు ఎమ్కేసీజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!