logo

Murali Prasad: గుండెపోటుతో గాయకుడి ఆకస్మిక మృతి

జయపురం నగరంలో జగత్‌ జనని ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి విషాదంగా ముగిసింది. దసరా వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జయపురానికి చెందిన గాయకుడు మురళీ ప్రసాద్‌ మహాపాత్ర్‌ (54) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు.

Updated : 04 Oct 2022 08:23 IST

మురళీ ప్రసాద్‌

జయపురం, న్యూస్‌టుడే: ఒడిశాలోని జయపురం నగరంలో జగత్‌ జనని ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి విషాదంగా ముగిసింది. దసరా వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జయపురానికి చెందిన గాయకుడు మురళీ ప్రసాద్‌ మహాపాత్ర(54) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. రెండు పాటలు పాడిన ఆయన అనంతరం విశ్రాంతి తీసుకుంటుండగా ఈ ఘటన జరిగింది. శ్రోతలు, కళాకారులు జిల్లా ప్రధానాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అంతవరకు సరదాగా ఉన్న వాతావరణం ఆయన మృతితో విషాదంగా మారిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని