17న హైదరాబాదులో సదస్సు
ఈ నెల 17న హైదరాబాదు (తెలంగాణ)లో ఒడిశా ప్రభుత్వం పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పాల్గొని పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి చర్చిస్తారు.
పెట్టుబడిదారులతో నవీన్ భేటీ
భువనేశ్వర్, న్యూస్టుడే: ఈ నెల 17న హైదరాబాదు (తెలంగాణ)లో ఒడిశా ప్రభుత్వం పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పాల్గొని పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి చర్చిస్తారు. కార్యక్రమంలో పరిశ్రమలు, విద్యుత్తు శాఖల మంత్రి ప్రతాప్ దేవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ మహాపాత్ర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. దసరా సెలవుల తర్వాత పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి హేమంత శర్మ హైదరాబాదు చేరుకుని ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు. గతంలో దుబాయ్, దిల్లీ, ముంబయి, బెంగళూరులలో ఏర్పాటైన కార్యక్రమాల్లో సీఎం పెట్టుబడిదారులతో చర్చించారు. మంచి ఫలితాలొచ్చాయని మంత్రి దేవ్ మంగళవారం భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. హైదరాబాదులో ఐటీ, ఉక్కు, అల్యూమినియం, విద్యుత్తు, చేనేత, జౌళి, పర్యటక రంగాల్లో పెట్టుబడులపై సీఎం పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు. నవంబరు 30 నుంచి డిసెంబరు 4 వరకు (5 రోజులు) భువనేశ్వర్ ప్రదర్శనా మైదానంలో మేకిన్ ఒడిశా సదస్సు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికిది అద్దం పడుతుందన్న ఆశాభావం ఉందని మంత్రి తెలిపారు. ఈ సదస్సులో దేశ విదేశాల కంపెనీల యాజమాన్యాలు, సీఈవోలు పాల్గొంటారన్నారు. రాష్ట్రానికి ఇంతవరకు రూ.6 లక్షల కోట్లు పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని, కొన్ని సంస్థలు నిర్మాణాలు ప్రారంభించాయన్నారు. రాష్ట్రాభివృద్ధిపై ఆసక్తి లేని విపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని, వాటిని పట్టించుకోబోమన్నారు. హైదరాబాదు సదస్సులో ప్రముఖ కంపెనీల యజమానులు పాల్గొంటారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధి కొనసాగుతుంది..శంక ద్వయాన్ని ఆశీర్వదించండి
[ 25-04-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, బిజదను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజల్ని కోరారు. -
భాజపాకు 40 మంది స్టార్ ప్రచారకులు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపా స్టార్ ప్రచారకుల జాబితా మంగళవారం రాత్రి విడుదల చేశారు. -
ఇంకెన్నాళ్లీ దుస్థితి?
[ 25-04-2024]
అధ్వానంరాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయన్న నివేదికలు దిగజారిన ‘నాక్’ గ్రేడేషన్లు దుస్థితిని తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి నిలదీశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో భర్తీకాని టీచింగ్ సిబ్బంది, అసౌకర్యాలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ల గురించి ఏం సమాధానం చెబుతారన్నారు. -
ఓ తండ్రి...ఇద్దరు కొడుకులు
[ 25-04-2024]
గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నామినేషన్ల సందడి
[ 25-04-2024]
బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్ పత్రాన్ని సబ్ కలెక్టర్ అనూప్ పండాకు అందజేశారు. -
భాజపాలో సీమారాణి చేరిక
[ 25-04-2024]
బిజదకు రాజీనామా చేసిన హిందళ్ సిటింగ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్ బుధవారం భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర నాయకులు ఆమెను స్వాగతించారు. -
నేడు అమిత్షా రాక
[ 25-04-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం సోన్పూర్లో ఏర్పాటయ్యే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
నా ఓటు.. నా బాధ్యత
[ 25-04-2024]
నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.