సముద్రంలో ఉండగా పడవలో మంటలు.. బతికి బయటపడిన మత్స్యకారులు
బాలేశ్వర్ జిల్లాలో సముద్రం మధ్యలో ఉన్న అబ్దుల్ కలాం ద్వీపం ప్రాంతంలో గురువారం ఉదయం మత్స్యకారుల పడవ అగ్ని ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న పదిమంది త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనపై లభించిన వివరాల ప్రకారం...
సముద్రం మధ్యలో మంటల్లో పడవ
కటక్ న్యూస్టుడే: ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో సముద్రం మధ్యలో ఉన్న అబ్దుల్ కలాం ద్వీపం ప్రాంతంలో గురువారం ఉదయం మత్స్యకారుల పడవ అగ్ని ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న పదిమంది త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనపై లభించిన వివరాల ప్రకారం... భద్రక్ జిల్లా ధమర సమితి దోసింగా గ్రామానికి చెందిన పదిమంది మత్స్యకారులు గురువారం ఉదయం చేపల వేటకు సముద్రంపైకి వెళ్లారు. అబ్దుల్ కలాం దీపం వద్ద వారున్న పడవలో మంటలు పుట్టాయి. దీంతో వారంతా కోస్టల్ గార్డులకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని మత్స్యకారులను ఆదుకున్నారు. ఇంతలో పడవ పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి కారణాలు వెలుగులోకి రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారసులొచ్చారు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొంతమంది ప్రముఖ నాయకులు పోటీ నుంచి తప్పుకున్నారు. వారి భార్యలు, వారసులను బరిలోకి దించారు. బిజద, భాజపా, కాంగ్రెస్ పార్టీల నాయకత్వాలు వారికి అవకాశం కల్పించాయి. తండ్రులు, తల్లులు వారి తరుఫున ప్రచారం చేస్తున్నారు. -
కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘హెర్’ టీం
[ 19-04-2024]
మహిళల్ని వేధించే వారి భరతం పట్టడానికి జంటనగరాల (భువనేశ్వర్, కటక్) కమిషనరేట్ యంత్రాంగం ‘హై ఎఫిషియన్సీ రెస్పాన్స్ (హెరా) టీం ఏర్పాటు చేసింది. -
సత్వర విద్యుత్తు సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు
[ 19-04-2024]
వేసవిలో ప్రజలకు మరింత మెరుగైన విద్యుత్తు సేవలు అందించేందుకు, సరఫరాలో అంతరాయం ఏర్పడితే సత్వర సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు సిద్ధం చేశామని విద్యుత్తు సరఫరా సంస్థ ‘టాటా పవర్ సదరన్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్’ (టీపీఎస్ఓడీఎల్) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది -
జగన్నాథునికి రూ.2.51 కోట్ల విరాళం
[ 19-04-2024]
రిలయన్స్ గ్రూపు సంస్థల అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ బుధవారం పూరీ శ్రీక్షేత్రానికి వచ్చారు. జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
సచిదాస్ కన్నుమూత
[ 19-04-2024]
జత్రా పార్టీ (నాటకాలు) దర్శకునిగా, నటునిగా ఖ్యాతి గాంచిన సచిదాస్ (91) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అస్వస్థతతో కటక్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. -
ఎవరి ప్రయోజనాల కోసం రెండుచోట్ల పోటీ?
[ 19-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మళ్లీ రెండుచోట్ల పోటీకి సిద్ధమయ్యారు. దీనివల్ల ప్రజలకు ఒరిగేదేమిటని? ఈ పోటీ ఎవరి ప్రయోజనాల కోసమని? సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో ఉప ఎన్నిక, వ్యయప్రయాసలు మినహా సాధించేదేమిటని విమర్శలు వినిపిస్తున్నాయి. -
నేటి నుంచి మజ్జిగౌరీ చైత్రోత్సవాలు
[ 19-04-2024]
రాయగడ ఉత్కళాంధ్రుల ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవ సంబరాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
‘శ్రేష్ఠ భారత్’ ఏర్పాటుకు అంతా సహకరించాలి
[ 19-04-2024]
‘శ్రేష్ఠ భారత్’ లక్ష్యంగా దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలు, అన్ని రంగాల సమగ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ 2024 సంకల్ప పత్రం జారీ చేశారని, ప్రజలంతా సహకరించి, మరోసారి మోదీని ప్రధాని చేసేందుకు ముందుకు రావాలని బ్రహ్మపుర లోక్సభ భాజపా అభ్యర్థి ప్రదీప్ కుమార్ పాణిగ్రహి కోరారు -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 19-04-2024]
గంజాం జిల్లా గొళంత్రా ఠాణా పరిధిలోని కొణిసి-తుళు మార్గంలో బుధవారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు యువకులు ఎమ్కేసీజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు
తాజా వార్తలు (Latest News)
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా