భాజపా ధాంనగర్ అభ్యర్థి సూరజ్?
ధాంనగర్ (భద్రక్ జిల్లా) అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో శుక్రవారం నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ధాంనగర్ దివంగత ఎమ్మెల్యే బిష్ణుశెఠి కుమారుడు సూరజ్ సూర్యవంశీ భాజపా అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఆ పార్టీ నాయకత్వం ఈమేరకు అధికారికంగా ప్రకటించనుంది.
బిజద కోసం పేర్లు పరిశీలిస్తున్న నవీన్
రెండ్రోజుల్లో ఖాయం చేస్తామన్న కాంగ్రెస్
బిష్ణుశెఠి భార్య, కుమార్తెతో మాట్లాడుతున్న నడ్డా, ధర్మేంద్ర (పాత చిత్రం)
భువనేశ్వర్, న్యూస్టుడే: ధాంనగర్ (భద్రక్ జిల్లా) అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో శుక్రవారం నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ధాంనగర్ దివంగత ఎమ్మెల్యే బిష్ణుశెఠి కుమారుడు సూరజ్ సూర్యవంశీ భాజపా అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఆ పార్టీ నాయకత్వం ఈమేరకు అధికారికంగా ప్రకటించనుంది.
సానుభూతిపై నమ్మకం
బిష్ణుశెఠి మృతి పట్ల ధానంనగర్వాసుల్లో సానుభూతి ఉందన్న ఉద్దేశంతో భాజపా ఆయన తనయునికి టిక్కెట్టు కేటాయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం సూరజ్ సూర్యవంశీ భద్రక్ జిల్లా యువమోర్చా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. గత నెల 30న బిష్ణుశెఠి శ్రాద్ధకర్మల్లో పాల్గొనేందుకు భాజపా కేంద్ర శాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా ధాంనగర్ వచ్చారు. శెఠి కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత సూరజ్ అభ్యర్థిత్వం ఖరారు చేశారని తెలిసింది.
బుధిరాంకు అవకాశం?
వరుస పరాజయాలతో ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్ ధాంనగర్లో విజయం సాధించాలన్న ధ్యేయంతో ఉంది. 2019లో ఈ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బుధిరాం సమాల్ ధరావతు కోల్పోయారు. ఈసారి మళ్లీ బుధిరాం టిక్కెట్టు ఆశిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్ అభ్యర్థి ఖరారు కోసం కమిటీ ఏర్పాటు చేసిన సంగతి విదితమే. పీసీసీ మాజీ అధ్యక్షుడు జయదేవ్ జెనా గురువారం ధానంనగర్ చేరుకుని కార్యకర్తలతో మంతనాలు జరిపారు.
కచ్చితంగా గెలుస్తాం
భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షుడు సమీర్ మహంతి గురువారం భువనేశ్వర్ విలేకరులతో మాట్లాడుతూ... ధాంనగర్లో భాజపా విజయం తథ్యమన్నారు. కేంద్ర నాయకత్వం సూరజ్ సూర్యవంశీ పేరు అధికారికంగా ప్రకటిస్తుందన్నారు. 2024 సాధారణ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ ఉప ఎన్నిక భాజపాకు ప్రతిష్టాత్మకమని తెలిపారు.
గురి తప్పదు
బిజద అధికార ప్రతినిధి లెనిన్ మహంతి గురువారం భువనేశ్వర్లో విలేకరులతో మాట్లాడుతూ.... ఇక్కడ గతసారి పార్టీ అభ్యర్థి స్పల్ప ఓట్ల లేడాతో ఓటమి పాలయ్యారని, ఈసారి గురి తప్పదని పేర్కొన్నారు. అభ్యర్థి ఖరారుకు సంబంధించి సీఎం అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారని, రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
సమష్టిగా ఉద్యమిస్తాం
పీసీసీ మాజీ అధ్యక్షుడు జెనా గురువారం ధాంనగర్లో విలేకరులతో మాట్లాడుతూ.... విజయావకాశాలున్న ఉత్తమ అభ్యర్థిని బరిలోకి దింపి సమష్టిగా ఉద్యమిస్తామన్నారు. ప్రజలకు వాస్తవాలు చెబుతామని, బిజద, భాజపాలు వేరుకాదని, లోపాయికారీ అవగాహన ఉందని వివరిస్తామన్నారు. పరాజయాల నుంచి గుణపాఠం నేర్చుకున్న కాంగ్రెస్ ఈ స్థానం గెలిచి విజయాలకు బాట వేసుకుంటుందన్నారు.
ఇద్దరిలో ఎవరికి?
బిజద అధినేత, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి ఎంపికపై పరిశీలించి తనకు నివేదిక సమర్పించాలని భద్రక్ జిల్లా నాయకత్వానికి ఆదేశించారు. శుక్రవారం ఆయనకు అర్హుల వివరాలు అందనున్నాయి. 2019 ఎన్నికల్లో బిజద అభ్యర్థిగా పాటీ చేసిన రాజేంద్రదాస్ స్వల్ప ఓట్లు (4,625) తేడాతో ఓడిపోయారు. అప్పట్లో బిజద టిక్కెట్టు ఆశించి భంగపడిన ముక్తికాంత మండల్ వర్గీయులు రాజేంద్ర ఓటమికి కారణమయ్యారని అప్పట్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుత ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి రాజేంద్ర, ముక్తికాంత నవీన్కు దరఖాస్తులు చేశారు. సీఎం వీరిద్దరిలో ఒకరిని ఎంపిక చేస్తారా? ఇతరులకు అవకాశం ఇస్తారా? అన్నది త్వరలో స్పష్టం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మావో డంప్ స్వాధినం
[ 19-04-2024]
మల్కానిగిరి జిల్లా కలిమెల ఠాణా పరిధిలో వున్న సానో టేకుడ, బెజంగి వాడ గ్రామం మధ్యలో వున్న అడవిలో బి.ఎస్.ఎఫ్. జవాన్లు మావో డంప్ స్వాధినం చెసుకున్నారు. -
వారసులొచ్చారు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొంతమంది ప్రముఖ నాయకులు పోటీ నుంచి తప్పుకున్నారు. వారి భార్యలు, వారసులను బరిలోకి దించారు. బిజద, భాజపా, కాంగ్రెస్ పార్టీల నాయకత్వాలు వారికి అవకాశం కల్పించాయి. తండ్రులు, తల్లులు వారి తరుఫున ప్రచారం చేస్తున్నారు. -
కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘హెర్’ టీం
[ 19-04-2024]
మహిళల్ని వేధించే వారి భరతం పట్టడానికి జంటనగరాల (భువనేశ్వర్, కటక్) కమిషనరేట్ యంత్రాంగం ‘హై ఎఫిషియన్సీ రెస్పాన్స్ (హెరా) టీం ఏర్పాటు చేసింది. -
సత్వర విద్యుత్తు సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు
[ 19-04-2024]
వేసవిలో ప్రజలకు మరింత మెరుగైన విద్యుత్తు సేవలు అందించేందుకు, సరఫరాలో అంతరాయం ఏర్పడితే సత్వర సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు సిద్ధం చేశామని విద్యుత్తు సరఫరా సంస్థ ‘టాటా పవర్ సదరన్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్’ (టీపీఎస్ఓడీఎల్) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది -
జగన్నాథునికి రూ.2.51 కోట్ల విరాళం
[ 19-04-2024]
రిలయన్స్ గ్రూపు సంస్థల అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ బుధవారం పూరీ శ్రీక్షేత్రానికి వచ్చారు. జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
సచిదాస్ కన్నుమూత
[ 19-04-2024]
జత్రా పార్టీ (నాటకాలు) దర్శకునిగా, నటునిగా ఖ్యాతి గాంచిన సచిదాస్ (91) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అస్వస్థతతో కటక్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. -
ఎవరి ప్రయోజనాల కోసం రెండుచోట్ల పోటీ?
[ 19-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మళ్లీ రెండుచోట్ల పోటీకి సిద్ధమయ్యారు. దీనివల్ల ప్రజలకు ఒరిగేదేమిటని? ఈ పోటీ ఎవరి ప్రయోజనాల కోసమని? సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో ఉప ఎన్నిక, వ్యయప్రయాసలు మినహా సాధించేదేమిటని విమర్శలు వినిపిస్తున్నాయి. -
నేటి నుంచి మజ్జిగౌరీ చైత్రోత్సవాలు
[ 19-04-2024]
రాయగడ ఉత్కళాంధ్రుల ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవ సంబరాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
‘శ్రేష్ఠ భారత్’ ఏర్పాటుకు అంతా సహకరించాలి
[ 19-04-2024]
‘శ్రేష్ఠ భారత్’ లక్ష్యంగా దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలు, అన్ని రంగాల సమగ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ 2024 సంకల్ప పత్రం జారీ చేశారని, ప్రజలంతా సహకరించి, మరోసారి మోదీని ప్రధాని చేసేందుకు ముందుకు రావాలని బ్రహ్మపుర లోక్సభ భాజపా అభ్యర్థి ప్రదీప్ కుమార్ పాణిగ్రహి కోరారు -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 19-04-2024]
గంజాం జిల్లా గొళంత్రా ఠాణా పరిధిలోని కొణిసి-తుళు మార్గంలో బుధవారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు యువకులు ఎమ్కేసీజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు
తాజా వార్తలు (Latest News)
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్