Cyclone: తుపాను తీరం దాటేదెక్కడ?
అండమాన్ వద్ద సముద్రంలో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా ఉందని, గురువారం ఇది అల్పపీడనంగా మారుతుందని గోపాలపూర్ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్దాస్ బుధవారం ‘న్యూస్టుడే’కు చెప్పారు.
ఇంకా స్పష్టత లేదన్న ఐఎండీ
అండమాన్లో ప్రస్తుత పరిస్థితి (బుధవారం ఐఎండీ విడుదల చేసిన మ్యాప్)
గోపాలపూర్, న్యూస్టుడే: అండమాన్ వద్ద సముద్రంలో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా ఉందని, గురువారం ఇది అల్పపీడనంగా మారుతుందని గోపాలపూర్ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్దాస్ బుధవారం ‘న్యూస్టుడే’కు చెప్పారు. 22 ఉదయంలోగా వాయుగుండంగా మారనున్న పీడనం మరింత బలం పుంజుకొని 23న తుపానుగా మారుతుందన్నారు. తూర్పు కేంద్ర బంగాళాఖాతం నుంచి ఈ విపత్తు పశ్చిమ కేంద్ర బంగాళాఖాతానికి చేరువవుతుందని, ఆ తర్వాత మళ్లీ దిశ మార్చుకుని తీరంవైపు వస్తుందని చెప్పారు. తుపాను తీవ్రత, ఎక్కడ తీరాన్ని దాటుతుందన్నదానిపై ఇంకా స్పష్టత లేదని, 22న పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో సముద్ర ఉపరితలంలో 22వ తేదీ నుంచి గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కెరటాల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని చెప్పారు. చేపల వేట నిషేధించినట్లు చెప్పారు.
అమావాస్యతో రాకాసి అలల ముప్పు
గోపాలపూర్, న్యూస్టుడే: అండమాన్లో ఏర్పడిన ఆవర్తనం తుపాను కానుందని స్పష్టమైంది. అమావాస్య సమయంలో ఈ విపత్తు తీరానికి చేరువవుతోంది. దీంతో రాకాసి అలలు విరుచుకు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ అధ్యయన నిపుణులంటున్నారు.
బలం పుంజుకునే అవకాశం
తుపాను బలం పుంజుకోవడానికి సముద్రం, వాయుమండలంలో సానుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ అధ్యయన నిపుణుడు డాక్టర్ సందీప్ పట్నాయక్ బుధవారం ‘న్యూస్టుడే’కు చెప్పారు. గాలి తీవ్రత, వర్షపాతం ఎలా ఉంటుందనేది 22న స్పష్టమవుతుందన్నారు. అమావాస్య, పౌర్ణమి సమయాల్లో సముద్రంలో ఆటుపోట్లు తీవ్రంగా ఉంటాయని, ఈ స్థితిలో నెలకొన్న విపత్తు వల్ల తీరంవైపు రాకాసి అలలు విరుచుకుపడతాయని చెప్పారు.
ప్రయాణ దిశ 22న తెలుస్తుంది
ఐఎండీ మాజీ ఉన్నతాధికారి డాక్టర్ శరత్ చంద్ర సాహు బుధవారం ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ... ప్రస్తుత ఆవర్తనం తీవ్ర తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ విపత్తు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా లేదా ఉత్తర ఒడిశా పశ్చిమ్బంగల తీరాలకు చేరువయ్యే సూచనలున్నాయన్నారు. తుపాను ఏ దిశగా ప్రయాణిస్తుందో 22న తెలుస్తుందన్నారు.
26 వరకు ప్రభావం
తుపాను ప్రభావంతో 23 నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని, 24, 25 తేదీల్లో తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. విపత్తు 26 వరకు ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు.
ఎల్లెడలా నిరుత్సాహం
ఈ ఏడాది దీపావళి వేడుకలు వర్షాల వల్ల సజావుగా సాగవని భావిస్తుండడంతో అందరూ నిరుత్సాహానికి గురవుతున్నారు. బాణసంచా వ్యాపారులు నష్టాలు తప్పవని ఆందోళనకు గురవుతున్నారు. నాలుగు రాళ్లు వెనకేసుకుంటామని ఆశలు పెంచుకున్న కుమ్మరులు ఉసూరుమంటున్నారు. మిఠాయి వ్యాపారుల్లోనూ ఆవేదన కనిపిస్తోంది. తుపాను సమాచారంతో ప్రజలు మార్కెట్లకు రావడం లేదని, విక్రయాలు పూర్తిగా పడిపోయాయని వాపోతున్నారు. మరోవైపు విపత్తుల నివారణ శాఖ ఆదేశాల మేరకు గంజాం, పూరీ, కేంద్రపడ, జగత్సింగ్పూర్, ఖుర్దా, భద్రక్, బాలేశ్వర్ జిల్లాల కలెక్టర్లు, అత్యవసర శాఖల అధికారులు 24 గంటలు విధులు నిర్వహించే కంట్రోల్ గదులు ప్రారంభించి పరిస్థితిపై నిఘా ఉంచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బిజద... రాజీనామాల బెడద
[ 24-04-2024]
గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత ఎన్నికల్లో బిజదలో అసంతృప్తి కనిపిస్తోంది. పిరాయింపుదారులకు అధినాయకత్వం టికెట్లు కేటాయించిందన్న అసహనం, అసంతృప్తి రాష్ట్రమంతటా ఉంది. సీనియర్ నాయకులు పార్టీకి రాజీనామాలు చేశారు. -
అనుభవజ్ఞులతో కొత్త అభ్యర్థుల ఢీ
[ 24-04-2024]
నవరంగపూర్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో అనుభవజ్ఞులతో కొత్త అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలో అన్ని పార్టీలు నూతన అభ్యర్థులను బరిలో నిలపడంతో పోటీ ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. -
ముమ్మరంగా నామినేషన్ల దాఖలు
[ 24-04-2024]
కల తేదీలు దగ్గర పడుతున్న వేళ వివిధ పార్టీల నేతలు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. అనుచరులు, నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీలు నిర్వహిస్తూ వెళ్లి తమ ఇష్టదైవాలకు ప్రార్థనలు చేసి తర్వాత నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
అందాల పిట్టలండీ.. సంఖ్య పెరిగేనండీ
[ 24-04-2024]
కేంద్రపడ జిల్లా బితరకనిక జాతీయ ఉద్యానవనంలో మడ అడవి పక్షుల (మేన్గ్రోవ్ పిట్ట) సంఖ్య పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే వీటి సంతతి 39 పెరగడం గమనార్హం. -
గోపాల్పూర్లో ముఖాముఖి పోరు
[ 24-04-2024]
ప్రతిష్ఠాత్మక గోపాల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజద, భాజపా అభ్యర్థుల మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా కనిపిస్తోంది. -
భాజపా గూటికి మరో ఇద్దరు అగ్రనేతలు
[ 24-04-2024]
మాజీ మంత్రి బింబాధర్ కువార్, బిజద మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి నివేదితా నాయక్ భాజపా గూటికి చేరారు. -
మిత్రమండలి కొత్త కార్యవర్గం ఎంపిక
[ 24-04-2024]
బ్రహ్మపురలోని సుమారు 80 ఏళ్ల పురాతన ‘ఆంధ్ర విజ్ఞాన మిత్ర మండలి’ కొత్త కార్యవర్గం ఎంపిక సోమవారం రాత్రి జరిగింది. -
ముగిసిన తరాతరిణి చైత్ర మంగళవారాల యాత్ర
[ 24-04-2024]
గంజాం జిల్లాలోని సుప్రసిద్ధ తరాతరిణి శక్తిపీఠంలో చైత్ర మంగళవారాల యాత్ర ముగిసింది. అయిదో మంగళవారం సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కనిపించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి