Chandra grahan 2022: ఉద్రిక్తతలకు దారి తీసిన ‘గ్రహణ భోజనం’
చంద్ర గ్రహణంపై ప్రజల్లో ఉన్న అపోహలు, భయాల్ని తొలగించే పేరుతో ‘మానవతావాది హేతువాది సంస్థ’ (హెచ్ఆర్ఓ) గంజాం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన గ్రహణ సమయంలో భోజనం చేసే ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
బ్రహ్మపురలో పేడతో దాడి.. లాఠీలు ఝుళిపించిన పోలీసులు
రామలింగం ట్యాంకు రోడ్డులో ప్రదర్శన జరుపుతున్న బ్రాహ్మణ పురోహిత సమితి ప్రతినిధులు
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: చంద్ర గ్రహణంపై ప్రజల్లో ఉన్న అపోహలు, భయాల్ని తొలగించే పేరుతో ‘మానవతావాది హేతువాది సంస్థ’ (హెచ్ఆర్ఓ) ఒడిశాలోని గంజాం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన గ్రహణ సమయంలో భోజనం చేసే ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీన్ని వ్యతిరేకిస్తూ కొన్ని సంస్థలు ఆందోళనకు దిగడంతోపాటు హెచ్ఆర్ఓ ప్రతినిధులపై దాడులకు పాల్పడ్డాయి. దీంతో పోలీసులు లాఠీలు ఝుళిపించి ఆందోళన చేస్తున్నవారిని చెదరగొట్టారు. మధ్యాహ్నం స్థానిక సిటీ హైస్కూలు రోడ్డులో రెండు గంటలకుపైగా అశాంతి వాతావరణం నెలకొంది.
ఇవీ వివరాలు.. చంద్ర గ్రహణం నేపథ్యంలో హెచ్ఆర్ఓ గంజాం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మధ్యాహ్నం సిటీ హైస్కూలు రోడ్డులోని చారవాక్ భవన్ వద్ద ప్రజా చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రజలతో సామూహిక భోజనాలకు ఏర్పాట్లు చేసింది. ప్రఫుల్ల సామంత్రాయ్, ఈ.టి.రావు. కె.నందేశు సేనాపతి, బాలచంద్ర షడంగి, జమ్ముల సురేష్, అబనీ గయా, కిశోర్ మిశ్ర, మధుసూదన్ సెఠి, బృందావన ఖొటెయి, శంకర సాహు, ప్రతాప్ ప్రధాన్, పార్వతి తదితరులు పాల్గొన్నారు.
హెచ్ఆర్ఓ ప్రతినిధులపై దూసుకు వస్తున్న వారిని అడ్డుకుంటున్న పోలీసులు
రెండువైపులా దూసుకువచ్చి..
హెచ్ఆర్ఓ చేపట్టిన కార్యక్రమాన్ని గంజాం జిల్లా బ్రాహ్మణ పురోహిత సమితి, భజరంగదళ్, విశ్వహిందూ పరిషత్ తదితర సంస్థలు వ్యతిరేకించాయి. ఒక సంస్థ ఆధ్వర్యంలో రామలింగం ట్యాంకు రోడ్డులోని ఎత్తయిన హనుమాన్ విగ్రహం వద్ద ప్రదర్శన జరపగా, మరికొందరు చారవాక్ భవన్ సమీపాన రహదారిపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఆయా సంస్థల ప్రతినిధులు రెండువైపుల నుంచి చారవాక్ భవన్ వద్దకు ఒక్కసారిగా కర్రలతో చేరుకుని వాగ్వాదానికి దిగారు. భవన్ ముందు వెదురుతో వేసిన గుడ్డ పెండాల్ను తొలగించి తోపులాటకు దిగారు. కొందరు హెచ్ఆర్ఓ ప్రతినిధులపై పేడతో దాడి చేశారు. దీంతో పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు లాఠీలు ఝుళిపించి వారిని చెదరగొట్టారు. అయినప్పటికీ మళ్లీ ఆయా సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో చారవాక్ భవన్ వద్దకు చేరుకుని వ్యతిరేక నినాదాలు చేశారు. చివరకు పోలీసులు హెచ్ఆర్ఓ ప్రతినిధులకు నచ్చజెప్పి, వారిని భద్రత మధ్య అక్కడి నుంచి పోలీసు వాహనాల్లో తరలించడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. గ్రహణ భోజనాన్ని బలవంతంగా అడ్డుకోవడం, దాడి దారుణమని హెచ్ఆర్ఓ ప్రతినిధులు విలేకరుల వద్ద పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా చారవాక్ భవన్ వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ అసీమ్ పండా, బ్రహ్మపుర ఎస్డీపీఓ రాజీవ్ లోచన్ పండా, పెద్దబజారు, టౌన్ ఠాణాల ఐఐసీలు ప్రశాంత భూపతి, సురేష్ త్రిపాఠి ఇతర అధికారులు శాంతిభద్రతల్ని పర్యవేక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బిజద... రాజీనామాల బెడద
[ 24-04-2024]
గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత ఎన్నికల్లో బిజదలో అసంతృప్తి కనిపిస్తోంది. పిరాయింపుదారులకు అధినాయకత్వం టికెట్లు కేటాయించిందన్న అసహనం, అసంతృప్తి రాష్ట్రమంతటా ఉంది. సీనియర్ నాయకులు పార్టీకి రాజీనామాలు చేశారు. -
అనుభవజ్ఞులతో కొత్త అభ్యర్థుల ఢీ
[ 24-04-2024]
నవరంగపూర్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో అనుభవజ్ఞులతో కొత్త అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలో అన్ని పార్టీలు నూతన అభ్యర్థులను బరిలో నిలపడంతో పోటీ ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. -
ముమ్మరంగా నామినేషన్ల దాఖలు
[ 24-04-2024]
కల తేదీలు దగ్గర పడుతున్న వేళ వివిధ పార్టీల నేతలు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. అనుచరులు, నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీలు నిర్వహిస్తూ వెళ్లి తమ ఇష్టదైవాలకు ప్రార్థనలు చేసి తర్వాత నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
అందాల పిట్టలండీ.. సంఖ్య పెరిగేనండీ
[ 24-04-2024]
కేంద్రపడ జిల్లా బితరకనిక జాతీయ ఉద్యానవనంలో మడ అడవి పక్షుల (మేన్గ్రోవ్ పిట్ట) సంఖ్య పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే వీటి సంతతి 39 పెరగడం గమనార్హం. -
గోపాల్పూర్లో ముఖాముఖి పోరు
[ 24-04-2024]
ప్రతిష్ఠాత్మక గోపాల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజద, భాజపా అభ్యర్థుల మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా కనిపిస్తోంది. -
భాజపా గూటికి మరో ఇద్దరు అగ్రనేతలు
[ 24-04-2024]
మాజీ మంత్రి బింబాధర్ కువార్, బిజద మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి నివేదితా నాయక్ భాజపా గూటికి చేరారు. -
మిత్రమండలి కొత్త కార్యవర్గం ఎంపిక
[ 24-04-2024]
బ్రహ్మపురలోని సుమారు 80 ఏళ్ల పురాతన ‘ఆంధ్ర విజ్ఞాన మిత్ర మండలి’ కొత్త కార్యవర్గం ఎంపిక సోమవారం రాత్రి జరిగింది. -
ముగిసిన తరాతరిణి చైత్ర మంగళవారాల యాత్ర
[ 24-04-2024]
గంజాం జిల్లాలోని సుప్రసిద్ధ తరాతరిణి శక్తిపీఠంలో చైత్ర మంగళవారాల యాత్ర ముగిసింది. అయిదో మంగళవారం సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కనిపించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్