ప్రజారోగ్యం, విద్య, తాగునీటికి ప్రాధాన్యం
శాసనసభలో గురువారం రాత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రదీప్ అమత్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.16,800 కోట్ల వ్యయంతో కూడిన అదనపు బడ్జెట్ ప్రవేశపెట్టారు.
శాసనసభలో 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్
సభలో బడ్జెట్ పద్దులు వివరిస్తున్న మంత్రి అమత్
భువనేశ్వర్, న్యూస్టుడే: శాసనసభలో గురువారం రాత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రదీప్ అమత్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.16,800 కోట్ల వ్యయంతో కూడిన అదనపు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రణాళికకు రూ.9,200 కోట్లు, యంత్రాంగం వ్యయం కింద రూ.4,934 కోట్లు, విపత్తుల నివారణకు రూ.2,610.46 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇతర నిధుల వ్యయంపై వివరాలు వెల్లడించలేదు. అదనపు బడ్జెట్లో ఆరోగ్యం, పంచాయతీరాజ్, క్రీడలు, మిషన్ శక్తి, పరిశ్రమలు, విద్య, గ్రామీణ రహదారులు, మంచినీటి సరఫరాకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వం అదనపు బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు చెప్పారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం బాగుందన్న మంత్రి వివరాలు వెల్లడించలేదు.
అసెంబ్లీ వెలుపల డీజీపీ సునీల్ బన్సల్, జంట నగరాల కమిషనర్
సౌమ్యేంద్ర ప్రియదర్శి, ఇతర ఉన్నతాధికారుల పర్యవేక్షణ
విపక్షాల ఆగ్రహం
ఆర్థిక, సభా వ్యవహారాల మంత్రి నిరంజన్ పూజారి సభకు రాకపోవడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పద్మపూర్ ఉప ఎన్నిక ప్రచారానికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పలువురు మంత్రులు, 50 శాతం ఎమ్మెల్యేలను తరలించడం భావ్యమేనా? అని కాంగ్రెస్ సభాపక్షం నేత నర్సింగ మిశ్ర, భాజపా సభాపక్షం కార్యదర్శి మోహన్ మాఝిలు నిలదీశారు. ప్రజల కోసం నిర్వహిస్తున్న సభా కార్యక్రమాల్లో మంత్రులు, సభ్యుల గైర్హాజరుపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. అనారోగ్యం సాకుతో మరికొందరు బిజద మంత్రులు, సభ్యులు ముఖాలు చాటేశారని దుయ్యబట్టారు. గణతంత్రాన్ని అధికారపక్షం నేతలు ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు.
సీఎం ఆదేశించారు
బిజద అధికార ప్రతినిధి రాజకిశోర్దాస్ సమాధానమిస్తూ కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు పద్మపూర్ ప్రచారంలో ఉన్నది వాస్తవమేనన్నారు. వారంతా సభా కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం నవీన్ గురువారం సాయంత్రం ఆదేశించినట్లు చెప్పారు.
నవీన్ రావాలి
సభ వెలుపల విపక్ష నేతలు విలేకరులతో మాట్లాడుతూ ఉదయం మొక్కుబడిగా సభకు వచ్చిన సీఎం నవీన్ సాయంత్రం ముఖం చాటేశారని, ఇది సబబు కాదని, సభా కార్యక్రమాలు ముగిసే వరకూ ఆయన సభకు హాజరవ్వాలని కోరుతున్నామన్నారు.
బ్లాక్మెయిలర్ వలలో పాలకపక్షం పెద్దలు
నర్సింగ మిశ్ర, మోహన్ మాఝిలు బ్లాక్మెయిలర్ అర్చన నాగ్ వ్యవహారాన్ని లేవనెత్తారు. ఎంతోమంది అధికార పెద్దలు ఈ యువతి ఉచ్చులో పడ్డారని, ఈడీ దర్యాప్తు ప్రారంభమైన నేపథ్యంలో హోం శాఖ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న నవీన్ రాజీనామా చేయాలని డిమాండు చేశారు. పోడియం వద్ద భాజపా, కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆందోళన చేశారు. ఈ వ్యవహారంపై సభాపతి బిక్రం కేసరి అరుఖ్ రూలింగ్ ఇవ్వాలని డిమాండు చేశారు. దీంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో కార్యక్రమాలను శుక్రవారం ఉదయం వరకూ వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు.
బందోబస్తు
శాసనసభ సమావేశాల నేపథ్యంలో సభ వెలుపల, లోపల పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. డీజీపీ సునీల్ బన్సల్, భువనేశ్వర్-కటక్ జంట నగరాల కమిషనర్ సౌమ్యేంద్ర ప్రియదర్శి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సభ వెలుపల పరిస్థితిని సమీక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మావో డంప్ స్వాధినం
[ 19-04-2024]
మల్కానిగిరి జిల్లా కలిమెల ఠాణా పరిధిలో వున్న సానో టేకుడ, బెజంగి వాడ గ్రామం మధ్యలో వున్న అడవిలో బి.ఎస్.ఎఫ్. జవాన్లు మావో డంప్ స్వాధినం చెసుకున్నారు. -
వారసులొచ్చారు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొంతమంది ప్రముఖ నాయకులు పోటీ నుంచి తప్పుకున్నారు. వారి భార్యలు, వారసులను బరిలోకి దించారు. బిజద, భాజపా, కాంగ్రెస్ పార్టీల నాయకత్వాలు వారికి అవకాశం కల్పించాయి. తండ్రులు, తల్లులు వారి తరుఫున ప్రచారం చేస్తున్నారు. -
కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘హెర్’ టీం
[ 19-04-2024]
మహిళల్ని వేధించే వారి భరతం పట్టడానికి జంటనగరాల (భువనేశ్వర్, కటక్) కమిషనరేట్ యంత్రాంగం ‘హై ఎఫిషియన్సీ రెస్పాన్స్ (హెరా) టీం ఏర్పాటు చేసింది. -
సత్వర విద్యుత్తు సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు
[ 19-04-2024]
వేసవిలో ప్రజలకు మరింత మెరుగైన విద్యుత్తు సేవలు అందించేందుకు, సరఫరాలో అంతరాయం ఏర్పడితే సత్వర సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు సిద్ధం చేశామని విద్యుత్తు సరఫరా సంస్థ ‘టాటా పవర్ సదరన్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్’ (టీపీఎస్ఓడీఎల్) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది -
జగన్నాథునికి రూ.2.51 కోట్ల విరాళం
[ 19-04-2024]
రిలయన్స్ గ్రూపు సంస్థల అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ బుధవారం పూరీ శ్రీక్షేత్రానికి వచ్చారు. జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
సచిదాస్ కన్నుమూత
[ 19-04-2024]
జత్రా పార్టీ (నాటకాలు) దర్శకునిగా, నటునిగా ఖ్యాతి గాంచిన సచిదాస్ (91) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అస్వస్థతతో కటక్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. -
ఎవరి ప్రయోజనాల కోసం రెండుచోట్ల పోటీ?
[ 19-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మళ్లీ రెండుచోట్ల పోటీకి సిద్ధమయ్యారు. దీనివల్ల ప్రజలకు ఒరిగేదేమిటని? ఈ పోటీ ఎవరి ప్రయోజనాల కోసమని? సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో ఉప ఎన్నిక, వ్యయప్రయాసలు మినహా సాధించేదేమిటని విమర్శలు వినిపిస్తున్నాయి. -
నేటి నుంచి మజ్జిగౌరీ చైత్రోత్సవాలు
[ 19-04-2024]
రాయగడ ఉత్కళాంధ్రుల ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవ సంబరాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
‘శ్రేష్ఠ భారత్’ ఏర్పాటుకు అంతా సహకరించాలి
[ 19-04-2024]
‘శ్రేష్ఠ భారత్’ లక్ష్యంగా దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలు, అన్ని రంగాల సమగ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ 2024 సంకల్ప పత్రం జారీ చేశారని, ప్రజలంతా సహకరించి, మరోసారి మోదీని ప్రధాని చేసేందుకు ముందుకు రావాలని బ్రహ్మపుర లోక్సభ భాజపా అభ్యర్థి ప్రదీప్ కుమార్ పాణిగ్రహి కోరారు -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 19-04-2024]
గంజాం జిల్లా గొళంత్రా ఠాణా పరిధిలోని కొణిసి-తుళు మార్గంలో బుధవారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు యువకులు ఎమ్కేసీజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు