విజిలెన్స్ వలలో రెవెన్యూ అధికారి
కొరాపుట్ జిల్లా సుక్కు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న అదనవు రెవెన్యూ అధికారి (ఏఆర్ఐ) అమిత్కుమార్ బెహరా శనివారం జయపురం విజిలెన్సు అధికారుల వలకు చిక్కారు.
అమిత్కుమార్ బెహరా
సిమిలిగుడ, కొరాపుట్, న్యూస్టుడే: కొరాపుట్ జిల్లా సుక్కు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న అదనవు రెవెన్యూ అధికారి (ఏఆర్ఐ) అమిత్కుమార్ బెహరా శనివారం జయపురం విజిలెన్సు అధికారుల వలకు చిక్కారు. విజిలెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సుక్కు పంచాయతీకి చెందిన నంద ఖొరా భూమి పట్టాలో పేరు మార్చాలని దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఏఆర్ఐ రూ.20 వేల లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు రూ.10 వేలు ఇచ్చినా మిగిలిన డబ్బు కోసం హింసిస్తుండటంతో విజిలెన్స్ అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పథకం ప్రకారం డబ్బులు ఇస్తానని, జయపురం బస్టాండ్ వద్దకు రావాలని నంద ఏఆర్ఐకి తెలిపారు. కారులో స్నేహితులతో కలసి అక్కడకు వచ్చిన బెహరాకు అధికారులు ఇచ్చిన రూ.6 వేలను బాధితుడు అందజేస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. అధికారులను చూసిన అమిత్ ఆ డబ్బును పక్కనే ఉన్న స్నేహితుడికి ఇచ్చేయగా గమనించిన అధికారులు నగదును స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న అందరినీ అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఏఆర్ఐని అరెస్ట్ చేసి, కోర్టుకు తరలించారు. కొరాపుట్ కొలాబ్ నగర్లోని అమిత్కుమార్ నివాసం, సుక్కు తహసీల్దార్ కార్యాలయం, ఇతర ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 25-04-2024]
ఒడిశాలో కోరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. -
అభివృద్ధి కొనసాగుతుంది..శంక ద్వయాన్ని ఆశీర్వదించండి
[ 25-04-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, బిజదను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజల్ని కోరారు. -
భాజపాకు 40 మంది స్టార్ ప్రచారకులు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపా స్టార్ ప్రచారకుల జాబితా మంగళవారం రాత్రి విడుదల చేశారు. -
ఇంకెన్నాళ్లీ దుస్థితి?
[ 25-04-2024]
అధ్వానంరాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయన్న నివేదికలు దిగజారిన ‘నాక్’ గ్రేడేషన్లు దుస్థితిని తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి నిలదీశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో భర్తీకాని టీచింగ్ సిబ్బంది, అసౌకర్యాలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ల గురించి ఏం సమాధానం చెబుతారన్నారు. -
ఓ తండ్రి...ఇద్దరు కొడుకులు
[ 25-04-2024]
గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నామినేషన్ల సందడి
[ 25-04-2024]
బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్ పత్రాన్ని సబ్ కలెక్టర్ అనూప్ పండాకు అందజేశారు. -
భాజపాలో సీమారాణి చేరిక
[ 25-04-2024]
బిజదకు రాజీనామా చేసిన హిందళ్ సిటింగ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్ బుధవారం భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర నాయకులు ఆమెను స్వాగతించారు. -
నేడు అమిత్షా రాక
[ 25-04-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం సోన్పూర్లో ఏర్పాటయ్యే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
నా ఓటు.. నా బాధ్యత
[ 25-04-2024]
నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమనాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM