ప్రభుత్వానిది మొసలి కన్నీరు
అన్నదాతలకు అన్యాయం చేస్తున్న బిజద పెద్దలు కేంద్రంపై విమర్శలు చేస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారని, 23 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రశ్నించారు.
పద్మపూర్ ప్రచారంలో.. కేంద్రమంత్రులు నరేంద్ర తోమర్, అశ్వినీ వైష్ణవ్ విమర్శలు
వేదికపై కేంద్రమంత్రులు నరేంద్ర, అశ్వినీ, ఎంపీలు, ప్రదీప్ పురోహిత్, ఇతర నాయకులు
భువనేశ్వర్, న్యూస్టుడే: అన్నదాతలకు అన్యాయం చేస్తున్న బిజద పెద్దలు కేంద్రంపై విమర్శలు చేస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారని, 23 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రశ్నించారు. ఆదివారం పద్మపూర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పైకమాల్లో ఏర్పాటైన బహిరంగ సభలో తోమార్, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోమర్ మాట్లాడుతూ... గతేడాది విపత్తుల మూలంగా నష్టాలు చవిచూసిన రైతులకు కేంద్రం పీఎం ఫసల్ బీమా సొమ్ము అందజేసిందని ప్రభుత్వం అర్హులకు ఆ మొత్తాన్ని అందజేయకుండా పక్కతోవ పట్టించారని దుయ్యబట్టారు. పశ్చిమ ఒడిశా అన్నదాతలను ఉపేక్షించిన నవీన్ సర్కార్ పద్మపూర్ ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి రాయితీ(ఇన్పుట్ సబ్సీడీ) పేరిట రూ.200 కోట్లు ప్రకటించినా ఇంతవరకు ఎవరికీ సాయం అందలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ పాలన ఉండుంటే ఒడిశాకు ఈ దుస్థితి ఉండేది కాదన్నారు. పద్మపూర్లో భాజపా అభ్యర్థి ప్రదీప్ పురోహిత్ను గెలిపించాలని, 2024 సాధారణ ఎన్నికల్లో భాజపాకు పాలించే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
స్థలం కేటాయించకుండా పనులెలా సాధ్యం
రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి స్థలం కేటాయింపు, అటవీశాఖ అనుమతులు అడ్డంకిగా మారాయని మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వల్ల ప్రాజెక్టుల్లో జాప్యం జరుగుతోందన్నారు. స్థలం లేకుండా పనులు ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నించారు. జగన్నాథుడి నిలయమైన ఈ నేలపై ప్రధాని మోదీకి ప్రత్యేక అభిమానం ఉందని, ఆయన ఒడిశాకు ప్రాధాన్యమిస్తున్నారన్నారు. పశ్చిమ ఒడిశాలోని 13 రైల్వే స్టేషన్లకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించాలన్న ధ్యేయంతో పనులు ప్రారంభించామన్నారు. ‘పద్మపూర్, బరగఢ్లో రైల్వే లైను నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు(ఆదివారం) స్థలం కేటాయిస్తే రేపు(సోమవారం) పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ఉటంకించారు. ఈ సభలో బరగఢ్ ఎంపీ సురేశ్ పూజారి, బొలంగీర్ ఎంపీ సంగీతా కుమారీ సింగ్ దేవ్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజన సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం: సరక
పద్మపూర్ ఎన్నికల ప్రచార సభలో మంత్రి సరక, ఇతర బిజద నేతలు
భువనేశ్వర్, న్యూస్టుడే: గిరిజన సంక్షేమం ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదివాసీల సామాజిక, ఆర్థిక వికాసానికి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి జగన్నాథ సరక చెప్పారు. ఆదివారం పద్మపూర్లో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి బిజద అభ్యర్థి బర్షారాణి సింగ్ బరిహను గెలిపించాలని ఓటర్లను కోరారు. పద్మపూర్ ఎన్ఏసీలో ఏర్పాటైన సభలో సరక మాట్లాడుతూ... పద్మపూర్లో 80వేల మంది ఆదివాసీలున్నారని, వారి ప్రయోజనాలకు బర్షా కట్టుబడతారని చెప్పారు. ఈ ప్రాంతాభివృద్ధికి సీఎం ఎంతో చేయాలన్న ధ్యేయంతో ఉన్నందున బర్షాను గెలిపించాలని కోరారు. సభలో పద్మపూర్ ప్రాంత బిజద నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?
[ 26-04-2024]
రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. -
కేకేలైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-04-2024]
కొరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. -
జగన్నాథునికి సైనా పూజలు
[ 26-04-2024]
అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
[ 26-04-2024]
ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. -
నవీన్ ప్రభుత్వాన్ని గద్దె దించండి
[ 26-04-2024]
సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. -
పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స
[ 26-04-2024]
బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. -
కాంగ్రెస్లో రాజీనామాలు
[ 26-04-2024]
గుణుపురం విధానసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్కు సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు నాయకులు ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిజయకుమార్ గమాంగ్ తెలిపారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం...
[ 26-04-2024]
గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్ మండల్
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని