రేపటి నుంచి మేకిన్ ఒడిశా సదస్సు
పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలన్న తలంపుతో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం భువనేశ్వర్ జనతా మైదానం వేదికగా బుధవారం నుంచి 5 రోజులపాటు మేకిన్ ఒడిశా సదస్సు నిర్వహిస్తోంది.
భువనేశ్వర్, న్యూస్టుడే: పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలన్న తలంపుతో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం భువనేశ్వర్ జనతా మైదానం వేదికగా బుధవారం నుంచి 5 రోజులపాటు మేకిన్ ఒడిశా సదస్సు నిర్వహిస్తోంది. గతంలో 2017, 2018లలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు కాగా, ఇది మూడోసారి. పరిశ్రమలశాఖ ఈ సదస్సు నిర్వహణకు మూడు నెలలుగా ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ మహాపాత్ర్, ఇతర అధికారులు సోమవారం మైదానాన్ని పరిశీలించారు.
అందరికీ ఆహ్వానాలు
ముఖ్యమంత్రి నవీన్ ఇటీవల దుబాయ్, దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాదు నగరాల్లో పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి చర్చలు జరిపి మేకిన్ ఒడిశా సదస్సులో పాల్గొనాలని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. భువనేశ్వర్కు దేశ, విదేశాలకు చెందిన 200 మందికిపైగా పారిశ్రామికవేత్తలు, సీఈవోలు వస్తారని అంచనా.
మూడు రోజులు కీలకం
బుధవారం సాయంత్రం 6.30 గంటలకు ముఖ్యమంత్రి మేకిన్ ఒడిశా సదస్సు ప్రారంభిస్తారు. కార్యక్రమంలో పరిశ్రమలు, విద్యుత్తు, ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి ప్రతాప్దేవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ మహాపాత్ర్, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి హేమంతశర్మ, 5-టీ కార్యదర్శి వి.కార్తికేయ పాండ్యన్ తదితర అధికారులు పాల్గొంటారు. గురువారం నుంచి శనివారం వరకు వేదికపై పరిశ్రమలకు సంబంధించి ప్లీనరీ సమావేశాలు నిర్వహించి చర్చిస్తారు. ఈ మూడు రోజులు కీలకం. చివరి రోజు ఆదివారం సాధారణ ప్రజలంతా తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మేకిన్ ఒడిశా సదస్సులో భాగంగా జనతా మైదానంలో పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ శాఖల యంత్రాంగాలు రాష్ట్రంలోని ఖనిజ సంపద, అటవీ, సాగర ఉత్పత్తులు, పర్యటక రంగం, ఐటీ శాఖలకు సంబంధించి ప్రదర్శనా స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. దృశ్యమాధ్యమాల ద్వారా ఇవి తిలకించేలా సన్నాహాలు చేశారు.
ఎంఓయూలకు అవకాశం
డిసెంబరు 1 నుంచి 3 వరకు పరిశ్రమలు, విద్యుత్తు, గనులు, ఐటీ, పర్యటకం, రాకపోకలు, రసాయనాలు, జౌళి, వ్యవసాయం ఉపకరణాలు, ఆహోరోత్పత్తులు, సౌరశక్తి, పెట్రోలియం, వైద్య ఉపకరణాలు, బయోటెక్నాలజీ, ఫిల్మ్ అండ్ ఎంటర్టైన్మెంట్, రియల్ ఎస్టేట్, ప్లాస్టిక్ తదితరాలపై పారిశ్రామికవేత్తలతో చర్చిస్తారు. సింగిల్విండో కింద రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి ఒకేచోట అనుమతులు ఇస్తారు. ఈ నేపథ్యంలో సదస్సులో కీలక ఒప్పందాలకు అవకాశం ఉంది.
పరిశ్రమలశాఖ మంత్రి ప్రతాప్ సోమవారం భువనేశ్వర్లో విలేకరులతో మాట్లాడుతూ... ప్రభుత్వం మేకిన్ ఒడిశా సదస్సును ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, నిర్మాణాత్మక చర్చలు జరుగుతాయని చెప్పారు. రూ.6 లక్షల కోట్లు పెట్టుబడులొస్తాయన్న ఆశాభావంతో ఉన్నామన్నారు. ఖనిజ సంపద, తీర సంపద, అటవీ ఉత్పత్తులు, ఓడరేవులు, ఎయిర్, రోడ్ అనుసంధానం తదితర సౌకర్యాలు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నందున మంచి ఫలితాలు తథ్యమన్న నమ్మకం ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 25-04-2024]
ఒడిశాలో కోరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. -
అభివృద్ధి కొనసాగుతుంది..శంక ద్వయాన్ని ఆశీర్వదించండి
[ 25-04-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, బిజదను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజల్ని కోరారు. -
భాజపాకు 40 మంది స్టార్ ప్రచారకులు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపా స్టార్ ప్రచారకుల జాబితా మంగళవారం రాత్రి విడుదల చేశారు. -
ఇంకెన్నాళ్లీ దుస్థితి?
[ 25-04-2024]
అధ్వానంరాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయన్న నివేదికలు దిగజారిన ‘నాక్’ గ్రేడేషన్లు దుస్థితిని తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి నిలదీశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో భర్తీకాని టీచింగ్ సిబ్బంది, అసౌకర్యాలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ల గురించి ఏం సమాధానం చెబుతారన్నారు. -
ఓ తండ్రి...ఇద్దరు కొడుకులు
[ 25-04-2024]
గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నామినేషన్ల సందడి
[ 25-04-2024]
బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్ పత్రాన్ని సబ్ కలెక్టర్ అనూప్ పండాకు అందజేశారు. -
భాజపాలో సీమారాణి చేరిక
[ 25-04-2024]
బిజదకు రాజీనామా చేసిన హిందళ్ సిటింగ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్ బుధవారం భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర నాయకులు ఆమెను స్వాగతించారు. -
నేడు అమిత్షా రాక
[ 25-04-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం సోన్పూర్లో ఏర్పాటయ్యే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
నా ఓటు.. నా బాధ్యత
[ 25-04-2024]
నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ