logo

దుకాణంలో దంపతులను కాల్చి చంపిన దుండగులు.

కేంజర్‌ జిల్లా బలని పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లకార్డాలో జంట హత్యలు జరిగాయి. సోమవారం రాత్రి దంపతులను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు.

Published : 29 Nov 2022 12:40 IST

కటక్: ఒడిశాలోని కేంజర్‌ జిల్లా బలని పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లకార్డాలో జంట హత్యలు జరిగాయి. సోమవారం రాత్రి దంపతులను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. లక్ష్మీధర ఆపాట (40)అనే వ్యక్తికి గ్రామంలో కిరాణా షాపు ఉంది. సోమవారం రాత్రి కొంతమంది దుండగులు సామగ్రి కొనుగోలు కోసం వచ్చి ఆయనతో గొడవపడ్డారు. దీంతో దుండగులు ఆగ్రహంతో షాపులో ఉన్న లక్ష్మీధర్, అతని భార్య మంజులత (35)లపై కాల్పులు జరిపి పరారయ్యారు. 

కాల్పులు శబ్దం విని గ్రామస్తులు షాపు వద్దకు చేరుకుని చూడగా దంపతులు ఇద్దరూ గాయాలతో ఉన్నారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై సమాచారం అందుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. లక్ష్మీ ధరకు గుండెలో.. మంజులత పొట్టలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతి చెందిన దంపతులకు పదేళ్ల కుమారుడు ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని