23 ఏళ్లలో రాష్ట్రానికి ఏం చేశారు?
ఎంతో చేశాం, ఇంకా చేస్తామని గొప్పలు చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన 23 ఏళ్ల పాలనాకాలంలో రైతులకు, నిరుద్యోగ యువతకు న్యాయం చేయగలిగారా?
నవీన్ పాలనపై ధర్మేంద్ర విమర్శనాస్త్రాలు
అభివాదం చేస్తున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర, ఎంపీలు సురేష్, బసంత పండా, ప్రదీప్ పురోహిత్, సమీర్
భువనేశ్వర్, న్యూస్టుడే: ఎంతో చేశాం, ఇంకా చేస్తామని గొప్పలు చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన 23 ఏళ్ల పాలనాకాలంలో రైతులకు, నిరుద్యోగ యువతకు న్యాయం చేయగలిగారా? అంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశ్నించారు. పద్మపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో మంగళవారం మూడు రోజుల ప్రచారానికి వచ్చిన కేంద్రమంత్రి నవీన్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. మిషన్శక్తి కార్యక్రమం ద్వారా మహిళల్ని అన్నిరంగాల్లో అభివృద్ధిలోకి తీసుకొచ్చామని చెప్పుకొంటున్న సీఎం మహిళలపై జరుగుతున్న అత్యాచార సంఘటనలపై ఏం సమాధానం చెప్తారని, హోంశాఖ పర్యవేక్షిస్తున్న ఆయన బాధ్యత వహించాలని పద్మపూర్ బహిరంగ సభలో పేర్కొన్నారు. 2019లో రాష్ట్రంలో మహిళలపై 2,950 అత్యాచార ఘటనలు జరగ్గా, 2020లో 2,984, 2021లో 3,327 సంఘటనలు జరిగాయని కేంద్ర మంత్రి ఆధారాలు చూపించారు. అన్నదాతల సంక్షేమానికి ప్రధాని నరేంద్రమోదీ అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రంలో సద్వినియోగం కావడం లేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమార్ ఆరోపించారు. ఖనిజ సంపద పుష్కలంగా ఉన్న పశ్చిమ ఒడిశా యువకులు ఉపాధి లేక వలస బాట పడుతుండడం వాస్తవం కాదా? అంటూ ప్రశ్నించారు. పశ్చిమ ఒడిశా వికాస్ పరిషత్ (డబ్ల్యూఓడీసీ) కార్యాలయాన్ని భువనేశ్వర్లో కొనసాగించడంలో ఉద్దేశం ఏమిటని నిలదీశారు. సిరిసంపదలకు నిలయమైన ఒడిశా రూ.లక్ష కోట్ల అప్పులు చేయడం, ప్రజలపై తలసరి రూ.25 వేల రుణ భారంపై ముఖ్యమంత్రి ఏం సమాధానమిస్తారని నిలదీశారు. ఉప ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల ప్రజలు, రైతులకు తాను స్వయంగా న్యాయం చేస్తానంటున్న నవీన్ బిజేపూర్, బాలేశ్వర్, పిపిలి, ధామ్నగర్లకు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజలను ఎంతకాలం మభ్యపెట్టి మాయచేయగలరని ప్రశ్నించిన కేంద్ర మంత్రులు బిజద పాలనకు కాలం చెల్లిందని, పద్మపూర్ ఓటర్లు స్థానిక రైతు నేత ప్రదీప్ పురోహిత్ను గెలిపించాలని కోరారు. బహిరంగసభలో భాజపా ఎంపీలు బసంత పండా, సురేష్ పుజారి, శాసనసభలో విపక్ష నేత జయనారాయణ మిశ్ర, భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షుడు సమీర్ మహంతి తదితర నాయకులు పాల్గొన్నారు.
బహిరంగ సభకు హాజరైన ప్రజలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధి కొనసాగుతుంది..శంక ద్వయాన్ని ఆశీర్వదించండి
[ 25-04-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, బిజదను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజల్ని కోరారు. -
భాజపాకు 40 మంది స్టార్ ప్రచారకులు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపా స్టార్ ప్రచారకుల జాబితా మంగళవారం రాత్రి విడుదల చేశారు. -
ఇంకెన్నాళ్లీ దుస్థితి?
[ 25-04-2024]
అధ్వానంరాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయన్న నివేదికలు దిగజారిన ‘నాక్’ గ్రేడేషన్లు దుస్థితిని తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి నిలదీశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో భర్తీకాని టీచింగ్ సిబ్బంది, అసౌకర్యాలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ల గురించి ఏం సమాధానం చెబుతారన్నారు. -
ఓ తండ్రి...ఇద్దరు కొడుకులు
[ 25-04-2024]
గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నామినేషన్ల సందడి
[ 25-04-2024]
బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్ పత్రాన్ని సబ్ కలెక్టర్ అనూప్ పండాకు అందజేశారు. -
భాజపాలో సీమారాణి చేరిక
[ 25-04-2024]
బిజదకు రాజీనామా చేసిన హిందళ్ సిటింగ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్ బుధవారం భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర నాయకులు ఆమెను స్వాగతించారు. -
నేడు అమిత్షా రాక
[ 25-04-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం సోన్పూర్లో ఏర్పాటయ్యే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
నా ఓటు.. నా బాధ్యత
[ 25-04-2024]
నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు