logo

‘పద్మపూర్‌లో పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు’

పద్మపూర్‌లో కొనసాగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై పోలీసులు పక్షపాతం చూపుతున్నారని పర్లాఖెముండి శాసనసభ్యుడు కె.నారాయణరావు ఆరోపించారు.

Published : 30 Nov 2022 02:08 IST

డీజీపీ సునీల్‌కు ఫిర్యాదు పత్రం అందిస్తున్న భాజపా ఎమ్మెల్యేలు

కటక్‌, న్యూస్‌టుడే: పద్మపూర్‌లో కొనసాగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై పోలీసులు పక్షపాతం చూపుతున్నారని పర్లాఖెముండి శాసనసభ్యుడు కె.నారాయణరావు ఆరోపించారు. ఈమేరకు పార్టీ శాసనసభ్యులంతా డీజీపీ సునీల్‌ బన్సల్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలు భాస్కర్‌ ఘడేయి, గణేష్‌ మాఝి, సనాతన బిజులీతోపాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నయన్‌ కిషోర్‌ మహంతి, బృగుబక్షి పాత్ర్‌ తదితరులు డీజీపీని కలిశారు. పోలీసులు అధికార పార్టీకి వంత పాడుతున్నారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని