కొవిడ్తో 20 వేల మంది మృతి
శాసనసభ గురువారం ప్రశాంతంగా కొనసాగింది. సభాపతి బిక్రంకేసరి అరుఖ్ తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టారు.
రెవెన్యూ, విపత్తుల నివారణ మంత్రి ప్రమీలా మల్లిక్
కొనసాగుతున్న సభ
భువనేశ్వర్, న్యూస్టుడే: శాసనసభ గురువారం ప్రశాంతంగా కొనసాగింది. సభాపతి బిక్రంకేసరి అరుఖ్ తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభ్యులడిగిన ప్రశ్నలకు రెవెన్యూ, విపత్తుల నివారణ మంత్రి ప్రమీలా మల్లిక్, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి తుషారకాంతి బెహర, జలవనరులు, వాణిజ్య, రవాణాశాఖల మంత్రి టుకుని సాహు సమాధానాలిచ్చారు.
కొరాపుట్ ఇబ్బందులు ప్రస్తావించిన తారా
జయపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహినీపతి కొరాపుట్ జిల్లాలో కొండకోనల్లో ఉన్న గ్రామాల (పొడాలు)కు రెవెన్యూ హోదా లేకపోవడంతో మొబైల్, ఇతర సేవలు అందడం లేదన్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల బినామీ స్థలాలు, మ్యుటేషన్ ఇబ్బందులు ప్రస్తావించారు. దీనిపై మంత్రి ప్రమీలా మాట్లాడుతూ రెవెన్యూ హోదా లేని గ్రామాలకు సౌకర్యాల్లో ఎలాంటి కొరత ఉండదన్నారు. మొబైల్ నెట్ వర్క్ సేవలకు సంబంధించి చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించి రెవెన్యూ శాఖ ఇబ్బందులపై అధ్యయనం చేస్తామని తెలిపారు. కొవిడ్తో రాష్ట్రంలో 20 వేల మంది మృతి చెందారని ప్రమీలా చెప్పారు. గడిచిన అయిదేళ్లలో ఇతర విపత్తులు (వరదలు, తుపానులు) వల్ల 14,407 మంది మరణించారన్నారు. గత దశాబ్దకాలంలో విపత్తుల వల్ల రాష్ట్రానికి రూ.40 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందన్నారు. తరచూ దాడి చేస్తున్న విపత్తుల సమయంలో ప్రాణ నష్టం లేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు.
క్రీడలకు ప్రాధాన్యం
అనంతరం క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి తుషారకాంతి బెహర సభ్యులడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. రాష్ట్రంలోని 314 సమితులకు గాను ఇంతవరకు 282 సమితుల్లో క్రీడామైదానాల పనులు పూర్తయినట్లు చెప్పారు. స్థలం కొరత వల్ల 13 చోట్ల పనులు ప్రారంభం కాలేదన్నారు. ఒక్కో మైదానానికి రూ.20 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. సమితి కేంద్రాల్లో గ్రామీణ యువతీ యువకులు, స్కూలు పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి పెంచి, క్రీడాకారులుగా తీర్చిదిద్దడం ప్రభుత్వం ధ్యేయమని చెప్పారు.
మహానది ఎండుతోంది
తర్వాత జలవనరులు, వాణిజ్యం, రవాణా శాఖల మంత్రి టుకుని సాహు మాట్లాడుతూ... ఉత్తరకోస్తా జిల్లాల జీవధార మహానది వేసవిలో ఎండుతోందని, పొరుగు రాష్ట్రం ఛత్తీస్గఢ్ ప్రవాహాన్ని అడ్డుకుంటోందన్నారు. ఏకపక్షంగా నదిపై భారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసి, వేసవిలో గేట్లు మూసివేస్తున్నందున రాష్ట్రానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తున్నామని, ట్రైబ్యునల్ ఈ వివాదం పరిశీలిస్తోందని తెలిపారు.
ఇబ్బందులు అధిగమించి ముందంజ
ప్రశ్నోత్తరాల తర్వాత భాజపా ప్రవేశపెట్టిన ‘సమాన పనులకు సమాన వేతనాలు’ అన్న అంశంపై మధ్యాహ్నం సుదీర్ఘ చర్చ జరిగింది. విపక్ష సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం వివక్ష చూపుతోందని, సమానంగా పనులు చేస్తున్న ఉద్యోగుల వేతనాల్లో వ్యత్యాసం ఉంటోందని ఆరోపించారు. దీనికి సమాధానమిచ్చిన మంత్రి ప్రమీలా 2000లో అధికారానికొచ్చిన బిజద ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు చవిచూసిందన్నారు. 1999 ప్రచండ తుపాను రాష్ట్రంలోని సగం జిల్లాల్లో విధ్వంసం సృష్టించగా, పునర్మిర్మాణాలకు ఎక్కువ మొత్తం అవసరమైందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఆర్థికశాఖ ప్రణాళికా స్వరూపం పెంచి, ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వివిధ శాఖల్లో పలువురిని ఒప్పంద ఉద్యోగులుగా నియమించిందన్నారు. ఇటీవల కాలంలో ఆర్థిక పరిస్థితి మెరుగు పడడంతో 57 వేల ఒప్పంద ఉద్యోగులను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రెగ్యులర్ చేశారన్నారు. ఇతర శాఖల్లో విధులు నిర్వహిస్తున్న వారంతా త్వరలో రెగ్యులర్ అవుతారని, ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధి కొనసాగుతుంది..శంక ద్వయాన్ని ఆశీర్వదించండి
[ 25-04-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, బిజదను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజల్ని కోరారు. -
భాజపాకు 40 మంది స్టార్ ప్రచారకులు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపా స్టార్ ప్రచారకుల జాబితా మంగళవారం రాత్రి విడుదల చేశారు. -
ఇంకెన్నాళ్లీ దుస్థితి?
[ 25-04-2024]
అధ్వానంరాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయన్న నివేదికలు దిగజారిన ‘నాక్’ గ్రేడేషన్లు దుస్థితిని తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి నిలదీశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో భర్తీకాని టీచింగ్ సిబ్బంది, అసౌకర్యాలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ల గురించి ఏం సమాధానం చెబుతారన్నారు. -
ఓ తండ్రి...ఇద్దరు కొడుకులు
[ 25-04-2024]
గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నామినేషన్ల సందడి
[ 25-04-2024]
బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్ పత్రాన్ని సబ్ కలెక్టర్ అనూప్ పండాకు అందజేశారు. -
భాజపాలో సీమారాణి చేరిక
[ 25-04-2024]
బిజదకు రాజీనామా చేసిన హిందళ్ సిటింగ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్ బుధవారం భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర నాయకులు ఆమెను స్వాగతించారు. -
నేడు అమిత్షా రాక
[ 25-04-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం సోన్పూర్లో ఏర్పాటయ్యే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
నా ఓటు.. నా బాధ్యత
[ 25-04-2024]
నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’