జిల్లాల ఏర్పాటులో జాప్యమెందుకు?
కొత్త జిల్లాల ఏర్పాటుకు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని, పద్మపూర్ ప్రాంత ప్రజల డిమాండు ఎందుకు నెరవేర్చడం లేదని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశ్నించారు.
పద్మపూర్లో ధర్మేంద్ర ప్రధాన్ రోడ్షో
భువనేశ్వర్, న్యూస్టుడే: కొత్త జిల్లాల ఏర్పాటుకు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని, పద్మపూర్ ప్రాంత ప్రజల డిమాండు ఎందుకు నెరవేర్చడం లేదని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశ్నించారు. గురువారం పద్మపూర్ సమితి గ్రామాల్లో ఆయనరోడ్ షోలు, సమావేశాలు నిర్వహించి భాజపా అభ్యర్థి ప్రదీప్ తరఫున ప్రచారం చేశారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కట్టుబడిన భాజపాకు ఓట్లేయాలన్నారు. 2024లో కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల ఏర్పాటు తథ్యమన్నారు. నవీన్ మాదిరి హామీలిచ్చి విస్మరించడం భాజపాకు అలవాటు లేదని, చెప్పింది చేయడానికి అహర్నిశలు శ్రమిస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సాధారణ ఎన్నికలకు 18 నెలల వ్యవధి ఉండగా, పద్మపూర్లో పరిష్కారానికి నోచుకోని సమస్యలపై శాసనసభలో ఉద్యమించడానికి భాజపా అభ్యర్థి ప్రదీప్ పురోహిత్ను గెలిపించాలని ధర్మేంద్ర ఓటర్లకు విన్నవించారు.
నేడు పద్మపూర్లో నవీన్ ప్రచారం
భువనేశ్వర్, న్యూస్టుడే: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శుక్రవారం పద్మపూర్ ఉప ఎన్నిక ప్రచారం చేయనున్నారు. బిజద అభ్యర్థి బర్షారాణి సింగ్ బరిహకు మద్దతుగా సీఎం పద్మపూర్, ఝార్బంధ్ సమితుల్లో ఏర్పాటేయ్య బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. శనివారం సాయంత్రంతో ఇక్కడ ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో బిజద, భాజపా, కాంగ్రెస్ పార్టీల ప్రచారం తారస్థాయికి చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నితీష్ గమ్యం ఎటువైపు?
[ 20-04-2024]
సంబల్పూర్ సిటింగ్ ఎంపీ నితీష్ గమ్యం ఎటువైపు? ఈసారి ఎన్నికల్లో ఆయన భార్య అరుంధతీ దేవి తరఫున ప్రచారం చేస్తారా? భాజపాకు అనుకూలంగా ఉంటారా? అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. -
కనుల పండువగా చైత్రోత్సవాలు
[ 20-04-2024]
శక్తి స్వరూపిణి, శాంతి స్వరూపిణి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. -
మౌలిక సౌకర్యాలకు దూరం.. ఎన్నికల బహిష్కరణ నిర్ణయం
[ 20-04-2024]
కొంధమాల్ జిల్లా బలిగుడ సమితిలో రుతుంగియా పంచాయతీలోని గగలిమహ, పనిపదర్, పాంగాబడి గ్రామాలకు రహదారులు, తాగునీరు, అంగన్వాడీ వంటి మౌలిక సౌకర్యాలు లేవు. -
మహిళా ఓటర్లే అత్యధికం
[ 20-04-2024]
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికలు జరగనున్న నాలుగు లోక్సభ స్థానాల్లో పురుషులకంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) నికుంజ బిహారీ ధొళో అన్నారు. -
బ్రహ్మపురలో నామినేషన్ల పర్వం
[ 20-04-2024]
బ్రహ్మపుర సబ్కలెక్టరు కార్యాలయం, పరిసరాలు రెండోరోజు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులు, వారి మద్దతుదారులతో కిటకిటలాడింది. -
భాజపా మోదీ మంత్రం.. బిజద అభివృద్ధి అస్త్రం
[ 20-04-2024]
ప్రధాన పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేస్తున్నాయి. మండుటెండలను కూడా లెక్క చేయకుండా ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. రోడ్షోలు, పాదయాత్రలు, సభలు నిర్వహిస్తున్నారు. -
మహానదిలో పడవ మునక: ఇద్దరి దుర్మరణం
[ 20-04-2024]
ఝార్సుగుడ జిల్లా లఖన్పూర్ సమితి ఛత్తీస్గఢ్ సరిహద్దు శారదా వద్ద శుక్రవారం సాయంత్రం మహానదిలో పడవ మునిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. -
నిప్పుల కొలిమిలా రాష్ట్రం
[ 20-04-2024]
రాష్ట్రం నిప్పులకొలిమిలా మారింది. భానుని ప్రతాపంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటాయి. -
చాకుతో దాడి: యువకుడి హతం
[ 20-04-2024]
గంజాం జిల్లా నిమ్మఖండి ఠాణా పరిధిలోని బొరిగావ్ గ్రామంలోని అమ్మవారి మందిరం సమీపాన చెరువు ఒడ్డున గురువారం సాయంత్రం సునీల్ దాస్ (27) అనే యువకుడు, మరో యువకుడి మధ్య పాతకక్షల నేపథ్యంలో వాగ్వాదం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?