logo

పనులు నిలిచాయి... అవస్థలు పెరిగాయి

కోట్పాడు సమితి బాతర్ల సంచాయతీ భక్తిగూడ-కాశీగూడ రహదారిపై అసంపూర్ణంగా మిగిలి కల్వర్టు పనులు వలన గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు.

Published : 02 Dec 2022 03:30 IST

అవస్థలు పడుతున్న వాహన చోదకులు

జయపురం, న్యూస్‌టుడే: కోట్పాడు సమితి బాతర్ల సంచాయతీ భక్తిగూడ-కాశీగూడ రహదారిపై అసంపూర్ణంగా మిగిలి కల్వర్టు పనులు వలన గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు ప్రకారం.. 6 నెలల క్రితం పనులు ప్రారంభించి పనులు మధ్యలో వదిలేశారు. దీంతో గ్రామాల్లోకి అత్యవసర సమయంలో అంబులెన్స్‌ రాకపోవడమే కాకుండా ఏదైన పనిమీద పంచాయతీ కార్యాలయానికి రావాలంటే ఇబ్బందులు తప్పట్లేదని వాపోయారు. పలుమార్లు అదికారులు దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరగా పనులు పూర్తి చేయకుంటే కలెక్టరు కార్యాలయం వద్ద నిరసన చేస్తామని హెచ్చరించారు. ఈ విషయమై సర్పంచ్‌ త్రినాథ్‌ మాఝి మాట్లాడుతూ బీడీవో రాజీవ్‌ దాస్‌ దృష్టికి తీసుకెళ్లమని.. త్వరలో పనులు ప్రారంబిస్తామని బీడీవో హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని