ఓటు హక్కు వినియోగంలో యువత ముందుండాలి
ఓటు హక్కు వినియోగంలో యువత ముందుండాలని సబ్-కలెక్టర్ భీమ్సేన్ సబరో అన్నారు.
మాట్లాడుతున్న భీమ్సేన్, వేదికపై లక్ష్మీనారాయణ తదితరులు
రాయగడ పట్టణం, న్యూస్టుడే: ఓటు హక్కు వినియోగంలో యువత ముందుండాలని సబ్-కలెక్టర్ భీమ్సేన్ సబరో అన్నారు. కోమట్లపేటలోని ఉగ్రతార ఉన్నత సెకండరీ పాఠశాలలో గురువారం జరిగిన ఓటరు నమోదు ప్రక్రియ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని సద్వినియోగపరుచుకునేందుకు యువత చొరవ చూపాలని సబరో హితువు పలికారు. ఈ ఏడాది 17 ఏళ్లు నిండిన వారంతా వచ్చే ఏడాది కోసం ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశమున్న నేపథ్యంలో కొందరు విద్యార్థులు వారి పేర్లను నమోదు చేసుకున్నారు. 18 ఏళ్ల వారు 23 మందితో పాటు 17 ఏళ్ల వారు మరో 15 మంది ఓటు హక్కు కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పాఠశాల ప్రిన్సిపాల్, ప్రభాకర్దాస్ తెలిపారు. కార్యక్రమంలో రాయగడ బీడీవో లక్ష్మీనారాయణ సబతో, శంకర్పండా, నీలాంచల్ మిశ్ర తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
71 అసెంబ్లీ స్థానాలకు పోటీచేసేది వీరే..
[ 28-03-2024]
ముఖ్యమంత్రి, బిజద అధినేత నవీన్ పట్నాయక్ బుధవారం మధ్యాహ్నం వీడియో సందేశం ద్వారా 71 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా స్వయంగా ప్రకటించారు. -
బిజద లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
[ 28-03-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 21 లోక్సభ స్థానాలకుబుధవారం 15 మందితో తొలి జాబితా ప్రకటించారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. -
దాహం కేకలు
[ 28-03-2024]
రాయగడ జిల్లాలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు కటకటలాడుతున్నారు. -
తండ్రి ‘హస్తం’ కాదని... ‘శంఖం’ పిడికిట పట్టుకొని..
[ 28-03-2024]
సీనియర్ కాంగ్రెస్ నేత, ఖుర్దా జిల్లా జట్నీ ఎమ్మెల్యే సురేష్ రౌత్రాయి చిన్న కుమారుడు కెప్టెన్ మన్మధ రౌత్రాయి బుధవారం బిజదలో చేరారు. -
బస్సు బోల్తా: ఒకరి మృతి, 20 మందికి గాయాలు
[ 28-03-2024]
కొరాపుట్ నుంచి రాయగడకు వెళ్లే మార్గంలో పొడఘడ్ వద్ద మంగళవారం రాత్రి బస్సు బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా, 20 మందికి గాయాలయ్యాయి. -
చిట్ పేరిట రూ. 2 కోట్లకుపైగా టోకరా
[ 28-03-2024]
చిట్ఫండ్ పేరిట ఓ మహిళ రూ.2 కోట్లకుపైగా టోకరా వేసిన ఉదంతం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. -
ఆహుతవుతున్న పచ్చదనం
[ 28-03-2024]
రాష్ట్రంలో పచ్చదనం అగ్నికి ఆహుతవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2030 నాటికి అడవులకు నిప్పు ఘటనలు మరింత తీవ్ర రూపం దాల్చనున్నట్లు అధ్యయనాలు పేర్కొంటుండడం గుబులు రేపుతోంది. -
కేజ్రీవాల్పై కుట్ర పన్నారు
[ 28-03-2024]
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర పన్ని, తప్పుడు కేసులో అరెస్టు చేసి, అన్యాయంగా జైల్లో పెట్టారని ఆప్ నాయకులు ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
వరంగల్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు