సినీనటి జరనాదాస్ కన్నుమూత
ఒడియా సినీ రంగంలో సీనియర్ నటి జరానా దాస్ (82) శుక్రవారం వేకువజామున మృతి చెందారు. కటక్లోని చంఢీ రోడ్లో గల నివాసంలో కన్నుమూశారు.
జరానాదాస్ (పాత చిత్రం)
కటక్, న్యూస్టుడే: ఒడియా సినీ రంగంలో సీనియర్ నటి జరానా దాస్ (82) శుక్రవారం వేకువజామున మృతి చెందారు. కటక్లోని చంఢీ రోడ్లో గల నివాసంలో కన్నుమూశారు. కొన్నాళ్లుగా వృద్ధాప్యంతో వచ్చిన రుగ్మతల వల్ల ఇబ్బంది పడుతున్నారు. సినీ నటులు నిర్మాతలు, దర్శకులు ఆమె నివాసానికి వెళ్లి భౌతికకాయాన్ని దర్శించుకున్నారు. 1960లో ఒడియా సినీ రంగంలోకి ప్రవేశించిన ఆమె 50కిపైగా చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక జయదేవ్ పురస్కారం అందుకున్నారు. శ్రీ జగన్నాథ్, నారి, అభినేత్రి, హీరానెల్లా వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒడిస్సీ నృత్యకారిణిగా కూడా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమారులు విదేశాల్లో ఉండడంతో వారు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు. సినీ హీరో శ్రీతం, హీరోయిన్ పింకీ ప్రధాన్ తదితరులు ఆమె భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. జరనా దాస్ మృతిపై ముఖ్యమంత్రి నవీన్పట్నాయక్తోపాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సంతాపం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటరుతో మాట...నేతల కొత్త బాట
[ 23-04-2024]
ఈ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు కీలకం. ఒకవైపు మోదీ కోసం భాజపా ఉద్యమిస్తుంటే... ఆరోసారి ముఖ్యమంత్రిగా నవీన్ను చూడాలని బిజద ప్రయత్నిస్తోంది. -
రాజకీయ ప్రత్యర్థులు ఎదురుపడిన వేళ...
[ 23-04-2024]
బ్రహ్మపురలోని గంజాం న్యాయవాదుల సంఘం (జీబీఏ) సమావేశ మందిరం ఆవరణలో సోమవారం రాజకీయ ప్రత్యర్థులు ఎదురుపడ్డారు. -
ఆరుగురితో బిజద 7వ జాబితా
[ 23-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోమవారం 6 అసెంబ్లీ స్థానాలకు 7వ జాబితా ప్రకటించారు. క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి తుషార్కాంతి బెహరాకు, విద్యాశాఖ మంత్రి సుధాం మారాండి భార్య రంజితాకు, ఢెంకనాల్ ఎంపీ ముహేష్సాహుకు టికెట్లు కేటాయించారు. -
కేంద్రపడ బిజదలో భగ్గుమన్న అసంతృప్తి
[ 23-04-2024]
పార్టీకి విధేయులుగా ఉన్నవారిని పక్కన పెట్టి ఫిరాయింపు నేతలకు ఎన్నికల బరిలో దించడంతో కేంద్రపడ జిల్లా బిజదలో అసంతృప్తి భగ్గుమంది. -
సనాతన్ మహాకుడోకు పిలిచి టికెట్ ఇచ్చిన సీఎం
[ 23-04-2024]
గనులకు నిలయమైన కేంఝర్ జిల్లాలో అంతా కుబేరునిగా చెప్పుకునే సనాతన్ మహాకుడోకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక చంపువా అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా చేశారు. -
బిజదలో చేరికలు.. సన్నాహక సమావేశాలు
[ 23-04-2024]
ఎన్నికల తేదీలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి దూకుళ్లు అధికమవుతున్నాయి. -
నవరంగపూర్లో త్రిముఖం..ఎవరిదో విజయం
[ 23-04-2024]
గత పదేళ్ల కిందటి వరకు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నవరంగపూర్ లోక్సభ స్థానంలో క్రమేణా బిజద బలం పుంజుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలతోపాటు భాజపా కూడా గట్టి పోటీ ఇస్తుండడంతో త్రిముఖ పోటీ ఆసక్తికరంగా మారింది. -
గమాంగ్ దంపతుల మద్దతు ఎవరికో?
[ 23-04-2024]
రాయగడ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, ఆయన భార్య హేమా గమాంగ్ పేరు తెలియని వారుండరు. గిరిధర్ గమాంగ్కు సుమారు 50 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది. -
కార్మిక బంధువు నవీన్: పాండ్యన్
[ 23-04-2024]
అసంఘటిత రంగాల్లో పనులు చేస్తున్న కార్మికులకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బంధువయ్యారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్ చెప్పారు. -
పాదయాత్రలు.. ఇంటింటా ప్రచారాలు
[ 23-04-2024]
బ్రహ్మపుర అసెంబ్లీ నియోకవర్గంలో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. భాజపా అభ్యర్థి కె.అనిల్కుమార్ సోమవారం 11వ వార్డులోని వివిధ వీధుల్లో పాదయాత్రగా ఇంటింటా ఓటర్లను కలిసి ఓటు వేయాలని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!