logo

సినీనటి జరనాదాస్‌ కన్నుమూత

ఒడియా సినీ రంగంలో సీనియర్‌ నటి జరానా దాస్‌ (82) శుక్రవారం వేకువజామున మృతి చెందారు. కటక్‌లోని చంఢీ రోడ్‌లో గల నివాసంలో కన్నుమూశారు.

Published : 03 Dec 2022 00:54 IST

జరానాదాస్‌ (పాత చిత్రం)

కటక్‌, న్యూస్‌టుడే: ఒడియా సినీ రంగంలో సీనియర్‌ నటి జరానా దాస్‌ (82) శుక్రవారం వేకువజామున మృతి చెందారు. కటక్‌లోని చంఢీ రోడ్‌లో గల నివాసంలో కన్నుమూశారు. కొన్నాళ్లుగా వృద్ధాప్యంతో వచ్చిన రుగ్మతల వల్ల ఇబ్బంది పడుతున్నారు. సినీ నటులు నిర్మాతలు, దర్శకులు ఆమె నివాసానికి వెళ్లి భౌతికకాయాన్ని దర్శించుకున్నారు. 1960లో ఒడియా సినీ రంగంలోకి ప్రవేశించిన ఆమె 50కిపైగా చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక జయదేవ్‌ పురస్కారం అందుకున్నారు. శ్రీ జగన్నాథ్‌, నారి, అభినేత్రి, హీరానెల్లా వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒడిస్సీ నృత్యకారిణిగా కూడా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమారులు విదేశాల్లో ఉండడంతో వారు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు. సినీ హీరో శ్రీతం, హీరోయిన్‌ పింకీ ప్రధాన్‌ తదితరులు ఆమె భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. జరనా దాస్‌ మృతిపై ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌తోపాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సంతాపం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని