logo

అసెంబ్లీని భాజపా రాజకీయ వేదిక చేసింది

భాజపా నాయకులు శాసనసభను రాజకీయ వేదికగా చేసుకొని రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్‌ సభాపక్షం నేత నర్సింగ మిశ్ర ధ్వజమెత్తారు.

Published : 03 Dec 2022 00:54 IST

సీఎల్పీ నేత నర్సింగ మిశ్ర ధ్వజం

నర్సింగ మిశ్ర

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: భాజపా నాయకులు శాసనసభను రాజకీయ వేదికగా చేసుకొని రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్‌ సభాపక్షం నేత నర్సింగ మిశ్ర ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శీతాకాలం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచి ఆ పార్టీ సభ్యులు విలువలకు సమాధి కట్టారని, చీటికిమాటికి పోడియం వద్ద ఆందోళన చేస్తూ కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారని ఆవేదన  వ్యక్తం చేశారు. స్వీయ లబ్ధి, రాజకీయ ప్రయోజనాలే ధ్యేయంగా చేసుకున్న భాజపా పెద్దలు తాము విపక్షంలో ఉన్నామని, ప్రజల కోసం ఉద్యమిస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. శుక్రవారం ఆ పార్టీ నాయకులు సభ లోపల, వెలుపల వ్యవహరించిన తీరు గణతంత్రానికి గొడ్డలిపెట్టుగా మిశ్ర అభివర్ణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని