నత్తనడకన బిజు సేతు నిర్మాణాలు
రాష్ట్రంలో బిజు సేతు నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. నిర్ణీత వ్యవధిలో పనులు జరగనందున నిర్మాణ వ్యయం పెరుగుతోందని ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ (కాగ్) ప్రభుత్వంపై అక్షింతలేసింది.
ప్రభుత్వంపై కాగ్ అక్షింతలు
బిజు సేతు పథకంలో నిర్మాణం
భువనేశ్వర్, న్యూస్టుడే: రాష్ట్రంలో బిజు సేతు నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. నిర్ణీత వ్యవధిలో పనులు జరగనందున నిర్మాణ వ్యయం పెరుగుతోందని ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ (కాగ్) ప్రభుత్వంపై అక్షింతలేసింది. శుక్రవారం రాత్రి శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడడానికి ముందు ‘కాగ్’ నివేదిక సభలో ప్రవేశపెట్టారు.
నాలుగేళ్లలో 473 నిర్మాణాలు
2020-21 సంవత్సరానికి సంబంధించి కాగ్ అధ్యయన నివేదికలో బిజుసేతు నిర్మాణాల వైఫల్యాలను ప్రస్తావించింది. అందులోని వివరాల ప్రకారం... నాలుగేళ్లలో 793 ఆనకట్టల పనులు పూర్తి చేయాలన్న ధ్యేయం నెరవేరలేదు. 473 నిర్మాణాలు మాత్రమే చేపట్టారు. 2011లో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. ఇందుకోసం 2017-2021 సంవత్సరాల బడ్జెట్లో ప్రభుత్వం రూ.2,570 కోట్లు కేటాయించింది. 88 శాతం నిధులు (రూ.2252.62 కోట్లు) ఖర్చయ్యాయి. ఇంతవరకు రూ.314.38 కోట్లు ఖర్చవలేదు. నిర్మాణాల్లో చాలాచోట్ల నాణ్యత కరవైంది. గుత్తేదారులు (కాంట్రాక్టర్లు) నాసిరకం పనులు చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని మూడు డివిజన్ల ఇంజినీర్లు పనులు పర్యవేక్షించాల్సి ఉన్నా వారు కూడా పట్టించుకోలేదు. అసంపూర్తి పనులపై గ్రామీణాభివృద్ధి శాఖ యంత్రాంగం దృష్టి సారించలేదు. సకాలంలో పనులు చేయలేకపోయిన గుత్తేదారులపై చర్యలు లేవు. బిజుసేతు పథకం పనులకు నిధులు కేటాయించిన ప్రభుత్వం తర్వాత వాటిని విస్మరించిందని ‘కాగ్’ తన నివేదికలో ఎండగట్టింది. దీనిపై కాంగ్రెస్ సభాపక్షం (సీఎల్పీ) నేత నర్సింగ మిశ్ర భువనేశ్వర్లో విలేకరులతో మాట్లాడుతూ... నిధులు దుర్వినియోగం బిజుసేతు పథకానికి మాత్రమే పరిమితం కాలేదని, మిగతా పథకాలు అలాగే ఉన్నాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నితీష్ గమ్యం ఎటువైపు?
[ 20-04-2024]
సంబల్పూర్ సిటింగ్ ఎంపీ నితీష్ గమ్యం ఎటువైపు? ఈసారి ఎన్నికల్లో ఆయన భార్య అరుంధతీ దేవి తరఫున ప్రచారం చేస్తారా? భాజపాకు అనుకూలంగా ఉంటారా? అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. -
కనుల పండువగా చైత్రోత్సవాలు
[ 20-04-2024]
శక్తి స్వరూపిణి, శాంతి స్వరూపిణి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. -
మౌలిక సౌకర్యాలకు దూరం.. ఎన్నికల బహిష్కరణ నిర్ణయం
[ 20-04-2024]
కొంధమాల్ జిల్లా బలిగుడ సమితిలో రుతుంగియా పంచాయతీలోని గగలిమహ, పనిపదర్, పాంగాబడి గ్రామాలకు రహదారులు, తాగునీరు, అంగన్వాడీ వంటి మౌలిక సౌకర్యాలు లేవు. -
మహిళా ఓటర్లే అత్యధికం
[ 20-04-2024]
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికలు జరగనున్న నాలుగు లోక్సభ స్థానాల్లో పురుషులకంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) నికుంజ బిహారీ ధొళో అన్నారు. -
బ్రహ్మపురలో నామినేషన్ల పర్వం
[ 20-04-2024]
బ్రహ్మపుర సబ్కలెక్టరు కార్యాలయం, పరిసరాలు రెండోరోజు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులు, వారి మద్దతుదారులతో కిటకిటలాడింది. -
భాజపా మోదీ మంత్రం.. బిజద అభివృద్ధి అస్త్రం
[ 20-04-2024]
ప్రధాన పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేస్తున్నాయి. మండుటెండలను కూడా లెక్క చేయకుండా ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. రోడ్షోలు, పాదయాత్రలు, సభలు నిర్వహిస్తున్నారు. -
మహానదిలో పడవ మునక: ఇద్దరి దుర్మరణం
[ 20-04-2024]
ఝార్సుగుడ జిల్లా లఖన్పూర్ సమితి ఛత్తీస్గఢ్ సరిహద్దు శారదా వద్ద శుక్రవారం సాయంత్రం మహానదిలో పడవ మునిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. -
నిప్పుల కొలిమిలా రాష్ట్రం
[ 20-04-2024]
రాష్ట్రం నిప్పులకొలిమిలా మారింది. భానుని ప్రతాపంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటాయి. -
చాకుతో దాడి: యువకుడి హతం
[ 20-04-2024]
గంజాం జిల్లా నిమ్మఖండి ఠాణా పరిధిలోని బొరిగావ్ గ్రామంలోని అమ్మవారి మందిరం సమీపాన చెరువు ఒడ్డున గురువారం సాయంత్రం సునీల్ దాస్ (27) అనే యువకుడు, మరో యువకుడి మధ్య పాతకక్షల నేపథ్యంలో వాగ్వాదం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్