ఓటీయం పరిశ్రమను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
ప్రభుత్వం ఈ నెల 5వ తేదీలోగా చౌద్వార్ ప్రాంతంలో ఉన్న మూతపడిన ఓటీయం (ఒడిశా టెక్స్టైల్ మిల్)ను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.
హైకోర్టు ఆదేశం
కటక్, న్యూస్టుడే: ప్రభుత్వం ఈ నెల 5వ తేదీలోగా చౌద్వార్ ప్రాంతంలో ఉన్న మూతపడిన ఓటీయం (ఒడిశా టెక్స్టైల్ మిల్)ను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఇందులో పనిచేసిన సిబ్బందికి, పరిశ్రమల వాటాదారుల కోసం కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం రూ.150 కోట్లు బ్యాంకులో జమ చేసినా ఇంతవరకు ఎందుకు పరిశ్రమను ప్రభుత్వం తన ఆధీనంలో తీసుకోలేదని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయస్థానం సూచించిన గడువులోగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోతే నెలకు రూ.5 లక్షలు చెల్లించవలసి ఉంటుందని హెచ్చరించింది. ఒకప్పుడు ఈ మిల్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉండేది. ఇక్కడ తయారు చేసే వస్త్రాలకు మంచి గిరాకీ ఉండేది. వందల సంఖ్యలో ఉద్యోగులు పరిశ్రమలో పనిచేసేవారు. 40 ఏళ్ల క్రితం మూసివేశారు. దీంతో ఉద్యోగులు సమస్యల్లో పడ్డారు. ఉద్యోగులకు పరిహారం చెల్లించాలని కోరుతూ ఏళ్ల తరబడి పరిశ్రమ ప్రవేశ ద్వారం వద్ద ఉద్యోగులు ధర్నా కొనసాగిస్తున్నారు. ఈ సమస్యపై హైకోర్టులో నమోదైన కేసును ఇటీవల కోర్టు విచారించి ఉద్యోగుల పరిహారం కోసం రూ.150 కోట్లు బ్యాంకులో జమ చేయాలని, డబ్బు పంపిణీకి లిక్విడేటర్, చార్టెర్డ్ అకౌంటెంట్ను నియమించి ఉద్యోగులకు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దీంతో ప్రభుత్వం రూ.150 కోట్లు జమచేసింది. ఉద్యోగులకు పరిహారం పంపిణీ చేయలేదు. దీనిపై నమోదైన కేసును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పైవిధంగా తీర్పునిచ్చింది.
న్యాయమూర్తి సమక్షంలో గ్రామ సభ నిర్వహించాలి
సిమిలిగుడ, న్యూస్టుడే: కొరాపుట్ జిల్లా సిమిలిగుడ సమితిలోని మాలి పర్వతంపై బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన అనుమతుల కోసం రాష్ట్ర కాలుష్య బోర్డు మరోసారి గ్రామ సభ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. గత ఏడాది నవంబర్ 23న నిర్వహించిన సభ సంతృప్తికరంగా జరగలేదని తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 15 లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, ప్రజాభిప్రాయ సేకరణ వివరాలను హైకోర్టుకు సమర్పించాలని తెలిపింది. సిమిలిగుడ తహసీల్దార్ జ్యోతి రాణి రథొ మాట్లాడుతూ జిల్లా జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ కమిషనర్ సమక్షంలో శిబిరాన్ని మళ్లీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 7న దీనిపై ప్రకటన జారీ చేసి, నెల రోజులు అభ్యంతరాల గడువు ఉంటుందని అనంతరం సభ జరిగే తేదీ, ప్రదేశం నిర్ణయిస్తామన్నారు. 2012 నుంచి మాలిపై బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి మద్దతు దారులు, వ్యతిరేకుల మధ్య ఘర్షణ జరుగుతోంది. గతేడాది సెప్టెంబర్ 22న ప్రజా అభిప్రాయ సేకరణ శిబిరం ఏర్పాటు చేయగా వ్యతిరేకులు అధికారులపై దాడి చేసి, విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి సభ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బిజద... రాజీనామాల బెడద
[ 24-04-2024]
గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత ఎన్నికల్లో బిజదలో అసంతృప్తి కనిపిస్తోంది. పిరాయింపుదారులకు అధినాయకత్వం టికెట్లు కేటాయించిందన్న అసహనం, అసంతృప్తి రాష్ట్రమంతటా ఉంది. సీనియర్ నాయకులు పార్టీకి రాజీనామాలు చేశారు. -
అనుభవజ్ఞులతో కొత్త అభ్యర్థుల ఢీ
[ 24-04-2024]
నవరంగపూర్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో అనుభవజ్ఞులతో కొత్త అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలో అన్ని పార్టీలు నూతన అభ్యర్థులను బరిలో నిలపడంతో పోటీ ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. -
ముమ్మరంగా నామినేషన్ల దాఖలు
[ 24-04-2024]
కల తేదీలు దగ్గర పడుతున్న వేళ వివిధ పార్టీల నేతలు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. అనుచరులు, నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీలు నిర్వహిస్తూ వెళ్లి తమ ఇష్టదైవాలకు ప్రార్థనలు చేసి తర్వాత నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
అందాల పిట్టలండీ.. సంఖ్య పెరిగేనండీ
[ 24-04-2024]
కేంద్రపడ జిల్లా బితరకనిక జాతీయ ఉద్యానవనంలో మడ అడవి పక్షుల (మేన్గ్రోవ్ పిట్ట) సంఖ్య పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే వీటి సంతతి 39 పెరగడం గమనార్హం. -
గోపాల్పూర్లో ముఖాముఖి పోరు
[ 24-04-2024]
ప్రతిష్ఠాత్మక గోపాల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజద, భాజపా అభ్యర్థుల మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా కనిపిస్తోంది. -
భాజపా గూటికి మరో ఇద్దరు అగ్రనేతలు
[ 24-04-2024]
మాజీ మంత్రి బింబాధర్ కువార్, బిజద మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి నివేదితా నాయక్ భాజపా గూటికి చేరారు. -
మిత్రమండలి కొత్త కార్యవర్గం ఎంపిక
[ 24-04-2024]
బ్రహ్మపురలోని సుమారు 80 ఏళ్ల పురాతన ‘ఆంధ్ర విజ్ఞాన మిత్ర మండలి’ కొత్త కార్యవర్గం ఎంపిక సోమవారం రాత్రి జరిగింది. -
ముగిసిన తరాతరిణి చైత్ర మంగళవారాల యాత్ర
[ 24-04-2024]
గంజాం జిల్లాలోని సుప్రసిద్ధ తరాతరిణి శక్తిపీఠంలో చైత్ర మంగళవారాల యాత్ర ముగిసింది. అయిదో మంగళవారం సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కనిపించింది.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..