కోణార్క్ ఉత్సవాలు అజరామరం
కోణార్క్ ఉత్సవాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని, రాష్ట్ర పర్యటక రంగానికి మంచి భవిష్యత్తు ఉందని పర్యటక, సాంస్కృతిక శాఖల మంత్రి అశ్విని పాత్ర్ చెప్పారు.
పర్యటక రంగానికి మంచి భవిష్యత్తు
ప్లాస్టిక్ వ్యర్థాలు వద్దన్న సందేశంతో సైకత శిల్పిం
గోపాలపూర్, న్యూస్టుడే: కోణార్క్ ఉత్సవాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని, రాష్ట్ర పర్యటక రంగానికి మంచి భవిష్యత్తు ఉందని పర్యటక, సాంస్కృతిక శాఖల మంత్రి అశ్విని పాత్ర్ చెప్పారు. శనివారం సహచర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి తుషార కాంతి బెహరతో కలిసి కోణార్క్ చేరువలోని చంద్రభాగ తీరాన్ని ఆయన సందర్శించారు. 29 మంది శిల్పులు ఇక్కడ తీర్చిదిద్దుతున్న సందేశాత్మక సైకత శిల్పాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పాత్ర్ మాట్లాడుతూ.. పర్యటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రముఖ కేంద్రాల్లో ఏటా వేడుకలు చేపడుతోందన్నారు. ఈ నెల 24 నుంచి గోపాలపూర్ తీర సంబరాలు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. కొత్త పర్యటక విధానం ఆమోదం పొందినందున రాష్ట్రంలో వెనుకబడిన చారిత్రక పీఠాలన్నీ వైభవం సంతరించుకుంటాయని తెలిపారు. క్రీడలశాఖ మంత్రి బెహర మాట్లాడుతూ... కోణార్క్ వేడుకల్లో సైకత శిల్ప ప్రదర్శన రాష్ట్ర ఖ్యాతికి అద్దం పడుతోందన్నారు.
సమ్మోహనం శాస్త్రీయ నృత్యాలు
సమ్మోహనం చేస్తున్న శాస్త్రీయ నృత్యాలు
కోణార్క్ సాంస్కృతి వేదికపై రాత్రి వరకు ఏర్పాటవుతున్న శాస్త్రీయ నృత్యాలు సందర్శకులను సమ్మోహనం చేస్తున్నాయి. శనివారం రాత్రి చెన్నైకి చెందిన దృశ్యం సెంటర్ ఫర్ మోహినీ అట్టం సంస్థ కళాకారుల నాట్యాలు, మయూర్లలిత్ డాన్స్ అకాడమీ (కోల్కతా)వారి ఒడిస్సీ నృత్యాలు నేత్రపర్వం చేశాయి. కొవిడ్ వల్ల గతేడాది కోణార్క్ సంబరాలు తిలకించడానికి పర్యటకులు పెద్దగా రాలేదు. ఈ ఏడాది ఎక్కువగా వస్తున్నారు. విదేశాల నుంచి ఎంతోమంది అతిథులొచ్చారు. పగలు సైకత శిల్పాల ప్రదర్శన, రాత్రిళ్లు కళాకారుల నాట్యాలు రంజింపజేస్తున్నాయి.
మళ్లీ శ్రీక్షేత్రం దృశ్యాలు వైరల్
గోపాలపూర్, న్యూస్టుడే: పూరీ శ్రీక్షేత్రం దృశ్యాలు శనివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. డ్రోన్ కెమేరాతో ఆలయంపైన, చుట్టుపక్కలా చిత్రీకరించిన 5.43 నిమిషాల నిడివి గల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. కృష్ణ చంద్రపాఢి అనే వ్యక్తి ఖాతాతో ఈ దృశ్యాలున్నాయి. దీనిపై శ్రీక్షేత్ర సేవాయత్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో ఏర్పాటయ్యే పాలకవర్గం సమావేశంలో ఇదే అంశం కీలకమవుతుందని పాలకవర్గం ప్రతినిధి మాధవ చంద్రదాస్ విలేకరులకు చెప్పారు. ఇటీవల బంగ్లాదేశ్కు చెందిన ఆకాష్ చౌధురి అనే వ్యక్తి గర్భగుడి దృశ్యాలు వైరల్ చేసిన సంఘటనలో అరెస్టయ్యారు. ఇంతలో మళ్లీ డ్రోన్ కెమేరా దృశ్యాలు వైరల్ అయ్యాయి.దీనిపై భక్తులోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 25-04-2024]
ఒడిశాలో కోరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. -
అభివృద్ధి కొనసాగుతుంది..శంక ద్వయాన్ని ఆశీర్వదించండి
[ 25-04-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, బిజదను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజల్ని కోరారు. -
భాజపాకు 40 మంది స్టార్ ప్రచారకులు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపా స్టార్ ప్రచారకుల జాబితా మంగళవారం రాత్రి విడుదల చేశారు. -
ఇంకెన్నాళ్లీ దుస్థితి?
[ 25-04-2024]
అధ్వానంరాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయన్న నివేదికలు దిగజారిన ‘నాక్’ గ్రేడేషన్లు దుస్థితిని తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి నిలదీశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో భర్తీకాని టీచింగ్ సిబ్బంది, అసౌకర్యాలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ల గురించి ఏం సమాధానం చెబుతారన్నారు. -
ఓ తండ్రి...ఇద్దరు కొడుకులు
[ 25-04-2024]
గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నామినేషన్ల సందడి
[ 25-04-2024]
బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్ పత్రాన్ని సబ్ కలెక్టర్ అనూప్ పండాకు అందజేశారు. -
భాజపాలో సీమారాణి చేరిక
[ 25-04-2024]
బిజదకు రాజీనామా చేసిన హిందళ్ సిటింగ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్ బుధవారం భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర నాయకులు ఆమెను స్వాగతించారు. -
నేడు అమిత్షా రాక
[ 25-04-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం సోన్పూర్లో ఏర్పాటయ్యే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
నా ఓటు.. నా బాధ్యత
[ 25-04-2024]
నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ