logo

స్వగ్రామానికి చేరుకునేలోపు మృత్యు ఒడిలోకి

కొరాపుట్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని మాచ్‌ఖండ్‌ సమీపంలోని కొదరీ వద్ద శనివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్య తీవ్రంగా గాయపడింది.

Published : 04 Dec 2022 02:19 IST

చికిత్స పొందుతున్న క్షతగాత్రురాలు లక్ష్మి

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కొరాపుట్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని మాచ్‌ఖండ్‌ సమీపంలోని కొదరీ వద్ద శనివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్య తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చనువా గ్రామానికి చెందిన సహదేవ్‌ ముదులి (35), తన భార్య లక్ష్మి (30)తో లమతాపుట్‌ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా కొదరీ వద్ద కారు ఢీకొనడంతో సహదేవ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. లక్ష్మి తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రురాలిని స్థానికులు సమీపంలోని ఆశ కిరణ్‌ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రమాదానికి కారణమైన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబాలు అక్కడకు చేరుకొని పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో కారణంగా లమతాపుట్‌-జయపురం మార్గంలో సుమారు రెండు గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసుల హామీతో ఆందోళన విరమించారు.


వృద్ధుడి హత్య

మల్కాన్‌గిరి, న్యూస్‌టుడే: పొలంలో పడుకున్న వృద్ధుడు హతమైన ఘటన మల్కాన్‌గిరి జిల్లా పోడియా సమితిలో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి మల్కాన్‌గిరి జిల్లా పోడియ సమితి గిరికనపల్లి పంచాయతీ ముర్పనపల్లి గ్రామానికి చెందిన మడా బేటి (70) తన పొలంలో నిద్రించాడు. శనివారం ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా మడాను హతమార్చి మృతదేహానికి నిప్పుపెట్టిన దృశ్యం పొలంలో కనిపించింది. కుటుంబ సభ్యులు ఎమ్‌.వి.79 ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరీక్షకు పంపించారు. ఆస్తి తగదాల ఇందుకు కారణంగా తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని