అధ్వానంగా ఘన వ్యర్థాల నిర్వహణ: కాగ్
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ చర్యలు అధ్వానంగా ఉన్నాయని కాగ్ పేర్కొంది. ఘన వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి డంపింగ్ చేయడం నుంచి యూజర్ ఫీజు వసూళ్ల వరకు అసంతృప్తికరంగా ఉన్నట్లు తేల్చి చెప్పింది.
రాయగడలో ప్రాసెసింగ్ చేయకుండానే డంపింగ్ చేసిన వ్యర్థాలు
రాయగడ పట్టణం, న్యూస్టుడే: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ చర్యలు అధ్వానంగా ఉన్నాయని కాగ్ పేర్కొంది. ఘన వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి డంపింగ్ చేయడం నుంచి యూజర్ ఫీజు వసూళ్ల వరకు అసంతృప్తికరంగా ఉన్నట్లు తేల్చి చెప్పింది. ‘‘పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ’’ పేరిట తాజాగా విడుదల చేసిన నివేదికలో కాగ్ ఈ విషయాలు వెల్లడించింది. వాటి ప్రకారం.. పట్టణ, నగర ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు పట్టణ స్థానిక సంస్థలు కానీ సరైన చర్యలు చేపట్టలేదు. దాంతో 2021 మార్చి వరకు 90 శాతం వ్యర్థాలను ఎలాంటి రీసైక్లింగ్ చేయకుండానే డంపింగ్ చేయడం గమనార్హం. 2016 ఏప్రిల్ 8న ప్రకటించిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2016 ప్రకారం.. నోటిఫికేషన్ జారీ చేసిన ఏడాదిలోగా రాష్ట్రం దీనిపై పాలసీ సిద్ధం చేయాల్సి ఉంది. అయినప్పటికీ ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఘన వ్యర్థాల నిర్వహణపై సమగ్ర పాలసీని జారీ చేయకపోవడాన్ని కాగ్ తప్పు పట్టింది.
వేల టన్నుల వ్యర్థాలు...
2015-20 మధ్య స్మార్ట్ సిటీల్లో రోజుకి 2,956 టన్నుల వ్యర్థాలను, ఏడాది 35,057 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఎలాంటి ప్రాసెసింగ్ చేయకుండానే డంపింగ్ చేసినట్లు కాగ్ వెల్లడించింది. పట్టణాల్లో ఇంటింటికీ చెత్త తొట్టెలు సమకూర్చడం, ఘన వ్యర్థాల సేకరణ, వీధుల్లో పారిశుద్ధ్య చర్యలు రోజు చేపట్టడం తదితర అంశాల్లో యూఎల్బీ(అర్బన్ లెవెల్ బాడీ)లు వంద శాతం విఫలమైనట్లు కాగ్ నివేదికలో పేర్కొంది. 21 యూఎల్బీలో పరిశీలించగా కేవలం ఏడు యూఎల్బీలు మాత్రమే యూజర్ ఫీజులు వసూలు చేసినట్లు నివేదిక వెల్లడించింది. 2017-21ల మధ్య ఈ ఫీజు రూపంలో రూ.161.41 కోట్ల ఆదాయం సమకూరనుండగా కేవలం రూ.70 లక్షలు మాత్రమే వసూలైనట్లు కాగ్ బహిర్గతం చేసింది.
పారిశుద్ధ్య చర్యలు లోపంతో ముర్జా కాలువలో పేరుకుంటున్న చెత్తాచెదారాలు
దక్కని రూ.333 కోట్ల కేంద్ర సాయం...
2015-20 మధ్య రోజుకు 2956 టన్నుల ఘన వ్యర్థాలు, ఏడాదికి 35,057 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రాసెసింగ్ చేయకుండానే డంపింగ్ చేయడంతో రూ.333.58 కోట్ల కేంద్ర ఆర్థిక సాయం దక్కించుకోవడంలో యూఎల్బీలు విఫలమైనట్లు నివేదిక స్పష్టం చేసింది. తక్కువ ఆదాయం కారణంగా సొంత ఆదాయ వనరులు, ఘన వ్యర్థాల నిర్వహణ ఖర్చు మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోయిందని కాగ్ పేర్కొంది. 2015-16లో ఈ వ్యత్యాసం రూ.81.33 కోట్లు కాగా 2019-20 నాటికి అది రూ.168.73 కోట్లకు పెరిగినట్లు కాగ్ బహిర్గతం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బిజద... రాజీనామాల బెడద
[ 24-04-2024]
గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత ఎన్నికల్లో బిజదలో అసంతృప్తి కనిపిస్తోంది. పిరాయింపుదారులకు అధినాయకత్వం టికెట్లు కేటాయించిందన్న అసహనం, అసంతృప్తి రాష్ట్రమంతటా ఉంది. సీనియర్ నాయకులు పార్టీకి రాజీనామాలు చేశారు. -
అనుభవజ్ఞులతో కొత్త అభ్యర్థుల ఢీ
[ 24-04-2024]
నవరంగపూర్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో అనుభవజ్ఞులతో కొత్త అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలో అన్ని పార్టీలు నూతన అభ్యర్థులను బరిలో నిలపడంతో పోటీ ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. -
ముమ్మరంగా నామినేషన్ల దాఖలు
[ 24-04-2024]
కల తేదీలు దగ్గర పడుతున్న వేళ వివిధ పార్టీల నేతలు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. అనుచరులు, నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీలు నిర్వహిస్తూ వెళ్లి తమ ఇష్టదైవాలకు ప్రార్థనలు చేసి తర్వాత నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
అందాల పిట్టలండీ.. సంఖ్య పెరిగేనండీ
[ 24-04-2024]
కేంద్రపడ జిల్లా బితరకనిక జాతీయ ఉద్యానవనంలో మడ అడవి పక్షుల (మేన్గ్రోవ్ పిట్ట) సంఖ్య పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే వీటి సంతతి 39 పెరగడం గమనార్హం. -
గోపాల్పూర్లో ముఖాముఖి పోరు
[ 24-04-2024]
ప్రతిష్ఠాత్మక గోపాల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజద, భాజపా అభ్యర్థుల మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా కనిపిస్తోంది. -
భాజపా గూటికి మరో ఇద్దరు అగ్రనేతలు
[ 24-04-2024]
మాజీ మంత్రి బింబాధర్ కువార్, బిజద మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి నివేదితా నాయక్ భాజపా గూటికి చేరారు. -
మిత్రమండలి కొత్త కార్యవర్గం ఎంపిక
[ 24-04-2024]
బ్రహ్మపురలోని సుమారు 80 ఏళ్ల పురాతన ‘ఆంధ్ర విజ్ఞాన మిత్ర మండలి’ కొత్త కార్యవర్గం ఎంపిక సోమవారం రాత్రి జరిగింది. -
ముగిసిన తరాతరిణి చైత్ర మంగళవారాల యాత్ర
[ 24-04-2024]
గంజాం జిల్లాలోని సుప్రసిద్ధ తరాతరిణి శక్తిపీఠంలో చైత్ర మంగళవారాల యాత్ర ముగిసింది. అయిదో మంగళవారం సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కనిపించింది.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది