ప్రకృతి అందాల ఎకో రిట్రీట్
రాష్ట్రంలో పర్యటకపరంగా కొరాపుట్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ పర్యటక కేంద్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విదేశీ పర్యటకులు సైతం జిల్లాకు అధికంగా వస్తున్నారు.
ఎకో రిట్రీట్ కేంద్రం
సిమిలిగుడ, న్యూస్టుడే: రాష్ట్రంలో పర్యటకపరంగా కొరాపుట్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ పర్యటక కేంద్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విదేశీ పర్యటకులు సైతం జిల్లాకు అధికంగా వస్తున్నారు. దీంతో వారిని మరింత ఆకర్షించేందుకు రాష్ట్ర పర్యటకశాఖ ఎకో రిట్రీట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కొరాపుట్ జిల్లా సిమిలిగుడ సమీపంలో గతేడాది ఎకో రిట్రీట్ కేంద్రాన్ని తొలిసారిగా ఏర్పాటు చేయగా మంచి ఆదరణ లభించగా, మళ్లీ ఈ ఏడాది కూడా ఎకో రిట్రీట్ను ఏర్పాటు చేశారు. గతంలో రాజస్థాన్కు చెందిన సంస్థ నిర్వహణ బాధ్యత చేపట్టగా కొన్ని తప్పులు జరిగిన నేపథ్యంలో ఈసారి దిల్లీకి చెందిన సంస్థకు జిల్లా యంత్రాంగం నిర్వహణ బాధ్యత అప్పగించింది. ఈ నెల 1న ఈ కేంద్రాన్ని సీఎం నవీన్ పట్నాయక్ వీసీ ద్వారా ప్రారంభించారు. అనంతరం పొట్టంగి ఎమ్మెల్యే ప్రీతమ్ పాఢి ప్రజలకు అంకితం చేశారు. కేవలం శీతాకాలంలోనే ఏర్పాటయ్యే ఈ కేంద్రంలో విడిది చేయాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవలసి ఉంటుంది. రాత్రి బస చేసేందుకు టెంట్లు, ప్రత్యేక ఇండోర్, అవుట్డోర్ క్రీడలు, ఆదివాసీ నృత్యాలు, పర్వతారోహణ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. 5 ప్రీమియం, 20 డీలక్స్ కాటేజ్లు, ఒక రెస్టారెంట్, 24 గంటల పోలీస్, వైద్య సేవలు ఉంటాయి. పుట్సీల్, ఫుల్బందొ గ్రామాల మధ్య గిర్లీ మాలి పర్వతంపై ఏర్పాటు చేసిన ఈ కేంద్రానికి సిమిలిగుడ మీదుగా వయా దుదారివైపు 25 కి.మీ.లు ప్రయాణిస్తే చేరుకోవచ్చు. నాలుగు వైపులా ఆహ్లాదం కలిగించే సుందర దృశ్యాలు ప్రతి సమ్మోహితులను చేస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
71 అసెంబ్లీ స్థానాలకు పోటీచేసేది వీరే..
[ 28-03-2024]
ముఖ్యమంత్రి, బిజద అధినేత నవీన్ పట్నాయక్ బుధవారం మధ్యాహ్నం వీడియో సందేశం ద్వారా 71 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా స్వయంగా ప్రకటించారు. -
బిజద లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
[ 28-03-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 21 లోక్సభ స్థానాలకుబుధవారం 15 మందితో తొలి జాబితా ప్రకటించారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. -
దాహం కేకలు
[ 28-03-2024]
రాయగడ జిల్లాలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు కటకటలాడుతున్నారు. -
తండ్రి ‘హస్తం’ కాదని... ‘శంఖం’ పిడికిట పట్టుకొని..
[ 28-03-2024]
సీనియర్ కాంగ్రెస్ నేత, ఖుర్దా జిల్లా జట్నీ ఎమ్మెల్యే సురేష్ రౌత్రాయి చిన్న కుమారుడు కెప్టెన్ మన్మధ రౌత్రాయి బుధవారం బిజదలో చేరారు. -
బస్సు బోల్తా: ఒకరి మృతి, 20 మందికి గాయాలు
[ 28-03-2024]
కొరాపుట్ నుంచి రాయగడకు వెళ్లే మార్గంలో పొడఘడ్ వద్ద మంగళవారం రాత్రి బస్సు బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా, 20 మందికి గాయాలయ్యాయి. -
చిట్ పేరిట రూ. 2 కోట్లకుపైగా టోకరా
[ 28-03-2024]
చిట్ఫండ్ పేరిట ఓ మహిళ రూ.2 కోట్లకుపైగా టోకరా వేసిన ఉదంతం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. -
ఆహుతవుతున్న పచ్చదనం
[ 28-03-2024]
రాష్ట్రంలో పచ్చదనం అగ్నికి ఆహుతవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2030 నాటికి అడవులకు నిప్పు ఘటనలు మరింత తీవ్ర రూపం దాల్చనున్నట్లు అధ్యయనాలు పేర్కొంటుండడం గుబులు రేపుతోంది. -
కేజ్రీవాల్పై కుట్ర పన్నారు
[ 28-03-2024]
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర పన్ని, తప్పుడు కేసులో అరెస్టు చేసి, అన్యాయంగా జైల్లో పెట్టారని ఆప్ నాయకులు ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత