logo

బిజదను ఆశీర్వదిస్తారు

పద్మపూర్‌ ఉప ఎన్నికలో ఓటర్లు బిజదను ఆశీర్వదిస్తారన్న ఆశాభావం ఉందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ చెప్పారు.

Published : 06 Dec 2022 03:24 IST

దిల్లీలో నవీన్‌

మహిళా మహా సంఘాల ప్రతినిధులతో సీఎం నవీన్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: పద్మపూర్‌ ఉప ఎన్నికలో ఓటర్లు బిజదను ఆశీర్వదిస్తారన్న ఆశాభావం ఉందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జీ-20 సదస్సు నిర్వహణపై జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు హస్తిన వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. పద్మపూర్‌లో పార్టీ అభ్యర్థి విజయంపై పూర్తి నమ్మకం ఉందన్నారు.

మరిన్ని విజయాలు సాధించాలి

అంతకుముందు భువనేశ్వర్‌లోని నవీన్‌ నివాస్‌లో సోమవారం ఉదయం అనుగుల్‌, ఢెంకనాల్‌, జాజ్‌పూర్‌, బాలేశ్వర్‌, కేంద్రపడ, జగత్సింగ్‌పూర్‌ మహిళా మహా సంఘాల ప్రతినిధులు సీఎంను కలిశారు. తాము చేపడుతున్న కార్యక్రమాలు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా నవీన్‌ మాట్లాడుతూ.. మహిళా సంఘాలు మరిన్ని విజయాలు సాధించాలన్నది తన ఆశయమన్నారు. మీ అందరికీ అండగా ఉంటున్నానని, ఇకముందు కూడా ఉంటానని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని